పవార్ వ్యాఖ్యలపై ఉద్దవ్ ఠాక్రే కౌంటర్..
x

పవార్ వ్యాఖ్యలపై ఉద్దవ్ ఠాక్రే కౌంటర్..

తమది "చిన్న పార్టీ" కాదని స్పష్టం చేశారు శివసేన (యుబిటి) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే. ఎన్‌సిపి (ఎస్‌పి) అధినేత శరద్‌ చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు.


తమది "చిన్న పార్టీ" కాదని స్పష్టం చేశారు శివసేన (యుబిటి) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే. ఎన్‌సిపి (ఎస్‌పి) అధినేత శరద్‌ చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. రాబోయే రెండేళ్లలో అనేక ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్‌తో జతకడతాయని పవార్ మీడియాతో అనడంతో ఠాక్రే బదులిచ్చారు.

“కొన్ని చిన్న ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్‌లో విలీనం కావచ్చని ఒక ప్రశ్నకు సమాధానంగా పవార్ సాహెబ్ అన్నారు. మీరు చెప్పండి, శివసేన చిన్న పార్టీనా? అని ప్రజలను అడిగారు.

2014, 2019 మాదిరి కాకుండా ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల సమయంలో తనకు ఎలాంటి సమస్యలు లేవని థాకరే పేర్కొన్నారు.

“ఎవరైనా దెయ్యాలకు భయపడితే 'రామ్, రామ్' అని జపించమని నా చిన్నతనంలో విన్నాను. ఓటమి భయంతో రాముడి నామస్మరణ చేస్తూ దేశవ్యాప్తంగా తిరుగుతున్నాడు' అని మోదీనుద్దేశించి ఠాక్రే ఆరోపించారు.

Read More
Next Story