యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు ఏమన్నారంటే..
భారత్ - పాక్ దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులను అగ్రరాజ్యం గమనిస్తోంది. అయితే ఆ వివాదంలో అమెరికా జోక్యం చేసుకోదని, అది అమెరికాకు సంబంధించినది కాదు అన్నారు అమెరికా ఉపాధ్యక్షుడు జెడి వాన్స్. దౌత్యం ద్వారా ఉద్రిక్తతను తగ్గించుకోవాలన్నారు. ఫాక్స్ న్యూస్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వాన్స్ మాట్లాడారు. అంతకుముందు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాను ఏదైనా సాయం చేయగలిగితే చేస్తానని చెప్పారు.
'యుద్ధం'పై అడిగిన ప్రశ్నకు సమాధానంగా.. "వారు చాలా కాలంగా పోరాడుతున్నారు. దశాబ్దాలుగా. ఇద్దరితోనూ మంచి సంబంధాలు ఉన్నాయి. యుద్ధం ఆగిపోవాలని నేను కోరుకుంటున్నాను. అని పేర్కొన్నారు.
Update: 2025-05-09 01:08 GMT