More Videos

VIEW ALL →
01
22 ఏ సమస్యను మళ్ళీ రేవంత్ దాటవేసారా?
రాజకీయాలు
16 Sept 2026 4:36 PM IST

'22 ఏ' సమస్యను మళ్ళీ రేవంత్ దాటవేసారా?

    ఈ రోజు జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి '22ఏ 'గురించి ఈ సారైనా స్పష్టత ఇస్తూ ,పరిష్కారం సుచిస్తారా అన్న ఆసక్తి నెలకొంది. ఈ సందర్భంలో రేవంత్ రెడ్డి ఈ సమస్య గురించి మాట్లాడారు. కానీ ఆయన ఈ సమస్య రావడానికి గల చారిత్రక కారణాలను నాలుగు దశలుగా విభజించి మాట్లాడారే తప్ప, దీని పరిష్కారాల గురించి ఎక్కడా చర్చించకపోవడం గమనార్హం. 

  నిజాం కాలం నుండి పరిస్థితులను అర్థం చేసుకుంటే తప్ప, ఈ సమస్య అర్థం కాదని అన్నారు. దీని గురించి నిజాం కాలం నుండి ఎలా సమస్య ఉత్పన్నం అయ్యిందో ,అలాగే స్వాతంత్ర్యం వచ్చాక కూడా ఆ సమస్య ఎలా కొనసాగిందో చెబుతూ ఇప్పటివరకూ ఉన్న సమస్యల గురించి ప్రస్తావించారు. 

        అయితే ఆంధ్రాలో పరిస్థితి భిన్నమని అక్కడ బ్రిటిష్ పాలన ఉంది కనుక వాళ్ళు పక్కాగా శిస్తు వసూలు కోసం అన్ని రికార్డులు నిర్వహించారని ఇక్కడ పరిస్థితి వేరని అన్నారు. మొత్తానికి ఈ విషయం మీద మాట్లాడుతూ,చరిత్ర అంత చెప్పి కూడా పరిష్కారం ఏంటి అనేది స్పష్టం చేయకపోవడం గమనార్హం.


02
UPIపై 0.4% ఛార్జ్.. ట్రేడర్ల ఆగ్రహం
మేటి కథనాలు
16 Sept 2026 1:40 PM IST

UPIపై 0.4% ఛార్జ్.. ట్రేడర్ల ఆగ్రహం

UPI పేమెంట్ అంటే ఇప్పటి వరకు కస్టమర్‌కి ఫ్రీ. వ్యాపారికీ ఫ్రీ! కానీ ఇప్పుడు ఈ లెక్క మారుతోంది. ₹2,000 దాటిన కొన్ని UPI merchant paymentsపై 0.4 శాతం MDR! 0.4 శాతం అంటే చాలా చిన్నదిగా అనిపిస్తోంది కదా? ₹5,000 పేమెంట్‌కి కేవలం ₹20. ₹10,000కి ₹40. ₹50,000కి ₹200. కానీ రోజుకు లక్షలు, కోట్ల రూపాయల UPI పేమెంట్లు తీసుకునే వ్యాపారులకు ఇదే 0.4 శాతం. నెలాఖరులో వేల నుంచి లక్షల రూపాయల ఖర్చుగా మారొచ్చు. ఇప్పటివరకు ఫ్రీగా ఉన్న UPI వ్యవస్థలో ఈ మార్పు ఎందుకు అవసరమైంది? ఇదే ఇప్పుడు UPI చుట్టూ మొదలైన అసలు చర్చ.

2026 ఆగస్టులోనే UPI ద్వారా 24,508.96 మిలియన్ ట్రాన్సాక్షన్లు, అంటే సుమారు 24.5 బిలియన్ లావాదేవీలు, ₹29.82 లక్షల కోట్ల విలువతో జరిగాయి. అయితే, ఇదే UPI ఇకపై పెద్ద మొత్తాల లావాదేవీలపై వ్యాపారులకు అదనపు ఖర్చు తెచ్చిపెట్టనుంది. అక్టోబర్ 15, 2026 నుంచి ₹2,000 దాటిన నిర్దిష్ట Person-to-Merchant (P2M) UPI లావాదేవీలపై 0.4 శాతం Merchant Discount Rate (MDR) అమల్లోకి రానుంది.

ఇక్కడే ట్రేడర్లలో ఆందోళన మొదలైంది. 0.4 శాతం అంటే చిన్న సంఖ్యలా కనిపించినా.. రోజుకు వేల రూపాయలు, లక్షల రూపాయల UPI పేమెంట్లు తీసుకునే వ్యాపారులకు నెలాఖరులో ఇది గణనీయమైన ఖర్చుగా మారొచ్చని వారు చెబుతున్నారు.  ఉదాహరణకు ₹3,000 UPI పేమెంట్‌పై MDR ₹12. ₹50,000 లావాదేవీకి ₹200. ₹75,000 దాటితే 0.4 శాతం లెక్కన ఎక్కువ వచ్చినా.. ఒక్క లావాదేవీకి గరిష్ఠంగా ₹300కే పరిమితం చేస్తారు. ఈ మొత్తం కస్టమర్‌ నుంచి కాకుండా వ్యాపారి వైపు నుంచి వసూలవుతుందని ర‌మేష్ అనే వ్యాపారి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

“మార్జిన్ ఇప్పటికే తక్కువగా ఉంది. UPIని కస్టమర్లు ఎక్కువగా ఉపయోగిస్తున్న సమయంలో ప్రతి పెద్ద లావాదేవీపై MDR చెల్లించాల్సి వస్తే, అది మా నిర్వహణ ఖర్చులను పెంచుతుంది. నగదు లావాదేవీల కంటే డిజిటల్ పేమెంట్లను ప్రోత్సహించాల్సిన సమయంలో కొత్త ఖర్చు ఎందుకు?” అని రిటైల్ వ్యాపారి వీర‌బాబు ఆందోళన వ్యక్తం చేశారు. 

మరో వ్యాపారి వెంక‌ట రాజ కోణంలో చూస్తే.. “రోజుకు ₹5 లక్షల UPI వ్యాపారం జరిగితే, అర్హత ఉన్న మొత్తం లావాదేవీలకు 0.4 శాతం వర్తించే సందర్భంలో రోజువారీ ఖర్చు ₹2,000 వరకు రావచ్చు. చిన్న మార్జిన్‌తో నడిచే వ్యాపారాలకు ఇది తేలికైన విషయం కాదు” అనేది ట్రేడర్ల వాదన.

అయితే ఈ మార్పు అన్ని UPI పేమెంట్లకూ వర్తించదు. వ్యక్తి నుంచి వ్యక్తికి చేసే P2P లావాదేవీలు పూర్తిగా ఉచితంగానే ఉంటాయి. ₹2,000 వరకు ఉండే పేమెంట్లు, అలాగే నిర్దిష్ట చిన్న వ్యాపారుల zero-MDR లావాదేవీలు కూడా ఉచితమే. ప్రభుత్వం ప్రకారం మొత్తం P2M లావాదేవీల్లో సుమారు 96 శాతం ఈ మార్పుతో ప్రభావితం కావు.

రైల్వేలు, టెలికాం, ఇన్సూరెన్స్, ఇంధనం వంటి కొన్ని రంగాలకు ₹2,000 దాటిన లావాదేవీలపై 0.4 శాతానికి బదులుగా ₹5 ఫ్లాట్ MDR విధానం ఉంటుంది. MDR ద్వారా వచ్చే మొత్తాన్ని ప్రభుత్వం లేదా NPCI పన్నుగా వసూలు చేయడం లేదని స్పష్టం చేసింది. బ్యాంకులు, పేమెంట్ యాప్స్ తదితర UPI ఎకోసిస్టమ్‌లోని భాగస్వాములకు ఇది పంపిణీ అవుతుంది. UPI మౌలిక వసతులు, సైబర్ సెక్యూరిటీ, ఆపరేషన్స్, భవిష్యత్ విస్తరణకు ఈ ఆదాయం ఉపయోగపడుతుందని అధికారిక వివరణ. 

అయితే ట్రేడర్లకు మాత్రం అసలు ప్రశ్న ఖర్చు గురించే. UPI సౌకర్యం కొనసాగుతూనే, దాని నిర్వహణ భారం ఎంత వరకు వ్యాపారులపై పడాలి? అన్న చర్చ ఇప్పుడు మొదలైంది.

03
తెలంగాణలో జనసేన ఎందుకు యాక్టివ్ అయ్యింది ?
రాజకీయాలు
15 Sept 2026 7:04 PM IST

తెలంగాణలో జనసేన ఎందుకు యాక్టివ్ అయ్యింది ?

22ఏ నిషేధి చట్టానికి వ్యతిరేకంగా, విద్యార్ధుల ఫీజు రీఎంబర్స్ మెంట్ డిమాండ్ తో జనసేన శ్రేణులు అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించారు

04
కుతుబ్‌షాహీ టూంబ్స్ నుంచి మూసీ వరకు.. ఆగాఖాన్‌తో కొత్త ప్లాన్?
వార్తలు
15 Sept 2026 5:08 PM IST

కుతుబ్‌షాహీ టూంబ్స్ నుంచి మూసీ వరకు.. ఆగాఖాన్‌తో కొత్త ప్లాన్?

ర‌చ్చ‌ - రాజ‌కీయం @ 5 పి.ఎం.

1) కుతుబ్‌షాహీ టూంబ్స్ నుంచి మూసీ వరకు.. ఆగాఖాన్‌తో కొత్త ప్లాన్?

2) హైదరాబాద్‌లో GCC బూమ్! 3 లక్షల ఉద్యోగాలు!

3) బేగంబజార్‌లో గోల్డెన్ గణేశుడు.. 3.83 లక్షల డైమండ్స్‌తో ధగధగ! 

1) కుతుబ్‌షాహీ టూంబ్స్ నుంచి మూసీ వరకు.. ఆగాఖాన్‌తో సి.ఎం. రేవంత్ కొత్త ప్లాన్?

హైదరాబాద్‌కు ఉన్న చారిత్రక వారసత్వాన్ని కాపాడటమే కాదు, అదే హెరిటేజ్‌ను నగర అభివృద్ధిలో భాగం చేయాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోందా?  సీఎం రేవంత్‌రెడ్డి, ఆగాఖాన్ డెవలప్‌మెంట్ నెట్‌వర్క్ చైర్మన్ ప్రిన్స్ రహీమ్ ఆగాఖాన్ Vతో భేటీ కావడం ఇప్పుడు ఇదే చర్చకు కారణమవుతోంది.

తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్‌లో జరిగిన ఈ భేటీలో, తెలంగాణలో హెరిటేజ్ సంరక్షణకు ఆగాఖాన్ ఫౌండేషన్ ఇప్పటికే చేసిన సేవలను సీఎం ప్రశంసించారు. ముఖ్యంగా కుతుబ్‌షాహీ టూంబ్స్‌, లెజిస్లేటివ్ కౌన్సిల్ భవనం పునరుద్ధరణలో ఆగాఖాన్ ట్రస్ట్ ఫర్ కల్చర్ పాత్రను ప్రస్తావించారు.

మూసీ పరివాహక ప్రాంతంలోని చారిత్రక కట్టడాల పునరుద్ధరణకు కూడా ఆగాఖాన్ సంస్థల సహకారం కావాలని సీఎం కోరారు.  సిటీ కాలేజ్, ఉస్మానియా ఆసుపత్రి వంటి చారిత్రక భవనాలను కాపాడటంతో పాటు, మూసీ రివర్‌ఫ్రంట్‌ను కూడా హెరిటేజ్, టూరిజం, అర్బన్ డెవలప్‌మెంట్‌తో అనుసంధానం చేయాలన్న ఆలోచన ప్రభుత్వానికి ఉంది.  అంటే, ఇది కేవలం ఒక భేటీ కాదు. హైదరాబాద్ హెరిటేజ్‌ను కొత్త ఆర్థిక మోడల్‌గా మార్చే ప్రయత్నమా? అన్నదే అసలు ప్రశ్న.

ఆగాఖాన్ సంస్థలతో తెలంగాణ ప్రభుత్వానికి ఉన్న భాగస్వామ్యం కొత్తది కాదు. దానికి హైదరాబాద్‌లో కనిపించే రెండు పెద్ద ఉదాహరణలు. కుతుబ్‌షాహీ టూంబ్స్‌, లెజిస్లేటివ్ కౌన్సిల్ భవనం.

కుతుబ్‌షాహీ టూంబ్స్ సుమారు 106 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఈ హెరిటేజ్ కాంప్లెక్స్‌లో 70 చారిత్రక నిర్మాణాలు ఉన్నాయి. ఇందులో సమాధులు, మసీదులు, స్టెప్‌వెల్స్‌, హమామ్‌లు, ప్యావిలియన్లు ఉన్నాయి. ఆగాఖాన్ ట్రస్ట్ ఫర్ కల్చర్.. తెలంగాణ ప్రభుత్వ భాగస్వామ్యంతో దీన్ని అర్బన్ ఆర్కియాలజికల్ పార్క్‌గా అభివృద్ధి చేస్తోంది.  2013లో ప్రారంభమైన ఈ ప్రాజెక్టుకు తొలుత సుమారు ₹100 కోట్ల వ్యయం అంచనా వేశారు. అయితే అప్పటి అధికారులు మొత్తం వ్యయం ₹200 కోట్ల వరకు వెళ్లొచ్చని చెప్పారు. అంటే ఇది చిన్న స్థాయి రిపేర్ ప్రాజెక్ట్ కాదు. దశాబ్ద కాలం పాటు సాగిన భారీ కన్జర్వేషన్ కార్యక్రమం.

లెజిస్లేటివ్ కౌన్సిల్ భవనం 1905లో ప్రారంభమై 1913లో పూర్తైన ఈ ఇండో-సారసెనిక్ భవనం దశాబ్దాల పాటు నిరుపయోగంగా ఉండి పోయింది. ఆ తర్వాత ఆగాఖాన్ ట్రస్ట్ ఫర్ కల్చర్‌తో కలిసి తెలంగాణ ప్రభుత్వం సుమారు ₹30 కోట్లతో పునరుద్ధరణ చేపట్టింది. దాదాపు 18 నెలల పాటు జరిగిన పనుల్లో డ్రైనేజీ, పైకప్పు, ఫ్లోరింగ్, ఎలక్ట్రికల్ వ్యవస్థలతో పాటు చారిత్రక నిర్మాణ అంశాలను పునరుద్ధరించారు.  అంటే,  ఈ రెండు ప్రాజెక్టులే చూస్తే వందల కోట్ల విలువైన హెరిటేజ్ కన్జర్వేషన్ ఎకోసిస్టమ్ హైదరాబాద్‌లో ఇప్పటికే ఏర్పడింది.

రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఆగాఖాన్ ఫౌండేషన్ సహకారం కోరుతున్న ప్రధాన ప్రాంతాల్లో సిటీ కాలేజ్, ఉస్మానియా ఆసుపత్రి ఉన్నాయి. ప్రత్యేకంగా పాత ఉస్మానియా ఆసుపత్రి భవనాన్ని కొత్త ఆసుపత్రిగా కాకుండా ఒక హెరిటేజ్ అసెట్‌గా అభివృద్ధి చేయాలన్న ఆలోచన ప్రభుత్వం ముందుకు తెచ్చింది. కొత్త ఉస్మానియా ఆసుపత్రిని గోషామహల్‌లో నిర్మిస్తున్నారు.

ఇక మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్న మరిన్ని చారిత్రక కట్టడాలను కూడా భవిష్యత్తులో పునరుద్ధరించే అవకాశం ఉంది.  గతంలోనే హైదరాబాద్‌లోని ఇతర హెరిటేజ్ ప్రాజెక్టులకు కూడా ఆగాఖాన్ ట్రస్ట్ భాగస్వామ్యంపై ప్రతిపాదనలు వచ్చాయి.  మిర్ ఆలం మండి పునరుద్ధరణకు సుమారు ₹16.14 కోట్లు, ఖుర్షీద్ జా దేవ్డీ పునరుద్ధరణకు సుమారు ₹10 కోట్లు ఖర్చు అంచనాలు ప్రకటించబడ్డాయి. సైదానీమా టూంబ్‌, షైక్‌పేట్ సరాయ్ వంటి నిర్మాణాలకు కూడా పునరుద్ధరణ ప్రణాళికలు ప్రకటించారు. అంటే,  ఇప్పటికే ఉన్న ప్రాజెక్టులు, కొత్తగా ప్రతిపాదిస్తున్న ప్రాజెక్టులు కలిస్తే, హెరిటేజ్ కన్జర్వేషన్‌లో వందల కోట్ల పెట్టుబడికి అవకాశాలు వున్నాయి. 

అయితే ఇక్కడ ఒక క్లారిటీ.  ఆగాఖాన్ నుంచి తెలంగాణకు ఇంత మొత్తం పెట్టుబడి వస్తుందని ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్యాకేజీ ప్రకటించలేదు.  కానీ, భవిష్యత్తులో భారీ హెరిటేజ్ ప్రాజెక్టులకు అంతర్జాతీయ నిధులు, నిపుణుల సహకారం వచ్చే అవకాశం ఉంది.

అయితే రేవంత్‌రెడ్డి ఎందుకు ఆగాఖాన్ సంస్థల వైపు చూస్తున్నారంటే, కేవలం భవనాలను బాగు చేయడం కాదు.  ఆగాఖాన్ ట్రస్ట్ ఫర్ కల్చర్‌కు హెరిటేజ్ కన్జర్వేషన్‌తో పాటు heritage-led urban renewalలో అంతర్జాతీయ అనుభవం ఉంది. కుతుబ్‌షాహీ టూంబ్స్‌ను కేవలం సమాధుల సముదాయంగా కాకుండా, అర్బన్ ఆర్కియాలజికల్ పార్క్‌గా, భవిష్యత్తులో గోల్కొండతో కలిపి అభివృద్ధి చేసే ఆలోచన కూడా ఉంది.

అదే మోడల్‌ను మూసీకి తీసుకురావాలన్నది తెలంగాణ ప్రభుత్వ ఆలోచనగా కనిపిస్తోంది. ఒకవైపు  చారిత్రక కట్టడాల పునరుద్ధరణ. మరోవైపు హెరిటేజ్ టూరిజం. ఇంకోవైపు మూసీ రివర్‌ఫ్రంట్. వీటన్నింటినీ కలిపితే హైదరాబాద్‌కు కొత్త టూరిజం సర్క్యూట్‌, కొత్త కమర్షియల్ యాక్టివిటీ, కొత్త ఉపాధి అవకాశాలు రావచ్చనే అంచనా.

ఇదే కారణంగా ప్రిన్స్ రహీమ్ ఆగాఖాన్‌ను డిసెంబర్‌లో జరిగే తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌కు కూడా సీఎం ఆహ్వానించారు. Future City వేదికగా జరిగే ఈ సమ్మిట్‌కు 100కు పైగా దేశాల ప్రతినిధులు వస్తారని ప్రభుత్వం చెబుతోంది.

అంటే.. కుతుబ్‌షాహీ టూంబ్స్‌తో మొదలైన భాగస్వామ్యం. కౌన్సిల్ భవనం వరకు వచ్చింది. ఇప్పుడు సిటీ కాలేజ్, ఉస్మానియా ఆసుపత్రి, మూసీ హెరిటేజ్ కారిడార్ వరకు విస్తరించే అవకాశముంది.మరి ఈ భాగస్వామ్యం ఎంత పెట్టుబడిని తీసుకొస్తుంది? ఎన్ని హెరిటేజ్ కట్టడాలకు కొత్త రూపు వస్తుంది? మూసీని హైదరాబాద్ కొత్త హెరిటేజ్-టూరిజం హబ్‌గా మార్చగలరా?  ఇదే ఇప్పుడు రేవంత్ ప్రభుత్వం–ఆగాఖాన్ భాగస్వామ్యానికి అసలు పరీక్ష.


2) హైదరాబాద్‌లో GCC బూమ్! 3 లక్షల ఉద్యోగాలు!

ఐటీ, ఫార్మా రంగాలకు ఇప్పటికే గ్లోబల్‌ గుర్తింపు తెచ్చుకున్న హైదరాబాద్‌, ఇప్పుడు మరో రంగంలోనూ దూసుకుపోతోంది. అదే గ్లోబల్‌ కెపాబిలిటీ సెంటర్లు. అంటే GCCలు. అసలు GCC అంటే....  ప్రపంచంలోని పెద్ద కంపెనీలు తమ కీలక కార్యకలాపాలను నిర్వహించేందుకు ఇతర దేశాల్లో ఏర్పాటు చేసే ప్రత్యేక కేంద్రాలే GCCలు. ఒకప్పుడు వీటిని కేవలం బ్యాక్ ఆఫీస్‌ లేదా కస్టమర్‌ సపోర్ట్‌ కేంద్రాలుగా చూసేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారింది.  సాఫ్ట్‌వేర్, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, డేటా, సైబర్‌ సెక్యూరిటీ, ఫైనాన్స్‌, రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌, ప్రొడక్ట్‌ డెవలప్‌మెంట్‌ వంటి కీలక పనులు కూడా GCCల నుంచే జరుగుతున్నాయి.

భారత్‌లో ఇప్పటికే 1,700కు పైగా GCCలు ఉన్నాయి. గత ఐదేళ్లలోనే దాదాపు 400 కొత్త కేంద్రాలు ఏర్పడ్డాయి. ఈ రంగంలో 19 లక్షలకుపైగా ఉద్యోగాలు ఉన్నాయని అంచనా.  2030 నాటికి GCCల సంఖ్య 2,400కు, ఉద్యోగాలు 28 లక్షలకు చేరే అవకాశం ఉందని అంచనాలు చెబుతున్నాయి. అంటే, ప్రపంచ కంపెనీలకు భారత్‌ కేవలం సేవల కేంద్రం కాదు. గ్లోబల్‌ ఆపరేషన్లకు కీలక కేంద్రంగా మారుతోంది.

మరి ఇంతటి GCCలకు హైదరాబాద్‌ ఎందుకు ప్రధాన కేంద్రంగా మారుతోంది?  దీనికి ప్రధాన కారణం టాలెంట్‌. ఐటీ, ఇంజినీరింగ్‌, ఫైనాన్స్‌, లైఫ్‌ సైన్సెస్‌ వంటి రంగాల్లో నైపుణ్యం ఉన్న యువత హైదరాబాద్‌లో పెద్ద సంఖ్యలో అందుబాటులో ఉంది. దీనికి తోడు, తక్కువ నిర్వహణ ఖర్చులు, బలమైన ఐటీ ఎకోసిస్టమ్‌, మెరుగైన మౌలిక వసతులు, ఆఫీస్‌ స్పేస్‌, ప్రభుత్వ ప్రోత్సాహక విధానాలు కూడా హైదరాబాద్‌కు కలిసొస్తున్నాయి. హైటెక్‌ సిటీ, గచ్చిబౌలి, ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌ వంటి ప్రాంతాల్లో ఇప్పటికే ప్రపంచ స్థాయి కంపెనీలు ఉండటం కూడా కొత్త GCCలకు అనుకూలంగా మారుతోంది. 

ఇప్పటికే Microsoft, Google, Amazon, JPMorgan, HSBC, Wells Fargo, Novartis వంటి అంతర్జాతీయ సంస్థలు హైదరాబాద్‌లో తమ కీలక కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయి.  ఇక కొత్తగా వస్తున్న GCCలు కూడా కేవలం సపోర్ట్‌ కార్యకలాపాలకే పరిమితం కావడం లేదు.  AI, R&D, డిజిటల్‌ ఇంజినీరింగ్‌, ప్రొడక్ట్‌ డెవలప్‌మెంట్‌, హెల్త్‌కేర్‌, BFSI, సెమీకండక్టర్స్‌ వంటి అధునాతన రంగాలపై కంపెనీలు ఫోకస్‌ చేస్తున్నాయి.  అందుకే, హైదరాబాద్‌ ఇప్పుడు GCCలకు ఒక ముఖ్యమైన హబ్‌గా మారుతోంది.

హైదరాబాద్‌లో ఎన్ని GCCలు? ఎంతమంది ఉద్యోగాలు?హైదరాబాద్‌లో GCCల విస్తరణ ఎంత వేగంగా జరుగుతోందంటే, మార్చి 2026 నాటికి నగరంలో 515 GCCలు ఉన్నాయని అంచనా.  వీటిలో 3 లక్షలకుపైగా నిపుణులు పనిచేస్తున్నారు.  అంతేకాదు,  వచ్చే ఏడాదిలోనే మరో 70 వరకు GCCలు హైదరాబాద్‌కు వచ్చే అవకాశం ఉందని అంచనాలు ఉన్నాయి.  దేశవ్యాప్తంగా ఉన్న GCCలలో దాదాపు 20 శాతం హైదరాబాద్‌లోనే ఉన్నాయని నివేదికలు చెబుతున్నాయి.  ఇక్కడ మరో కీలక అంశం ఉద్యోగాలు.

GCCలు పెరగడంతో సాధారణ ఉద్యోగాల కంటే హై-స్కిల్‌ ఉద్యోగాలకు డిమాండ్‌ పెరుగుతోంది.  సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరింగ్‌, AI, డేటా సైన్స్‌, సైబర్‌ సెక్యూరిటీ, ఫైనాన్స్‌, ప్రొడక్ట్‌ మేనేజ్‌మెంట్‌, ఇంజినీరింగ్‌ వంటి విభాగాల్లో అవకాశాలు పెరుగుతున్నాయి.  దీంతో నైపుణ్యం ఉన్న యువతకు గ్లోబల్‌ కంపెనీల్లో పనిచేసే అవకాశాలు పెరుగుతున్నాయి. అంటే, GCCల వల్ల హైదరాబాద్‌కు వస్తున్నది కేవలం ఉద్యోగాల సంఖ్య కాదు. ఉద్యోగాల నాణ్యత కూడా. 

GCCల ప్రభావం ఉద్యోగాల దగ్గరే ఆగిపోవడం లేదు.  వీటి రాకతో హైదరాబాద్‌లో ఆఫీస్‌ స్పేస్‌, రియల్‌ ఎస్టేట్‌, మౌలిక వసతులు కూడా వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి.  2021లో GCCల కోసం లీజైన ఆఫీస్‌ స్పేస్‌ సుమారు 19 లక్షల చదరపు అడుగులు ఉండగా, 2025 నాటికి ఇది 45 లక్షల చదరపు అడుగులకు పెరిగింది.  2026 తొలి ఆరు నెలల్లో హైదరాబాద్‌లో మొత్తం 52 లక్షల చదరపు అడుగుల వాణిజ్య స్థలం లీజు లేదా విక్రయం జరిగింది.  ఇందులో 40 నుంచి 45 శాతం వరకు GCCల వాటా ఉందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.  అంటే, ఒక GCC వచ్చినప్పుడు అక్కడ ఉద్యోగాలు మాత్రమే రావు. ఆఫీసులు అవసరం. ఆఫీసులకు మౌలిక వసతులు అవసరం. ఉద్యోగులకు ఇళ్లు, రవాణా, రెస్టారెంట్లు, ఇతర సేవలు అవసరం. దీంతో GCCల చుట్టూ ఒక పూర్తి బిజినెస్‌ ఎకోసిస్టమ్‌ తయారవుతోంది.

మొత్తంగా చూస్తే, GCCల విస్తరణ హైదరాబాద్‌ ఆర్థిక వ్యవస్థలో కొత్త మార్పులకు దారి తీస్తోంది.  ఉద్యోగాలు, పెట్టుబడులు,  ఆఫీస్‌ స్పేస్‌,  రియల్‌ ఎస్టేట్‌,  స్టార్టప్‌లు,  సర్వీస్‌ బిజినెస్‌లు,  ఇలా అనేక రంగాలపై GCCల ప్రభావం కనిపిస్తోంది.

అంతేకాదు. ప్రపంచ కంపెనీలకు హైదరాబాద్‌ కేవలం సర్వీసులు అందించే నగరంగా కాకుండా, ఇన్నోవేషన్‌, రీసెర్చ్‌, ప్రొడక్ట్‌ డెవలప్‌మెంట్‌కు కూడా కేంద్రంగా మారుతోంది.  ఫిక్కీ–అనరాక్‌ రూపొందించిన ‘హైదరాబాద్‌ 2035’ నివేదిక కూడా నగరం గ్లోబల్‌ కెపాబిలిటీ క్యాపిటల్‌గా ఎదిగే అవకాశాలను ప్రస్తావించింది.  అంటే,  ఒకప్పుడు ఐటీ సిటీగా గుర్తింపు పొందిన హైదరాబాద్‌,  ఇప్పుడు ఫార్మా, లైఫ్‌ సైన్సెస్‌తో పాటు GCCల ద్వారా మరో కొత్త దిశగా అడుగులు వేస్తోంది.


3) బేగంబజార్‌లో గోల్డెన్ గణేశుడు.. 3.83 లక్షల డైమండ్స్‌తో ధగధగ! 

హైదరాబాద్‌లో వినాయక చవితి సందడి అంబరాన్ని అంటుతోంది. నగరంలోని ప్రతి ప్రాంతంలో ప్రత్యేక గణేశ్ విగ్రహాలు భక్తులను ఆకట్టుకుంటున్నాయి. అయితే బేగంబజార్‌ ఫీల్‌ఖానాలో కొలువుదీరిన గణేశుడు మాత్రం ఇప్పుడు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు.ఎందుకంటే ఇది సాధారణ గణేశుడి విగ్రహం కాదు.. దాదాపు 48 కిలోల బరువున్న గణనాథుడు. మూడు అడుగుల ఎత్తులో ఉన్న ఈ విగ్రహానికి 24 క్యారెట్ల బంగారు పూతతో పాటు ఏకంగా 3 లక్షల 83 వేల 800 అమెరికన్ డైమండ్స్‌ను అలంకరణగా ఉపయోగించినట్లు నిర్వాహకులు తెలిపారు.

దీంతో విద్యుత్ దీపాల వెలుగుల్లో ఈ గణపయ్య మరింత మెరిసిపోతున్నారు. విగ్రహాన్ని చూసేందుకు భక్తులు, నగరవాసులు ఆసక్తిగా తరలివస్తున్నారు.ఈ గణేశుడి ప్రత్యేకత కేవలం బంగారు పూత, లక్షలాది అమెరికన్ డైమండ్స్ మాత్రమే కాదు. విగ్రహం రూపకల్పనలోనూ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు.  ముంబై లాల్‌బాగ్చా రాజా. తిరుమల శ్రీవారి రూపం. ఈ రెండు ప్రసిద్ధ దైవ రూపాల స్ఫూర్తితో గణనాథుడిని తీర్చిదిద్దినట్లు నిర్వాహకులు చెబుతున్నారు.

అంటే ఒకవైపు ముంబైలో అత్యంత ప్రసిద్ధి చెందిన లాల్‌బాగ్చా రాజా శైలి. మరోవైపు తిరుమల వెంకటేశ్వర స్వామి రూపం.. ఈ రెండింటి స్ఫూర్తిని కలిపి ఈ గణపతి రూపాన్ని రూపొందించారు.అందుకే విగ్రహం దగ్గరికి వెళ్లిన భక్తులకు సాధారణ గణేశుడి దర్శనానికి భిన్నమైన అనుభూతి కలుగుతోంది. బంగారు మెరుపులు, వేలాది డైమండ్‌ల మెరుపులతో ఈ గణనాథుడు ప్రత్యేకంగా కనిపిస్తున్నారు.

ఈ ప్రత్యేక గణేశుడిని బేగంబజార్ ఫీల్‌ఖానాకు చెందిన అనిల్ అగర్వాల్, ఆధార్ అగర్వాల్, నిఖితేష్ అగర్వాల్ అనే అన్నదమ్ములు ఏర్పాటు చేయించారు.  ఫీల్‌ఖానాలోని తమ దుకాణం వద్ద ఏర్పాటు చేసిన మండపంలో ఈ విగ్రహాన్ని ప్రతిష్టించారు. విగ్రహం తయారీ, అలంకరణలో నైపుణ్యం కలిగిన కళాకారులు పనిచేశారు.  వినాయక చవితి సందర్భంగా 11 రోజుల పాటు పూజలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. దీంతో ఈ ప్రాంతం పండుగ వాతావరణంతో కళకళలాడుతోంది.

హైదరాబాద్ అంటేనే ఘనమైన గణేశ్ ఉత్సవాలకు పెట్టింది పేరు. ఖైరతాబాద్ గణేశుడు, బాలాపూర్ లడ్డూ వంటి ప్రత్యేకతలతో ప్రతి ఏడాది నగరంలోని గణేశ్ ఉత్సవాలు దేశవ్యాప్తంగా దృష్టిని ఆకర్షిస్తుంటాయి.  ఇప్పుడు ఆ జాబితాలో బేగంబజార్ ఫీల్‌ఖానా గణేశుడు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాడు.

48 కిలోల బరువు. 24 క్యారెట్ల బంగారు పూత. 3 లక్షల 83 వేల 800 అమెరికన్ డైమండ్స్. లాల్‌బాగ్చా రాజా, తిరుమల శ్రీవారి రూపాల స్ఫూర్తి. ఇలా అనేక ప్రత్యేకతలు ఈ గణనాథుడిని హైదరాబాద్ గణేశ్ ఉత్సవాల్లో మరో హైలైట్‌గా మార్చాయి.  భక్తి, కళాత్మకత, వైభవం కలగలిసిన ఈ ‘బంగారు గణేశుడు’ ఇప్పుడు బేగంబజార్‌లో అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాడు.

05
సర్ చట్టబద్ధం కాదు
రాజకీయాలు
15 Sept 2026 4:13 PM IST

'సర్ చట్టబద్ధం కాదు'

తెలంగాణలో ప్రస్తుతం జరుగుతున్న 'సర్' ప్రక్రియ ఓటర్లలో  తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుతం చెల్లుబాటు అయ్యే ఆధార్, పాస్‌పోర్ట్ లేదా ఓటర్ ఐడీ వంటి అధికారిక కార్డులు ఉన్నప్పటికీ, అధికారులు పాత కాలపు రికార్డులు అడుగుతుండటంతో ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. ముఖ్యంగా తల్లిదండ్రుల నాటి పాత వివరాలు, 2002 నాటి నివాస రికార్డులు, కుటుంబ చరిత్రకు సంబంధించిన ఆధారాలను చూపించాలనడం సామాన్యులకు పెద్ద సమస్యగా మారింది. దశాబ్దాల క్రితం నాటి పత్రాలు అందుబాటులో లేకపోవడంతో నిజమైన ఓటర్లు తమ హక్కును నిరూపించుకోలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఒక పౌరుడు తన ప్రాథమిక ఓటు హక్కును నిలబెట్టుకోవడానికి తన కుటుంబ పూర్వీకుల చరిత్రను ఎంతవరకు నిరూపించుకోవాలనే ప్రశ్న బలంగా ఉత్పన్నమవుతోంది.

దీని గురించి 'ఫెడరల్ పొలిటికల్ పాయింట్' లో చర్చ.

‘సర్ ప్రక్రియ తప్పకుండా జరగాలి.కొన్ని లోపాలు ఉన్నంతమాత్రాన ‘సర్’ ప్రక్రియ పట్ల వ్యతిరేకత పెంచుకోకూడదు.’సర్’ లేకపోతే జరిగే నష్టమే ఎక్కువ.’

-కృష్ణారెడ్డి, అసోసియేట్ ఎకనామిక్స్ ప్రొఫెసర్, హెచ్సియు

‘సర్ ప్రక్రియ చట్టబద్ధం కాదు.అసలు ఇప్పుడు ఎన్నికల అధికారులు అడుగుతున్న ఇన్ని డాక్యుమెంట్స్ అడిగే చట్టబద్దత సర్ కి లేదు.అది ప్రజాస్వామ్యస్పూర్తికి వ్యతిరేకం.’

-వి.ఎస్.ప్రసాద్ శాస్త్రి, రిటైర్డ్ ఐఆర్ఎస్ ఆఫీసర్ 

‘సర్ ప్రక్రియ వల్ల లక్షల ఓట్ల తొలగింపు జరుగుతోంది. చిత్తశుద్ధి లేకుండా ఈ ప్రక్రియను నిర్వహించడం వల్ల జరిగే లాభం కన్నా నష్టమే ఎక్కువ.’

-నరేంద్ర చలసాని,జర్నలిస్ట్

‘డేంజర్ జోన్’ లో 18 జిల్లాలు
రాజకీయాలు

‘డేంజర్ జోన్’ లో 18 జిల్లాలు

22 ఏ సమస్యను మళ్ళీ రేవంత్ దాటవేసారా?
రాజకీయాలు

'22 ఏ' సమస్యను మళ్ళీ రేవంత్ దాటవేసారా?

సర్ చట్టబద్ధం కాదు
రాజకీయాలు

'సర్ చట్టబద్ధం కాదు'

సర్వేలు కాంగ్రెస్ కొత్త అస్త్రమా?
రాజకీయాలు

'సర్వే'లు కాంగ్రెస్ కొత్త అస్త్రమా?

అసెంబ్లీ సమావేశాల్లో రాజుకున్న దళిత కార్డ్ రాజకీయాలు
రాజకీయాలు

అసెంబ్లీ సమావేశాల్లో రాజుకున్న 'దళిత కార్డ్' రాజకీయాలు

వామపక్షాల మద్దతే రేవంత్‌కు దిక్కా ?
రాజకీయాలు

వామపక్షాల మద్దతే రేవంత్‌కు దిక్కా ?

కాంగ్రెస్ ‘ఓబిసి కార్డ్’ వర్కవుట్ అవుతుందా?
రాజకీయాలు

కాంగ్రెస్ ‘ఓబిసి కార్డ్’ వర్కవుట్ అవుతుందా?

భూసేకరణలో పెరిగిపోతున్న ‘సెక్షన్ 10 ఏ’ దుర్వినియోగం
రాజకీయాలు

భూసేకరణలో పెరిగిపోతున్న ‘సెక్షన్ 10 ఏ’ దుర్వినియోగం

కొండ సురేఖ బర్తరఫ్ ... ఇక క్యాస్ట్ కార్డే శరణ్యమా?
రాజకీయాలు

కొండ సురేఖ బర్తరఫ్ ... ఇక 'క్యాస్ట్ కార్డే' శరణ్యమా?

అస్తవ్యస్తంగా మారిన సర్ ప్రక్రియ
రాజకీయాలు

అస్తవ్యస్తంగా మారిన 'సర్' ప్రక్రియ

వెయ్యిరోజుల రేవంత్ పాలన ప్రజల్ని మెప్పించిందా ?
రాజకీయాలు

వెయ్యిరోజుల రేవంత్ పాలన ప్రజల్ని మెప్పించిందా ?

పొలిటికల్ హీట్ పెంచుతున్న ఎమ్మెల్సీ ఎన్నికలు
రాజకీయాలు

పొలిటికల్ హీట్ పెంచుతున్న ఎమ్మెల్సీ ఎన్నికలు

సెప్టెంబర్ 17.. తెలంగాణలో 2 కార్యక్రమాలు.. 2 భిన్న రాజకీయ కథనాలు!
వార్తలు

సెప్టెంబర్ 17.. తెలంగాణలో 2 కార్యక్రమాలు.. 2 భిన్న రాజకీయ కథనాలు!

హైదరాబాద్ గణేశ్ ఉత్సవాలకు 130 ఏళ్ల చరిత్ర..
వార్తలు

హైదరాబాద్ గణేశ్ ఉత్సవాలకు 130 ఏళ్ల చరిత్ర..

కుతుబ్‌షాహీ టూంబ్స్ నుంచి మూసీ వరకు.. ఆగాఖాన్‌తో కొత్త ప్లాన్?
వార్తలు

కుతుబ్‌షాహీ టూంబ్స్ నుంచి మూసీ వరకు.. ఆగాఖాన్‌తో కొత్త ప్లాన్?

హైరైజ్‌లో ఫైర్ అయితే.. మీ ఎస్కేప్ రూట్ ఏంటి?
వార్తలు

హైరైజ్‌లో ఫైర్ అయితే.. మీ ఎస్కేప్ రూట్ ఏంటి?

పెళ్లిళ్లకు 34 రోజుల గ్యాప్... వేల కోట్ల వెడ్డింగ్ బిజినెస్‌కు షాక్?
వార్తలు

పెళ్లిళ్లకు 34 రోజుల గ్యాప్... వేల కోట్ల వెడ్డింగ్ బిజినెస్‌కు షాక్?

పబ్‌లో గ్యాంగ్‌వార్! హైదరాబాద్‌ నైట్‌లైఫ్‌ వెనుక ఏం జరుగుతోంది?
వార్తలు

పబ్‌లో గ్యాంగ్‌వార్! హైదరాబాద్‌ నైట్‌లైఫ్‌ వెనుక ఏం జరుగుతోంది?

తీజ్ వేడుకలు.. జేఎన్టీయూలో రణరంగం!
వార్తలు

తీజ్ వేడుకలు.. జేఎన్టీయూలో రణరంగం!

హైదరాబాద్‌లో గజం రూ.2.70 లక్షలు..!
వార్తలు

హైదరాబాద్‌లో గజం రూ.2.70 లక్షలు..!

గ్లోబల్ సమ్మిట్‌లో డిఫెన్స్ ఎక్స్‌పో..
వార్తలు

గ్లోబల్ సమ్మిట్‌లో డిఫెన్స్ ఎక్స్‌పో..

రంగనాథ్‌కు బిగ్ రిలీఫ్! సింగిల్ బెంచ్ తీర్పుపై స్టే
వార్తలు

రంగనాథ్‌కు బిగ్ రిలీఫ్! సింగిల్ బెంచ్ తీర్పుపై స్టే

రేవంత్ ప్రభుత్వాన్ని తాకనున్న రిటైర్మెంట్ వేవ్!  ఖజానాకు ట్రిపుల్ షాక్
వార్తలు

రేవంత్ ప్రభుత్వాన్ని తాకనున్న రిటైర్మెంట్ వేవ్! ఖజానాకు ట్రిపుల్ షాక్

అనుమతులొచ్చాయి.. నిధులున్నాయి.. మరి RRR ఎందుకు ఆగింది?
వార్తలు

అనుమతులొచ్చాయి.. నిధులున్నాయి.. మరి RRR ఎందుకు ఆగింది?

దృక్పధం

బీసీలకు రాజ్యాధికారం పగటికలే
రాజకీయాలు

బీసీలకు రాజ్యాధికారం పగటికలే

సెప్టెంబర్ 17 ఎందుకు వివాదాస్పదమైంది ?
రాజకీయాలు

సెప్టెంబర్ 17 ఎందుకు వివాదాస్పదమైంది ?

తెలంగాణలో జనసేన ఎందుకు యాక్టివ్ అయ్యింది ?
రాజకీయాలు

తెలంగాణలో జనసేన ఎందుకు యాక్టివ్ అయ్యింది ?

అసెంబ్లీ వ్యవహారాలపై కోర్టుల్లో పెరిగిపోతున్న కేసులు
రాజకీయాలు

అసెంబ్లీ వ్యవహారాలపై కోర్టుల్లో పెరిగిపోతున్న కేసులు

ముగ్గురు బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులపై ‘వేటు’ ?
రాజకీయాలు

ముగ్గురు బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులపై ‘వేటు’ ?

మొబైల్ వ్యసనం వల్ల పెరిగిపోతున్న మానసిక సమస్యలు
వార్తలు

మొబైల్ వ్యసనం వల్ల పెరిగిపోతున్న మానసిక సమస్యలు

ఇద్దరు బీఆర్ఎస్ ఎంఎల్సీల సస్పెన్షన్
రాజకీయాలు

ఇద్దరు బీఆర్ఎస్ ఎంఎల్సీల సస్పెన్షన్

అసెంబ్లీనా.. ఆధిపత్య పోరుకు వేదికా?
రాజకీయాలు

అసెంబ్లీనా.. ఆధిపత్య పోరుకు వేదికా?

తప్పుచేసిన కొండా సుస్మిత మీద యాక్షన్ తీసుకోవాలి
రాజకీయాలు

తప్పుచేసిన కొండా సుస్మిత మీద యాక్షన్ తీసుకోవాలి

సురేఖ బర్తరఫ్ పై డాటర్ స్ట్రోక్
రాజకీయాలు

సురేఖ బర్తరఫ్ పై డాటర్ స్ట్రోక్

అఘాయిత్యాలు తగ్గాలంటే ఇదొక్కటే మార్గం
వార్తలు

అఘాయిత్యాలు తగ్గాలంటే ఇదొక్కటే మార్గం

కవిత హామీలు ఆచరణ సాధ్యమేనా ?
రాజకీయాలు

కవిత హామీలు ఆచరణ సాధ్యమేనా ?