More Videos
VIEW ALL →
గ్లోబల్ సమ్మిట్లో డిఫెన్స్ ఎక్స్పో..
తెలంగాణను డిఫెన్స్ హబ్గా మార్చే ప్లాన్!

రంగనాథ్కు బిగ్ రిలీఫ్! సింగిల్ బెంచ్ తీర్పుపై స్టే
రచ్చ - రాజకీయం @ 5 పి.ఎం.
1) రంగనాథ్కు బిగ్ రిలీఫ్! సింగిల్ బెంచ్ తీర్పుపై స్టే
2) భారీగా పెరిగిన గణపతి విగ్రహాల ధరలు!
3) తెలంగాణలో వైరల్ ఫీవర్ అలర్ట్..
1) రంగనాథ్కు బిగ్ రిలీఫ్! సింగిల్ బెంచ్ తీర్పుపై స్టే
హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ను పదవి నుంచి తప్పించాలంటూ తెలంగాణ హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన ఆదేశాలు ఇప్పుడు కొత్త మలుపు తిరిగాయి. ఆ తీర్పును సవాలు చేస్తూ స్వయంగా రంగనాథ్ డివిజన్ బెంచ్ను ఆశ్రయించారు. ఇప్పుడు ఆయనకు హైకోర్టులో కీలక ఊరట లభించింది. సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను డివిజన్ బెంచ్ తాత్కాలికంగా సస్పెండ్ చేసింది. అసలు రంగనాథ్ను ఎందుకు పదవి నుంచి తప్పించాలని ఆదేశించారు? ఈ వివాదం ఎక్కడ మొదలైంది? కోర్టు చేసిన తీవ్రమైన వ్యాఖ్యలు ఏంటి? ఇప్పుడు డివిజన్ బెంచ్ ఇచ్చిన ఊరటతో ఈ కేసు ఎటు వెళ్తుంది?
ఈ మొత్తం వివాదానికి కేంద్రంగా నిలిచింది మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలోని లోతుకుంట గ్రామం. సర్వే నంబర్లు 1, 2లో ఉన్న సుమారు 40 ఎకరాల భూమిపై వివాదం కొనసాగుతోంది. జూలై 17, 2026న ఈ వివాదాస్పద భూమిలో హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. దీనిపై శాంతా శ్రీరామ్ కన్స్ట్రక్షన్స్ కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేసింది. కేసు విచారణ సందర్భంగా హైడ్రా చర్యలు, కోర్టు ఆదేశాల అమలు అంశాలు హైకోర్టు పరిశీలనకు వచ్చాయి.
జూలై 20న హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ స్వయంగా హైకోర్టు ఎదుట హాజరయ్యారు. అక్కడి నుంచి ఈ కేసు మరింత కీలక మలుపు తిరిగింది. జూలై 27న హైకోర్టు సింగిల్ జడ్జి కీలక ఉత్తర్వులు జారీ చేశారు. హైడ్రా కమిషనర్ పదవి నుంచి రంగనాథ్ను తప్పించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు ఇచ్చారు. ఆయన స్థానంలో మరో తగిన అధికారిని నియమించాలని కూడా సూచించారు.
ఈ సందర్భంగా హైడ్రా కమిషనర్ వ్యవహారశైలిపై న్యాయస్థానం తీవ్ర వ్యాఖ్యలు చేసింది. కోర్టు ఆదేశాలను పదేపదే ఉల్లంఘించే అధికారి కీలక పదవిలో కొనసాగడం చట్టబద్ధ పాలనకు ప్రమాదకరమని వ్యాఖ్యానించింది. కోర్టు ఆదేశాలను నిర్లక్ష్యం చేయడం, వాటిని పదేపదే ఉల్లంఘించడం వల్ల రూల్ ఆఫ్ లా దెబ్బతినే ప్రమాదం ఉందని పేర్కొంది. అందుకే ఈ కేసులో సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పు రాజకీయంగా, పరిపాలనా పరంగా కూడా తీవ్ర చర్చకు దారి తీసింది.
ఈ కేసులో మరో కీలక అంశం రంగనాథ్పై పెండింగ్లో ఉన్న కోర్టు ధిక్కరణ పిటిషన్లు. కోర్టు పరిశీలించిన వివరాల ప్రకారం, గత ఐదేళ్లలో మొత్తం 9 వేల 290 కోర్టు ధిక్కరణ కేసులు పెండింగ్లో ఉండగా, కేవలం ఏడాదిన్నర కాలంలో ఈ ఒక్క అధికారిపై 63 కేసులు పెండింగ్లో ఉండటంపై హైకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఐజీ ర్యాంక్తో పాటు కార్యదర్శి స్థాయి బాధ్యతలు నిర్వహిస్తున్న అధికారి.. ప్రభుత్వ ఆస్తులను, ముఖ్యంగా జీహెచ్ఎంసీ పరిధిలోని ఆస్తులను రక్షించే కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారని న్యాయస్థానం గుర్తు చేసింది.
హైడ్రా ఏర్పాటుకు సంబంధించిన జీవో 99లో కూడా ఈ బాధ్యతలు స్పష్టంగా ఉన్నాయని కోర్టు పేర్కొంది. ఇలాంటి కీలక బాధ్యతలు ఉన్న అధికారిపై ఇన్ని కోర్టు ధిక్కరణ పిటిషన్లు ఉండటాన్ని న్యాయస్థానం అసాధారణంగా పేర్కొంది. అయితే సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుతో ఈ వ్యవహారం అక్కడితో ముగియలేదు.
తనను హైడ్రా కమిషనర్ పదవి నుంచి తప్పించాలని ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ రంగనాథ్ డివిజన్ బెంచ్ను ఆశ్రయించారు. తన స్థానంలో మరో అధికారిని నియమించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఇచ్చిన ఆదేశాలపై ఆయన అప్పీల్ చేశారు. ఈ అప్పీల్పై హైకోర్టులో నేడు విచారణ జరిగింది. రంగనాథ్ తరఫున హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాజీవ్ శక్దర్ వాదనలు వినిపించారు. వాదనలు విన్న డివిజన్ బెంచ్.. సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను తాత్కాలికంగా సస్పెండ్ చేసింది. దీంతో రంగనాథ్కు ప్రస్తుతానికి కీలక ఊరట లభించింది.
అంటే, ఆయన పదవికి సంబంధించిన సింగిల్ జడ్జి ఆదేశాల అమలుపై ప్రస్తుతం స్టే ఉన్నట్లయింది. అయితే ఈ న్యాయ వివాదం ఇంకా ముగియలేదు. ఒకవైపు కోర్టు ఆదేశాల ఉల్లంఘనపై సింగిల్ జడ్జి చేసిన తీవ్ర వ్యాఖ్యలు ఉన్నాయి. మరోవైపు ఆ ఆదేశాలను సవాలు చేస్తూ రంగనాథ్ చేసిన అప్పీల్ ఉంది. ఇప్పుడు తదుపరి విచారణలో డివిజన్ బెంచ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నదే కీలకంగా మారింది.
మొత్తానికి, హైడ్రా కమిషనర్ రంగనాథ్ వ్యవహారం ఇప్పుడు కొత్త న్యాయ మలుపు తిరిగింది. పదవి నుంచి తప్పించాలని వచ్చిన సింగిల్ జడ్జి ఆదేశాలు ఒకవైపు, ఆ ఆదేశాలపై డివిజన్ బెంచ్ ఇచ్చిన తాత్కాలిక ఊరట మరోవైపు. ప్రస్తుతం రంగనాథ్కు బిగ్ రిలీఫ్ లభించినప్పటికీ, ఈ కేసులో తుది న్యాయ పోరాటం ఇంకా కొనసాగనుంది. హైడ్రా కమిషనర్గా రంగనాథ్ భవిష్యత్తు ఏంటి? డివిజన్ బెంచ్ తుది నిర్ణయం ఎలా ఉండబోతోంది? ఇప్పుడు అందరి దృష్టి హైకోర్టులో జరగబోయే తదుపరి విచారణపైనే ఉంది.
2) భారీగా పెరిగిన గణపతి విగ్రహాల ధరలు..
వినాయక చవితి సమీపిస్తుండటంతో హైదరాబాద్ నగరంతో పాటు శివారు ప్రాంతాల్లో గణేష్ సందడి మొదలైంది. ధూల్పేట్ నుంచి నాగోలు, ఎల్బీనగర్, ఉప్పల్, కూకట్పల్లి, మియాపూర్, ఘట్కేసర్ వరకు వినాయక విగ్రహాల తయారీ జోరుగా సాగుతోంది. అయితే ఈసారి గణపతి విగ్రహాల ధరలు భారీగా పెరిగాయి అని ధూల్పేటలోని జాలి హనుమాన్ టెంపుల్ ప్రాంతం వున్న గణేష్ విగ్రహాల తయారీ దారుడు శంకర్ కళాకార్ ఫెడరల్తో చెప్పారు.
1. ముడిసరుకుల ధరల ఎఫెక్ట్ప్లాస్టర్ ఆఫ్ పారిస్, కొబ్బరిపీచు, రంగులు, ఫైబర్, అలంకరణ సామగ్రి, ఇలా విగ్రహాల తయారీలో ఉపయోగించే దాదాపు ప్రతి ముడిసరుకు ధర పెరిగింది. దీనికి తోడు రవాణా చార్జీలు కూడా పెరగడంతో తయారీ ఖర్చు భారీగా పెరిగిందని విగ్రహాల తయారీదారులు చెబుతున్నారు.
2. గత ఏడాది ఎక్కువ మంది కొనుగోలు చేసిన 12 నుంచి 16 అడుగుల విగ్రహాలు సుమారు రూ.50 వేల నుంచి రూ.60 వేల వరకు లభించాయి. కానీ ఈసారి వాటి ధరలు రూ.70 వేల నుంచి రూ.80 వేలు ఉందని, కూకట్పల్లికి చెందిన రామనాథం అసహనం వ్యక్తం చేస్తున్నారు.
3. గత సంవత్సరం సుమారు రూ.85 వేల వరకు విక్రయమైన 20 అడుగుల విగ్రహాలు... ఇప్పుడు దాదాపు రూ.లక్ష వరకు ధర పలుకుతోంది.
4. 20 నుంచి 30 అడుగుల భారీ విగ్రహాల విషయానికి వస్తే, వాటి డిజైన్, ఆకృతి, రంగులు, అలంకరణలు, ఫైబర్ వినియోగం ఆధారంగా రూ.లక్ష నుంచి రూ.1.5 లక్షల వరకు ధర ఉంది.ధరలు పెరిగినా విగ్రహాల అందం మాత్రం ఈసారి మరింత ఆకర్షణీయంగా కనిపిస్తోంది. వివిధ భంగిమలు, వినూత్న ఆకృతులు, కొత్త డిజైన్లు, ఆకర్షణీయమైన రంగులు. చిన్నారులను ఆకట్టుకునే మోడల్స్ నుంచి భారీ మండపాల కోసం ప్రత్యేకంగా తయారు చేస్తున్న గణనాథుల వరకు ఎన్నో రకాల విగ్రహాలు సిద్ధమవుతున్నాయి.
కొత్తగా ఫైబర్ అలంకరణను ఎక్కువగా ఉపయోగించడం ద్వారా విగ్రహాలను మరింత అందంగా తీర్చిదిద్దుతున్నారు. అయితే ఈ అదనపు అలంకరణలే ధరల పెరుగుదలకు మరో కారణంగా మారుతున్నాయి.హైదరాబాద్లో ఇప్పుడు అనేక ప్రాంతాల్లో విగ్రహాల తయారీ, అమ్మకాలు విస్తరించినప్పటికీ, ధూల్పేట్ మార్కెట్కు ఉన్న క్రేజ్ మాత్రం తగ్గలేదు.
ఒకప్పుడు దక్షిణాది రాష్ట్రాలకే ప్రధాన కేంద్రంగా ఉన్న ధూల్పేట్, ఇప్పుడు ఇతర రాష్ట్రాల విగ్రహాలతో పోటీ పడుతోంది. తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఒడిశా, మహారాష్ట్రతో పాటు తెలుగు రాష్ట్రాల నుంచి కూడా ధూల్పేట్ విగ్రహాలకు డిమాండ్ కొనసాగుతోంది. 6 ఇంచుల చిన్న గణపతి నుంచి, 30 అడుగుల భారీ గణనాథుడి వరకు ఇక్కడ విగ్రహాలు అందుబాటులో ఉన్నాయి. మొత్తానికి, వినాయక చవితి సందడి మొదలవకముందే గణపతి విగ్రహాల మార్కెట్ కళకళలాడుతోంది. కానీ ఈసారి భక్తుల జేబుపై మాత్రం ధరల భారం పడే అవకాశం కనిపిస్తోంది. ముడిసరుకుల ధరల పెరుగుదల, రవాణా ఖర్చులు, కొత్త డిజైన్లు, ఫైబర్ అలంకరణలు. ఇవన్నీ కలిసి గణనాథుల ధరలు బాగా పెరిగిపోయాయి.
3) తెలంగాణలో వైరల్ ఫీవర్ అలర్ట్..
వర్షాలు, ఎండలతో వాతావరణం జనాల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. జ్వరం, దగ్గు, జలుబు, గొంతునొప్పి, ఒళ్లు నొప్పులు ఇవి సాధారణ వైరల్ ఫీవర్ లక్షణాలేనా? లేక ఇన్ఫ్లుయెంజానా? మరింత ప్రమాదకరంగా డెంగ్యూ సంకేతాలా? అన్న ఆందోళన ఇప్పుడు ప్రజల్లో పెరుగుతోంది. హైదరాబాద్తో పాటు తెలంగాణ వ్యాప్తంగా వైరల్ ఫీవర్ కేసులు పెరుగుతున్న వేళ, ఫీవర్ను నిర్లక్ష్యం చేయవద్దని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. H1N1 లక్షణాలు ఉన్న రోగులకు RT-PCR పరీక్షలు, ఇన్ఫ్లుయెంజా కిట్లతో పరీక్షలు నిర్వహిస్తున్నట్లు నల్లకుంట ఫీవర్ హాస్పిటల్ ఇన్చార్జి సూపరింటెండెంట్ డా. ముసాఖాన్ తెలిపారు.
ముఖ్యంగా దోమల ద్వారా వ్యాపించే వ్యాధుల నుంచి రక్షణ కోసం కుటుంబాలు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంటి పరిసరాల్లో దోమలు పెరగకుండా చర్యలు తీసుకుంటే చాలా వరకు సురక్షితంగా ఉండవచ్చు.” అని డాక్టర్లు చెబుతున్నారు. “ప్రస్తుతం కొంత మంది రోగుల్లో డెంగ్యూను పోలిన లక్షణాలు కనిపిస్తున్నాయి. 104 నుంచి 105 డిగ్రీల వరకు అధిక జ్వరం, కళ్ల వెనుక తీవ్రమైన నొప్పి, శరీరంపై ర్యాషెస్ వంటి లక్షణాలతో రోగులు వస్తున్నారని" డెంగ్యూపై నిపుణురాలు, సీనియర్ పీడియాట్రిషన్ డా. మడప కరుణ చెప్పారు.
అయితే ఆశ్చర్యకరంగా, ఇలాంటి లక్షణాలు ఉన్న కొంత మందికి డెంగ్యూ పరీక్షల్లో నెగెటివ్ ఫలితాలు వస్తున్నాయి. కాబట్టి కేవలం లక్షణాలను బట్టి వ్యాధిని నిర్ధారించకుండా, వైద్యుల సూచన మేరకు అవసరమైన పరీక్షలు చేయించుకోవడం చాలా ముఖ్యం.”“వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు, జ్వరాల కేసులు పెరిగే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థలో అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నాం, అని తెలంగాణ డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ డా. బి. రవీందర్ నాయక్ చెప్పారు.
బస్తీ దవాఖానాలతో పాటు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రజలకు అవసరమైన వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయి. జ్వరం, దగ్గు, జలుబు లేదా ఇతర అనారోగ్య లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి వైద్యుల సలహా మేరకు పరీక్షలు, చికిత్స తీసుకోవాలి. ప్రైవేట్ ఆసుపత్రుల్లో అనవసరంగా అధిక ఖర్చులు చేయకుండా ప్రభుత్వ వైద్య సేవలను కూడా ప్రజలు వినియోగించుకోవాలి.
”హైదరాబాద్తో పాటు తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు, అధిక తేమ కారణంగా వైరల్ జ్వరాలు, ఇన్ఫ్లుయెంజా తరహా అనారోగ్యాలు పెరుగుతున్నాయి. జ్వరం, దగ్గు, జలుబు, గొంతునొప్పి, ఒళ్లు నొప్పులతో ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులకు వచ్చే రోగుల సంఖ్య పెరుగుతోంది.జూలైతో పోలిస్తే ఆగస్టులో వైరల్ ఫీవర్, ఫ్లూ తరహా లక్షణాలతో చికిత్స కోసం ఆసుపత్రులకు వచ్చే వారి సంఖ్య పెరిగినట్లు వైద్యులు చెబుతున్నారు. హైదరాబాద్ ఫీవర్ హాస్పిటల్లోనే ప్రతిరోజూ సుమారు 550 నుంచి 600 మంది వరకు జ్వరం, జలుబు, దగ్గు, గొంతు నొప్పి వంటి సమస్యలతో వస్తుండటం పరిస్థితి తీవ్రతను సూచిస్తోంది.
ఇన్ఫ్లుయెంజా వైరస్లలో ముఖ్యంగా H1N1, H3N2 వంటి వైరస్లపై కూడా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఒక్కసారిగా జ్వరం రావడం, ఒళ్లు నొప్పులు, తీవ్రమైన అలసట, దగ్గు, గొంతు నొప్పి, ముక్కు కారడం వంటి లక్షణాలు ఫ్లూలో కనిపించవచ్చు. వైరల్ ఫీవర్, ఫ్లూ, డెంగ్యూ ప్రారంభ లక్షణాల్లో కొన్ని పోలికలు ఉండటంతో చాలా మంది జ్వరాన్ని సాధారణ ఫీవర్గా భావించి నిర్లక్ష్యం చేసే అవకాశం ఉంది.
డెంగ్యూలో కూడా జ్వరం, ఒళ్లు నొప్పులు, తీవ్రమైన అలసట వంటి లక్షణాలు కనిపించవచ్చు. అయితే తీవ్రమైన తలనొప్పి, కళ్ల వెనుక నొప్పి, విపరీతమైన ఒళ్లు నొప్పులు, వాంతులు, బలహీనత లేదా రక్తస్రావం వంటి లక్షణాలు ఉంటే వెంటనే వైద్య పరీక్షలు చేయించుకోవడం అవసరం.
వర్షాకాలంలో నిల్వ నీరు పెరగడం వల్ల దోమల పెరుగుదలకు అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. ఇంటి చుట్టూ నిల్వ ఉన్న నీరు, కూలర్లు, పాత టైర్లు, పూల కుండీలు, ట్యాంకులు వంటి ప్రాంతాలు దోమల పెంపక కేంద్రాలుగా మారే ప్రమాదం ఉంది.జ్వరం వచ్చిందని ఫార్మసీ నుంచి మందులు కొనుగోలు చేసి స్వయంగా వాడటం ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా వైద్యుల సలహా లేకుండా యాంటీబయాటిక్స్ తీసుకోవడం సరైన పద్ధతి కాదు.
వైరల్ ఇన్ఫెక్షన్లకు యాంటీబయాటిక్స్ ప్రతిసారీ అవసరం ఉండవు. తప్పుగా లేదా అవసరం లేకుండా యాంటీబయాటిక్స్ వాడటం భవిష్యత్తులో మందులకు శరీరం స్పందించకపోవడం వంటి సమస్యలకు దారితీయవచ్చు.జ్వరం ఎక్కువ రోజులు కొనసాగినా, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉన్నా, తీవ్రమైన బలహీనత లేదా ఇతర అసాధారణ లక్షణాలు కనిపించినా వెంటనే వైద్యులను సంప్రదించడం మంచిది.
పిల్లలు, వృద్ధులు, గర్భిణులు, అలాగే రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు వైరల్ ఇన్ఫెక్షన్ల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి.ఇంట్లో ఒకరికి జ్వరం, దగ్గు, జలుబు వంటి లక్షణాలు ఉంటే ఇతరులకు వ్యాపించకుండా వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం, దగ్గు లేదా తుమ్ము సమయంలో నోరు, ముక్కు కప్పుకోవడం, చేతులను తరచుగా శుభ్రం చేసుకోవడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి.
డెంగ్యూ నివారణకు ఏం చేయాలి?
ఇంటి చుట్టూ నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. వారానికి కనీసం ఒకసారి నీటి నిల్వలను పరిశీలించాలి. దోమలు పెరగకుండా కూలర్లు, ట్యాంకులు, పూల కుండీలు, పాత వస్తువుల్లో నిలిచిన నీటిని తొలగించాలి. పగటి సమయంలో కూడా దోమల నుంచి రక్షణ పొందేలా జాగ్రత్తలు తీసుకోవాలి. జ్వరం వస్తే నిర్లక్ష్యం చేయొద్దు. స్వీయ వైద్యం చేయొద్దు. లక్షణాలు తీవ్రంగా ఉంటే ఆలస్యం చేయకుండా వైద్య పరీక్షలు చేయించుకోండి. ఎందుకంటే, సమయానికి పరీక్ష చేయించుకోవడం, సరైన చికిత్స తీసుకోవడం ప్రాణాలను కాపాడే నిర్ణయం కావచ్చు.వర్షాకాలంలో వచ్చే ప్రతి జ్వరాన్ని సాధారణ ఫీవర్గా భావించడం ప్రమాదకరం. ఎందుకంటే ఒకే రకంగా కనిపించే లక్షణాల వెనుక వైరల్ ఇన్ఫెక్షన్ ఉండొచ్చు. ఫ్లూ ఉండొచ్చు. డెంగ్యూ కూడా ఉండొచ్చు. కాబట్టి జ్వరం వచ్చిందని సొంతంగా మందులు వేసుకోవడం కాదు, యాంటీబయాటిక్స్ వాడటం కాదు. లక్షణాలు తీవ్రంగా ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి. ఇంటి చుట్టూ నీరు నిల్వ ఉండనివ్వకుండా దోమల నియంత్రణ చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే, ఫీవర్ను లైట్ తీసుకోవడం కంటే, సరైన సమయంలో పరీక్ష చేయించుకోవడమే సురక్షితం.

కవిత హామీలు ఆచరణ సాధ్యమేనా ?
పేదలు, రైతులు, యువతను ఆకర్షించటమే టార్గెట్గా హామీలిచ్చినట్లు అర్ధమవుతోంది.

వెయ్యిరోజుల రేవంత్ పాలన ప్రజల్ని మెప్పించిందా ?
తెలంగాణలో రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం సెప్టెంబర్ 1వ తేదీతో 1000 రోజుల పాలన పూర్తి చేసుకుంటుంది. ఈ సందర్భంగా ప్రభుత్వం ‘ప్రత్యేక ప్రగతి నివేదిక’ను విడుదల చేసింది. అధికారంలోకి వచ్చాక 72 వేల ఉద్యోగాలు ఇచ్చామని ప్రభుత్వం స్పష్టం చేసింది. రూ. 1.68 లక్షల కోట్లు వ్యవసాయ పెట్టుబడి, రూ. 2 లక్షల కోట్ల వరకు రుణమాఫీ, వరి ధాన్యానికి రూ. 500 బోనస్ అందిస్తున్నట్లు చెప్పింది. అలాగే అన్నివర్గాల అభ్యున్నతికి పాటుపడ్డామని, తమపాలనలో లక్షల కోట్లరూపాయల పెట్టుబడులు తీసుకువచ్చామని ఘనంగా చాటుకున్నది. ప్రభుత్వం ఈ నివేదికలతో తమ విజయాల గురించి చెప్పుకుంటుంటే బిఆర్ఎస్ వీటిని పూర్తిగా ఖండిస్తూ "1000 రోజుల మోసం" పేరిట సెప్టెంబర్ 2,3 న రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చింది. మరి ఈ రెండు వాదనల్లో ఏది నిజం?
దీని గురించి రీటైర్డ్ ప్రొఫెసర్ మోహన్ రావు ప్రభుత్వం 72 వేల ఉద్యోగాలు ఇచ్చిన మాట నిజమే కానీ అధికారంలోకి రాగానే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని కాంగ్రెస్ ఇచ్చిన హామీ మాట ఏమైందని ప్రశ్నించారు. లక్షల సంఖ్యలో నిరుద్యోగులు ఉంటే, వేల ఉద్యోగాలు ఇవ్వడం విజయం అవ్వదన్నారు. విద్యాశాఖ రేవంత్ దగ్గరే ఉండి కూడా వేల కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్ మెంట్ బకాయిలు చెల్లించకపోవటం గురించి గుర్తుచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వంకన్నా కొన్ని అంశాల్లో మెరుగు అయినప్పటికీ, విద్యార్థులు, నిరుద్యోగుల విషయంలో మాత్రం కాంగ్రెస్ ఊహించిన స్థాయిలో విజయం సాధించలేదని అన్నారు.
యాక్టివిస్ట్ పి.కృష్ణకుమారి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ వెయ్యిరోజుల పాలనలో విజయం సాధించిందని అన్నారు. ఉద్యోగాల విషయంలో బీఆర్ఎస్ ఫెయిల్ అయిన చోట కాంగ్రెస్ సక్సెస్ అయ్యిందని అన్నారు. మహిళలకు ఉచిత బస్సు, గృహజ్యోతి పథకం, మహిళాసంఘాలకి రుణాలు ఇచ్చి ప్రోత్సహిస్తున్నట్లు గుర్తుచేశారు. ఇందిరమ్మ ఇళ్ళ ద్వారా పేదలకి ఇళ్ళ హామీ కూడా కొంతమేరకు నెరవేర్చిందని అన్నారు.

కైలాస యాత్రలో ఎవరు ఎక్కడ? వరదల వేళ వెలుగులోకి వచ్చిన లెక్కల లొసుగు
నేపాల్ వరదలు యాత్రికుల సమాచారంలో కీలక లోపాన్ని బయటపెట్టాయి. ప్రభుత్వ యాత్రికుల జాబితా ఉన్నా.. ప్రైవేట్ యాత్రికుల లెక్కల కోసం పలు వనరులపై ఆధారపడాల్సి వచ్చింది.

కొండ సురేఖ బర్తరఫ్ ... ఇక 'క్యాస్ట్ కార్డే' శరణ్యమా?

అస్తవ్యస్తంగా మారిన 'సర్' ప్రక్రియ

వెయ్యిరోజుల రేవంత్ పాలన ప్రజల్ని మెప్పించిందా ?

పొలిటికల్ హీట్ పెంచుతున్న ఎమ్మెల్సీ ఎన్నికలు

ఆంధ్రా-తెలంగాణాల మధ్య ముదురుతున్న 'నాగార్జునసాగర్' వివాదం

‘ఫోర్ వాటర్ కాన్సెప్ట్’ ఒక్కటే ఎల్నినోని ఎదుర్కోగలదా ?

‘22ఏ’ పై ప్రభుత్వ హామీని జనాలు నమ్ముతారా ?

కాంగ్రెస్ కి కష్టకాలం మొదలైందా?

తెలంగాణ బీజేపీ నేతలపై మోదీ నమ్మకం కోల్పోయారా ?

మధ్య తరగతి ప్రజలను మభ్య పెడుతున్న రేవంత్ ప్రభుత్వం

'22ఏ'తో ప్రజల్లో పెరుగుతున్న ఆందోళన

'హైడ్రా' సమాంతర ప్రభుత్వమా? హైకోర్ట్ ఫైర్

హైదరాబాద్లో గజం రూ.2.70 లక్షలు..!

గ్లోబల్ సమ్మిట్లో డిఫెన్స్ ఎక్స్పో..

రంగనాథ్కు బిగ్ రిలీఫ్! సింగిల్ బెంచ్ తీర్పుపై స్టే

రేవంత్ ప్రభుత్వాన్ని తాకనున్న రిటైర్మెంట్ వేవ్! ఖజానాకు ట్రిపుల్ షాక్

అనుమతులొచ్చాయి.. నిధులున్నాయి.. మరి RRR ఎందుకు ఆగింది?

మీరాలం చెరువులో వాటర్ స్పోర్ట్స్.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

ఫేక్ స్వాతంత్య్ర సమరయోధుడు? 10 ఎకరాల ప్రభుత్వ భూమి గోల్మాల్!

మరణం వెంటాడిన టన్నెల్.. SLBCలో మరో 4 డేంజర్ జోన్లు!

తేలని కృష్ణా నీళ్ల లెక్క.. సెప్టెంబర్ 4న మరోసారి కీలక భేటీ!

గోల్కొండలో బయటపడిన సొరంగం! 400 ఏళ్ల చరిత్రకు కొత్త క్లూ!

ఫ్లైఓవర్లు పెరుగుతున్నా.. ట్రాఫిక్ కష్టాలు ఎందుకు తగ్గడం లేదు?

“డిప్లొమా తర్వాత B.Tech ఉంటుందా? ‘శక్తి’తో కొత్త టెన్షన్!”
దృక్పధం

సురేఖ బర్తరఫ్ పై డాటర్ స్ట్రోక్

అఘాయిత్యాలు తగ్గాలంటే ఇదొక్కటే మార్గం

కవిత హామీలు ఆచరణ సాధ్యమేనా ?

మంత్రి కొండా సురేఖకు అవమానం

తెలంగాణలో నిజంగానే మహిళలు కోటీశ్వరులవుతున్నారా ?

అధిష్ఠానం రేవంత్ చేతులు కట్టేసిందా ?

కొండా సురేఖనా ? వివాదాల సురేఖనా ?

కొండా వ్యవహారం తుపాను ముందరి ప్రశాంతతేనా ?

తెలంగాణను అవమానించిన మోదీ

‘షాదీముబారక్, కల్యాణ లక్ష్మి రద్దు చేయాల్సిందే’

22ఏ..అధికారులపై చర్యలు తీసుకోవాల్సిందే





















