నాగర్ కర్నూల్ లో గూడెం ప్రజల ఓటు... ... తెలంగాణ పోలింగ్ లైవ్ అప్‌డేట్స్

నాగర్ కర్నూల్ లో గూడెం ప్రజల ఓటు బహిష్కరణ 

నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం అమరగిరి గ్రామం చెంచుగూడెం లో నాలుగు రోజులుగా విద్యుత్ రావడం లేదని ఓటింగ్ కు రాకుండా ఉన్నారు స్థానిక చెంచు సామాజికవర్గ ఓటర్లు. తమ కాలనీకి విద్యుత్ సమస్య పరిష్కరిస్తేనే ఓటు వేస్తామంటున్నారు. విద్యుత్ లేకపోవడంతో నాలుగు రోజులుగా చీకట్లనే ఉంటున్నామని, చిన్న పిల్లలతో ఇబ్బందులు పడుతున్నామని అన్నారు. విద్యుత్ లేకపోవడంతో తాగునీటికి కూడా ఇబ్బందిగా ఉందని తెలిపారు. 

Update: 2024-05-13 05:12 GMT

Linked news