భారత్ కు క్షమాపణలు చెప్పిన ఇజ్రాయెల్

జమ్మూకాశ్మీర్ ను పాకిస్తాన్ లో అంతర్భాంగా చూపిస ఐడీఎఫ్ పోస్ట్, నెటిజన్ల విమర్శలతో తప్పును అంగీకరించిన యూదు దేశం;

Update: 2025-06-14 11:57 GMT
ఐడీఎఫ్ పోస్ట్ చేసిన వివాదాస్పద చిత్రం

ఇజ్రాయెల్, తన మిత్రుడైన భారత్ కు క్షమాపణ చెప్పింది. భారత్ లో అంతర్భాగమైన జమ్మూకాశ్మీర్ ను పాకిస్తాన్ లో భాగంగా చూపించే మ్యాప్(పటాన్ని) పోస్ట్ చేసిందుకు మన్నించమని వేడుకుంది.

ఐడీఎఫ్ పోస్ట్ చేసిన వివాదాస్పద పోస్ట్ పై భారత నెట్ వినియోగదారులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో ‘‘సరిహద్దులను గుర్తించడంలో విఫలమైనట్లు గుర్తించాము’’ అని స్పష్టం చేసింది.

ఇజ్రాయెల్- ఇరాన్ మధ్య సైనిక ఘర్షణ చెలరేగిన నేపథ్యంలో ఇరాన్ ప్రయోగించిన క్షిపణుల పరిధిని చూపించే ప్రయత్నంలో ఇజ్రాయల్ రక్షణ దళాలు (ఐడీఎఫ్) శుక్రవారం తన ఎక్స్ ఖాతాలో ఈ ఓ మ్యాప్ పోస్ట్ చేసింది.
ఇందులో జమ్మూకశ్మీర్ పూర్తిగా పాక్ లో ఉన్నట్లు చూపించారు. ఈ పోస్ట్ పై భారత్ లోని యూజర్లు తీవ్ర విమర్శలు గుప్పించారు. ‘‘భారత్ ఎందుకు తటస్థంగా ఉందో మీకు అర్థమైంది. దౌత్యంలో ఎవరూ మీ నిజమైన స్నేహితుడు కాదు’’ ఒక యూజర్ ఎక్స్ లో కామెంట్ చేశారు. దీనికి ఐడీఎఫ్ స్పందించింది. సరిహద్దులను గుర్తించడంలో ఐడీఎఫ్ విఫలమైందని అంగీకరించింది.
‘‘ఈ పోస్ట్ ఈ ప్రాంతానికి ఒక ఉదాహరణ, ఈ మ్యాప్ సరిహద్దులను కచ్చితంగా వర్ణించడంలో విఫలమైంది. ఈ చిత్రం వల్ల కలిగిన నేరానికి మేము క్షమాపణ కోరుతున్నాము’’ అని ఐడీఎఫ్ ఎక్స్ లో పోస్ట్ చేసింది.
‘‘ఇరాన్ ప్రపంచానికి ముప్పు, ఇజ్రాయెల్ అంతిమ లక్ష్యం ఇది కాదు. ఇది ప్రారంభం కాదు. చర్య తీసుకోవడం తప్ప మాకు వేరే మార్గం లేదు’’ ఐడీఎఫ్ ముందుగా తప్పు మ్యాప్ తో పాటు పోస్ట్ చేసింది.
ఇరాన్ పై తాము చేపట్టిన ‘‘ఆపరేషన్ రైజింగ్ లయన్’’ను సమర్థించుకుంది. ఇజ్రాయెల్ వైమానిక దళం కూడా ఇరానియన్ క్షిపణుల పరిధిని చూపించే ఇలాంటి చిన్న వీడియోను పోస్ట్ చేసింది.
ఈ వివాదానికి ప్రతిస్పందనగా భారత్ లోని ఇజ్రాయెల్ రాయబారీ రూవెన్ అజార్ స్పందించారు. మ్యాప్ తీసివేయమని లేదా సరిచేయమని తాను కోరినట్లు ఆయన చెప్పారు. లఢక్ తో పాటు జమ్మూకశ్మీర్ భారత్ లో భాగమని న్యూఢిల్లీ వాదిస్తోంది.
Tags:    

Similar News