బలం ద్వారా శాంతిని సృష్టించింది: ఇజ్రాయెల్ ప్రధాని

ట్రంప్ నిర్ణయం చరిత్రలో నిలిచిపోతుందని ప్రశంసించిన బెంజమిన్ నెతన్యాహూ;

Update: 2025-06-22 07:36 GMT
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ

ఇరాన్ అణు కేంద్రాలపై దాడులు చేయాలన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ ప్రశంసించారు. అమెరికా నిర్ణయం చరిత్రను మార్చేసిందని, ట్రంప్ చాలా ధైర్యవంతమైన నిర్ణయం తీసుకున్నాడని కొనియాడారు.

అమెరికా బలం ద్వారా శాంతిని సృష్టించిందని, ఈ ప్రాంతం ఇంటా, బయట ప్రశాంతత నెలకొంటుందని అన్నారు. ఈ నిర్ణయం గల్ప్ ప్రాంతంలో ఉజ్వల భవిష్యత్ కు దారి తీస్తుందని పేర్కొన్నారు.
‘‘యూఎస్ఏ అద్భుతమైన, న్యాయమైన శక్తితో ఇరాన్ అణు కేంద్రాలను లక్ష్యంగా చేసుకోవాలనే మీ(ట్రంప్) నిర్ణయం నిజంగా అద్వితీయమైనది. ఈ నిర్ణయం చరిత్ర గతిని మారుస్తుంది’’ అని యూదు ప్రధాని చెప్పారు.
‘‘ఆపరేషన్ రైజింగ్ లయన్ లో ఇజ్రాయెల్ నిజంగా అద్భుతమైన పనులు చేసింది. కానీ ఈ రాత్రి ఇరాన్ అణు కేంద్రాలపై జరిగిన చర్యలో, అమెరికా మహాద్భుతం చేసంది. భూమిపై మరే దేశం ఇలా చేయలేనిది, అది చేసి చూపింది’’ అని బెంజమిన్ నెతన్యాహూ అన్నారు.
ఇరాన్ అణు కార్యక్రమం..
ఇరాన్ అణు కేంద్రాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ జూన్ 13 న ఆపరేషన్ రైజింగ్ లయన్ ను ప్రారంభించింది. అణు కేంద్రాలతో పాటు దాని బాలిస్టిక్ మిస్సైల్ ల ఉత్పత్తి కేంద్రాలతో నాశనం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.
ఇరాన్ అణు శక్తి సాధించడం తనకు అత్యంత ముప్పుగా ఇజ్రాయెల్ భావించింది. ఎంతకు తెగించి అయిన టెహ్రాన్ అణు లక్ష్యాన్ని నాశనం చేస్తామని భీషణ ప్రతిజ్ఞ చేసింది.
ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన పాలనలో, ఇంకా ప్రమాదకరమైన ఆయుధాలను తయారు చేయడాన్ని ట్రంప్ అడ్డుకోవడం చరిత్ర గుర్తుంచుకుంటుందని ఇజ్రాయెల్ నాయకుడు అన్నారు. ఆయన తీసుకున్న నిర్ణయం మధ్యప్రాచ్యంలో శ్రేయస్సును, శాంతికి భరోసా కల్పించాయని చెప్పారు.
బలం ద్వారా శాంతి..
‘‘అధ్యక్షుడు ట్రంప్, నేను తరుచుగా చెప్పేది ఒకటే మాట. బలం ద్వారానే శాంతి. మొదట బలం వస్తుంది. తరువాత శాంతి వస్తుంది’’ అని ఆయన అన్నారు. నిన్న రాత్రి యూఎస్, ట్రంప్ చాలా శక్తివంతంగా వ్యవహరించాయని ఆయన చెప్పారు.
అవసరమైతే ఇరాన్ అణు కేంద్రాలను తానే చేస్తానని ఇజ్రాయెల్ ప్రకటించినప్పటికీ, త్వరగా నాశనం కావాలంటే మాత్రం అమెరికా బరిలోకి దిగాలని కోరింది. తాజాగా దాని అభ్యర్థనను ట్రంప్ మన్నించి ఇరాన్ పై దాడులు చేయించారు.
అయితే పాశ్చాత్య దేశాల వాదనలను ఇరాన్ తోసిపుచ్చుతోంది. తాము కేవలం శాంతియుత అవసరాలకే వీటిని వాడుతామని తెలిపింది. కొన్నాళ్లు అంతర్జాతీయ పరిశీలనకు సైతం ఒప్పుకుంది. కానీ ఇజ్రాయెల్ దాడితో వీటికి బ్రేక్ పడింది.
Tags:    

Similar News