కోల్‌కతా కేసులో నిందితుడికి పాలిగ్రాఫ్ పరీక్ష.. ఏం చెప్పాడంటే..

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన జూనియర్ వైద్యురాలను అత్యాచారం- హత్య చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సంజయ్ రాయ్ కు సీబీఐ పాలిగ్రాప్ పరీక్ష నిర్వహించింది.

Update: 2024-08-26 06:20 GMT

దేశవ్యాప్తంగా తీవ్రంగా దుమారం రేపిన ట్రైనీ డాక్టర్ అత్యాచారం, హత్యపై కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ ప్రధాన నిందితుడని ఆరోపణలు ఎదుర్కొంటున్న సంజయ్ రాయ్ కు పాలిగ్రాఫ్ టెస్ట్ లు నిర్వహించింది. అయితే ఇందులో నమ్మశక్యం కానీ నిజాలు బయటకు వచ్చాయని తెలిసింది. సంజయ్ రాయ్ ఆర్ జీ కర్ ఆస్పత్రిలోని సెమినార్ హల్ కు చేరుకునే సరికి బాధితురాలు చనిపోయిందని పేర్కొన్నట్లు సమాచారం.

'తప్పుడు- నమ్మశక్యం కాని సమాధానాలు'
ఓ జాతీయ మీడియా పరిశోధకులను ఉటంకిస్తూ, రాయ్‌పై జరిగిన పాలిగ్రాఫ్ పరీక్ష వివరాలను ప్రచురించింది. ఈ పరీక్షలో సంజయ్ రాయ్ నిర్దోషి అని ఇటీవల వచ్చిన అనేక వాదనలకు తప్పుడు, నమ్మశక్యం కానీ సమాధానాలు వచ్చాయని పేర్కొన్నారు. ఢిల్లీలోని సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ (సీఎఫ్‌ఎస్‌ఎల్) నుంచి కోల్‌కతాకు చేరుకున్న పాలిగ్రాఫ్ నిపుణుల బృందం ఈ పరీక్షను నిర్వహించింది.
రాయ్ భయపడి, ఆత్రుతతో ఉన్నాడు: సీబీఐ
ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్ ను రెండు గంటల పాటు ప్రశ్నించామని సీబీఐ వెల్లడించింది. విచారణ సమయంలో భయపడకుండా ఉన్నారని, ఆత్రుతగా కనిపించారని తెలిపాయి. ట్రైనీ డాక్టర్ పై అత్యాచారం, హత్య సమయంలో నిందితుడు అక్కడే ఉన్నాడని ఫోరెన్సిక్ సాక్ష్యాలు, సాంకేతిక అంశాలు నిరూపిస్తున్నాయి. కానీ తనను తాను నిర్ధోషిగా వాదించుకున్న సంజయ్, ఇందులో బహుళ ఎలిబీస్ ఉన్నారని వాదిస్తున్నాడు. సెమినార్ హాల్‌లో బాధితురాలు చనిపోయిందని, భయంతో పారిపోయానని పరీక్ష సందర్భంగా రాయ్ పరిశోధకులకు చెప్పాడు.
రూల్స్ ను ఉల్లంఘిస్తున్నారు... లాయర్ ..
ఇదిలావుండగా, డిఫెన్స్ లాయర్ లేకపోయిన సిబిఐ పాలిగ్రాఫ్ పరీక్ష నిర్వహించడం ద్వారా జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్‌సి) మార్గదర్శకాలను ఉల్లంఘించిందని రాయ్ తరపు న్యాయవాది కబితా సర్కార్ ఆదివారం ఆరోపించారు.
“పరీక్ష ఎప్పుడు నిర్వహిస్తారనేది సీబీఐ మాకు తెలియజేయలేదు. మేము హాజరు కావడానికి వారు మాకు తెలియజేయాలి, ”అని ఆమె చెప్పినట్లు పేర్కొంది.
మరో ఏడుగురికి పాలిగ్రాఫ్ పరీక్ష
మెడికల్‌ కాలేజీ మాజీ ప్రిన్సిపాల్‌ సందీప్‌ ఘోష్‌ సహా ఏడుగురికి పాలీగ్రాఫ్‌ పరీక్ష నిర్వహించేందుకు సీబీఐ కోర్టు అనుమతి కోరింది. విచారణ సమయంలో పరీక్ష సాక్ష్యంగా ఉపయోగించరు. కానీ దర్యాప్తు సంస్థలకు ఎలా కేసును ఎలా ముందుకు తీసుకెళ్లాలో దిశా నిర్దేశం చేస్తాయి. మెడికల్ కాలేజీ సెమినార్ హాల్‌లో 31 ఏళ్ల వైద్యురాలి మృతదేహం లభ్యమైన ఒక రోజు తర్వాత ఆగస్టు 10న కోల్‌కతా పోలీసులు రాయ్‌ను అరెస్టు చేశారు. వైద్యుడి మృతదేహానికి సమీపంలో లభించిన CCTV ఫుటేజ్, బ్లూటూత్ పరికరం ఫలితంగా రాయ్‌ను అరెస్టు చేశారు, అతను తెల్లవారుజామున 4 గంటలకు మృతదేహం కనుగొనబడిన కళాశాల సెమినార్ హాల్‌లోకి ప్రవేశించినట్లు ఆరోపణలు వచ్చాయి.
ఆరోపణలను ఖండించిన రాయ్..
రాయ్ (33) 2019 నుంచి కోల్‌కతా పోలీస్‌లో పౌర వాలంటీర్‌గా పనిచేస్తున్నాడు. బాక్సింగ్ శిక్షణ తీసుకున్న సంజయ్ రాయ్.. కొంతమంది పోలీసు ఉన్నతాధికారులతో సన్నిహితంగా మెలిగిన తరువాత
ఆ తర్వాత అతన్ని కోల్‌కతా పోలీస్ వెల్ఫేర్ బోర్డ్‌కు తరలించి RG కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లోని పోలీస్ అవుట్‌పోస్ట్‌లో నియమించారు. తనపై వచ్చిన ఆరోపణలను ఆయన ఖండించారు.
మారిన క్రైమ్ సీన్..
పోస్ట్ గ్రాడ్యుయేట్ వైద్యురాలిపై అత్యాచారం, హత్యను కప్పిపుచ్చడానికి స్థానిక పోలీసులు ప్రయత్నించారని ఆరోపణలు వచ్చాయి. సీబీఐ దర్యాప్తు చేపట్టే సమయానికి నేరం జరిగిన ప్రదేశం మొత్తం మార్చేశారని ఇప్పటికే దర్యాప్తు సంస్థ సుప్రీంకోర్టుకు తెలిపింది.
ఆగస్టు 9 ఉదయం ఆసుపత్రి ఛాతీ విభాగంలోని సెమినార్ హాల్‌లో తీవ్ర గాయాలతో ఉన్న వైద్యురాలి మృతదేహం కనుగొనబడింది. ఈ ఘటనపై సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి.


Tags:    

Similar News