వాయనాడ్‌ దుర్ఘటనపై ప్రధాని మోదీ ఏరియల్ సర్వే

వయనాడ్ మృతుల కుటుంబాలకు అధిక నష్టపరిహారం చెల్లించాలని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ డిమాండ్ చేసిన మరుసటి రోజే మోదీ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.

Update: 2024-08-08 12:22 GMT

కొండచరియలు విరిగిపడిన కేరళలోని వాయనాడ్ విషాదంపై కేంద్ర, రాష్ట్రానికి మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. జాతీయ విపత్తుగా ప్రకటించాలని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ఆగస్టు 10న ఏరియల్ సర్వేకు వెళ్లనున్నారు. వయనాడ్ జిల్లాలో చోటు చేసుకున్న దుర్ఘటన వల్ల 300 మందికి పైగా మరణించారు. ఇంకా 150 మంది తప్పిపోయారు.

త్వరలో తప్పిపోయిన వారి జాబితా..

చూరల్‌మల, ముండక్కై ప్రాంతాల్లో గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. తప్పిపోయిన వారి జాబితాను సిద్ధం చేస్తున్నట్లు కేరళ ప్రభుత్వం తెలిపింది. వీరిలో కొందరు లేదా ఎక్కువ మంది చనిపోయి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

మృతుల కుటుంబాలకు, క్షతగాత్రులకు అధిక నష్టపరిహారం చెల్లించాలని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ డిమాండ్ చేసిన మరుసటి రోజే మోదీ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.

కేరళపై కేంద్ర మంత్రి ఆగ్రహం

అటవీ ప్రాంతంలో అక్రమ నివాసాలు, గనుల తవ్వకాలే కారణమని కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్‌ చేసిన ఆరోపణ రాష్ట్రంలో ఆగ్రహానికి కారణమైంది. జూలై 30కి ముందు వాయనాడ్‌లో కొండచరియలు విరిగిపడే అవకాశం ఉందని వాతావరణ హెచ్చరికను కేరళ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు.

కాగా విపత్తుకు ముందు వాయనాడ్‌లో సాధారణ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసిందని ఆయన సూచించారు. వరదలు లేదా కొండచరియలు విరిగిపడడం గురించి సెంట్రల్ వాటర్ కమిషన్ , జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా చెప్పలేదని విజయన్ పేర్కొన్నారు.

Tags:    

Similar News