వైసిపి ఎంపిలంతా కొనాల్సిన పుస్తకం ఇది...

ఎపికి ప్రత్యేక హోదా అనేది ముగిసిన అధ్యాయం కాదు. ఈ విషయం గురించి వైసిపి ఎంపిలకు నిజం తెలియాలి. దానికోసం ఒక పుస్తకం చదవాలి. అందేంటంటే...

Update: 2024-02-04 07:50 GMT
జెడి (వివి) లక్ష్మీనారాయణ మాజీ ఐపిఎస్ అధికారి


ప్ర‌త్యేక హోదా ఇచ్చే బాధ్య‌త కేంద్రానిదే అంటున్నారు మాజీ సిబిఐ అధికారి, జైభారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు వివి లక్ష్మీనారాయణ
14 ఆర్ధిక సంఘం ప్రత్యేక హోదా  రాష్ట్రాలకు ఇవ్వడాన్ని నిషేధించందని చెబుతూ కేంద్రం మనలను   త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్నదని ఆయన ఆరోపిస్తున్నారు.
అయితే, 15వ అర్థిక సంఘం చెయిర్మన్ మాజీ ఐఎఎస్ అధికారి ఎన్ కె సింగ్ ప్రత్యేక హోదా మీద ఒక పుస్తకం రాస్తూ చక్కగా వివరించారు.
- ప్రత్యేక హోదా ముగిసిన‌ అధ్యాయం కాదు  ఆయన అంటున్నారు.
- వైసిపి ఎంపిలందరికి ఆపుస్తకం కొనివ్వాలని ఆయన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కూడా సలహా ఇచ్చాారు.
- 15వ ఫైనాన్స్ క‌మిష‌న్ ఛైర్మ‌న్ ఎన్.కె.సింగ్ రాసిన  ఆపుస్తకం పేరు  ‘పోర్ట్రైయిట్స్ అఫ్ పవర్, హాఫ్ ఎ సెంచరీ అఫ్ బియింగ్ ఎట్ రింగ్ సైడ్’ (Portraits of Power, Half A Century of Being at Ringside). ఇందులో 208వ పేజీలో  స్పెషల్ క్యాటగరి స్టేటస్ ఇవాల్సిన బాధ్యత కేంద్రానికి ఉందని రాసిన విషయం ఆయన చెబుతున్నారు.. ఈ మేరకు ఆయన ట్విట్టర్ లో తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ  ఈ హోదా కోసం పోరాటం సాగాలంటున్నారు.  
జెడి లక్ష్మీ నారాయణ ట్వీట్ లో పేర్కొన్న విషయాలు



Tags:    

Similar News