జగన్‌ బెయిల్‌ రద్దు పిటిషన్‌.. సీబీఐని ప్రశ్నించిన సుప్రీంకోర్టు

సీఎం జగన్ బెయిల్ రద్దు చేయాలని రఘురామ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. కేసు దర్యాప్తులో జాప్యమెందుకని సీబీఐని న్యాయస్థానం ప్రవ్నించింది.

Update: 2024-04-01 05:49 GMT
Source: Twitter

సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి బెయిల్‌ను రద్దు చేయాలంటూ సుప్రీం కోర్టులో దాఖలైన పిటిషన్‌పై ధర్మాసనం ఈరోజు విచారణ చేపట్టింది. జగన్‌ అక్రమాస్తుల కేసు దర్యాప్తులో జాప్యం ఎందుకు జరుగుతుందని సీబీఐని ప్రశ్నించింది. ఇందుకు గల కారణాలను తదుపరి విచారణలో ఈ తెలపాలని పేర్కొంటూ పిటిషన్ విచారణను ఆగస్టు 5కు వాయిదా వేసింది న్యాయస్థానం. అయితే జగన్ బెయిల్‌ రద్దు చేయాలని, జగన్‌పై ఉన్న కేసుల విచారణను ఇతర రాష్ట్రాలకు బదిలీ చేయాలని కోరుతూ రఘురామకృష్ణ రాజు రెండు పిటిషన్‌లు దాఖలు చేశారు. ఈ పిటిషన్‌లపై జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం నేడు విచారణ చేపట్టింది. ఇందులో భాగంగా ఈ పిటిషన్‌లపై తమ బదులు ఇవ్వడానికి తమకు మరింత సమయం కేటాయించాలని జగన్ తరపు న్యాయవాది కోరారు. అందుకు అంగీకరించిన ధర్మాసనం విచారణను వాయిదా వేసింది. అంతేకాకుండా ఈ కేసుల విచారణలో జాప్యం ఎందుకు జరిగింది. ఇప్పటివరకు వీటిలో ఎంతమేర పురోగతి లభించింది అన్న వివరాలను సీబీఐ తెలియజేయాలని న్యాయస్థానం కోరింది.

Tags:    

Similar News