కొత్తచట్టాలు వైద్యులకు రక్షణ కల్పిస్తాయా?

వైద్యులు సురక్షిత వాతావరణంలో పనిచేయడానికి వీలుగా రాష్ట్ర ప్రభుత్వాలు టాస్క్‌ఫోర్సు ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.

Update: 2024-09-02 07:26 GMT

కోల్‌కతాలో ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం, హత్య ఘటన యావత్ సమాజాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆర్‌జీ కర్ ఆసుపత్రిలో విధులు ముగించుకుని సెమినార్ రూంలో విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో 31 ఏళ్ల వైద్యురాలు అత్యాచారానికి గురైంది. ఈ పాశవిక ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. బాధితురాలి కుటుంబానికి న్యాయం చేయడంతో పాటు తమకు రక్షణ కల్పించాలని జూనియర్ డాక్టర్లు తమ విధులను బహిష్కరించి ఆందోళన బాట పట్టారు. అయితే ఈ సమస్యను పరిష్కరించడానికి రాష్ట్రాల పరిధిలో ఇప్పటికే కొన్ని చట్టాలు అమలులో ఉన్నందువల్ల, కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చట్టాన్ని తీసుకురావడానికి ఇష్టపడలేదు.

దోషులకు కఠిన శిక్షలతో మార్పు వస్తుందా?

అయితే వైద్యులు సురక్షిత వాతావరణంలో పనిచేయడానికి వీలుగా రాష్ట్ర ప్రభుత్వాలు టాస్క్‌ఫోర్సు ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.వైద్యుల రక్షణకు ఈ చర్య మాత్రమే సరిపోతుందా అన్నదే అసలు ప్రశ్న. దోషులకు కఠిన శిక్షలు వేస్తే ఇలాంటి ఘటనలు పునరావృతం కావన్నది మరికొందరి వాదన.

పెరిగిపోతున్న కేసులు..

నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో డేటా ప్రకారం.. 2018 - 2022 మధ్య దేశంలో మహిళలపై లైంగిక నేరాల సంఖ్య 12.9 శాతానికి పెరిగాయి.జాతీయ స్థాయిలో లక్ష మంది మహిళలకు 66.4 కేసులు నమోదయ్యాయి. ఢిల్లీలో అత్యధికంగా లక్ష మంది మహిళలకు 144.4 కేసులు నమోదయ్యాయి.

కఠిన శిక్షే ఇలాంటి నేరాలకు అడ్డుకట్ట వేయగలదని భావిస్తే..2012లో ఢిల్లీలో ఒక యువ వైద్య విద్యార్థినిపై సామూహిక అత్యాచారం, హత్యకు పాల్పడిన నిందితులకు భారత న్యాయస్థానం మరణశిక్ష విధించిన తర్వాత పరిస్థితి మెరుగుపడి ఉండాలి. కాని దారుణాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.

ఇటు మహిళా సంఘాలు, న్యాయవాదులు అత్యాచారం కేసుల్లో మరణశిక్ష సరికాదని వాదించారు. నిందితులపై వారి కుటుంబాలు కూడా ఆధారపడి ఉంటాయన్నది వారి వాదన.

2019లో హైదరాబాద్ శివార్లలో 27 ఏళ్ల వెటర్నరీ డాక్టర్‌పై అత్యాచారం చేసి చంపినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న నలుగురు వ్యక్తులను పోలీసులు ఎన్ కౌంటర్ చేశారు. ఈ రెండు కేసుల్లో దోషులు, నిందితులు పేద కుటుంబాలకు చెందినవారే.

రాజకీయ పలుకుబడి ఉన్న నిందితులు మాత్రం తమకు శిక్ష పడకుండా లేదంటే తక్కువకాలం జైలు శిక్ష పడేలా పరిస్థితులను మార్చుకోగలుగుతున్నారు. 2002లో గుజరాత్ అల్లర్ల సమయంలో బిల్కిస్ బానో అనే గర్భిణిపై అత్యాచారం, ఆమె కుటుంబ సభ్యుల హత్య ఇందుకు ఒక ఉదాహరణ. 11 మంది నిందితులకు పలుమార్లు పెరోల్‌పై విడుదల చేశారు. వారిని జీవిత ఖైదులను మార్చారు.

అత్యాచారం, హత్య కేసుల్లో బీజేపీ నాయకుడు కుల్దీప్ సింగ్ సెంగార్ ప్రమేయం ఉన్న 2017 ఉన్నావ్ రేప్ కేసులో.. తమకు తాము దేవుళ్లుగా చెప్పుకునే బాబా రామ్ రహీమ్, ఆశారాం బాపులకు కూడా పెరోల్‌లపై విడుదలచేశారు.

మోదీ ప్రభుత్వంలోని కేంద్ర మాజీ మంత్రి స్వామి చిన్మయానంద్‌పై 2018లో అత్యాచారం, అపహరణ కేసు నమోదయ్యింది. అయితే దాన్ని ఉత్తరప్రదేశ్‌లోని బీజేపీ ప్రభుత్వం ఉపసంహరించుకోవడం మరొక ఉదాహరణ.

ఇలాంటి సమస్యలను పరిష్కరించడానికి మరింత కఠినమైన చట్టాలు పరిష్కారం కాకపోవచ్చు. 2012లో ఒక యువ వైద్య విద్యార్థినిపై సామూహిక అత్యాచారం, హత్య జరిగిన తర్వాత క్రిమినల్ చట్టానికి సవరణలను సిఫారసు చేయడానికి జస్టిస్ వర్మ కమిటీ ఏర్పడింది "ప్రస్తుత అసురక్షిత వాతావరణానికి పాలన వైఫల్యమే మూల కారణం.’’ అని పేర్కొంది.

దేశంలో ప్రభుత్వ రంగ ఆరోగ్య సంరక్షణను "మునిగిపోతున్న నౌక"గా నీతి ఆయోగ్ అభివర్ణించింది. పర్యవసానంగా బాగా డబ్బున్నవారు ప్రభుత్వ ఆసుపత్రుల్లోవైద్యం చేయించుకోవడం మానేశారు.

వైద్యవృత్తి వారు తమ పని పరిస్థితులను మెరుగుపరుచుకోవడానికి పోరాటంలో నిమగ్నమై ఉన్నందున..సమస్యలపై ప్రతిబింబించడానికి ఇది సరైన తరుణం.


Tags:    

Similar News