రావల్పిండి క్రికెట్ స్టేడియంపై భారత్ డ్రోన్ దాడి - మ్యాచ్ వాయిదా


భారత్ ప్రయోగించిన డ్రోన్ రావల్పిండి క్రికెట్ స్టేడియాన్ని ఢీకొట్టినట్లు మీడియాలో వార్తలొచ్చాయి. దాంతో గురువారం రాత్రి జరగాల్సిన పాక్ సూపర్ లీగ్ (పీఎస్‌ఎల్) మ్యాచ్‌ వాయిదా వేసినట్లు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ప్రకటించింది. ఆరు జట్లు పాల్గొంటున్న పీఎస్‌ఎల్ టి20 లీగ్ చివరి దశలో ఉంది.

పాకిస్తాన్ ఆర్మీ ప్రకారం.. గురువారం జరిగిన డ్రోన్ దాడిలో నలుగురు సైనికులకు గాయాలయ్యాయి. భారత్ ప్రయోగించిన అనేక డ్రోన్లను సైన్యం కూల్చివేసిందని కూడా వారు చెప్పారు. 

Read More
Next Story