జైశంకర్‌కు అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఫోన్..


భారత్ - పాక్ దేశాల మధ్య నెలకొన్న తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో .. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో స్పందించారు. ఉద్రిక్తతల నివారణకు ప్రయత్నించాలని భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌, పాక్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌తో ఫోన్‌లో మాట్లాడారు. అవసరమైతే రెండు దేశాల మధ్య చర్చలకు మధ్యవర్తిత్వం వహిస్తానని చెప్పారు. అయితే ఉగ్రవాదాన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించబోమని మార్కో రూబియో స్పష్టం చేశారు. 

Read More
Next Story