అమెరికా దాడులను ఖండిస్తోన్న వామ పక్షాలు..


ఇరాన్‌ అణు స్థావరాలపై అమెరికా దాడులను వామపక్షాలు ఖండించాయి. అంతర్జాతీయ న్యాయ నిబంధనల ప్రకారం దాడులను "తీవ్ర ఉల్లంఘన"గా పేర్కొన్నాయి. ఈ దాడులు ప్రపంచ స్థాయిలో ప్రభావం చూపుతాయని, భారత్‌పై కూడా ప్రతికూల ప్రభావం ఉంటుందని సీపీఎం ప్రధాన కార్యదర్శి ఎం.ఏ. బేబీ హెచ్చరించారు. అమెరికా తీరుకు నిరసనగా నిరసన తెలపాలని పిలుపునిచ్చారు.

సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ ప్రధాన కార్యదర్శి దిపాంకర్ భట్టాచార్య మాట్లాడుతూ.. "ప్రపంచంలోని శాంతికాముకులు అమెరికా దౌర్జన్యాన్ని ఖండించాలి" అని కోరారు.

"ఇరాక్, లిబియా, సిరియాల తరవాత అమెరికా-ఇజ్రాయిల్ దౌర్జన్యానికి ఇరాన్ బలైంది. మొత్తం పశ్చిమ ఆసియాను అస్థిరపరిచి తమ ఆధీనంలోకి తెచ్చుకోవాలనేది వీరి లక్ష్యం," అని భట్టాచార్య ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ అన్యాయమైన యుద్ధంలో భారత్ అమెరికా-ఇజ్రాయిల్ కూటమికి మద్దతివ్వకూడదు," అని ఆయన స్పష్టం చేశారు.

Read More
Next Story