మేధావులు, విద్యావంతులు పోలింగ్ లో పాల్గొనాలి -హరీష్ రావు
x

మేధావులు, విద్యావంతులు పోలింగ్ లో పాల్గొనాలి -హరీష్ రావు


సిద్దిపేట పట్టణంలోని భరత్ నగర్ అంబిటస్ స్కూల్ లో 114పోలింగ్ బూత్ లో కుటుంబ సమేతంగా తన ఓటు హక్కును వినియోగించుకున్న మాజి మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు.

ఈ సందర్బంగా హరీష్ రావు మాట్లాడుతూ...

- నేను కుటుంబ సభ్యులతో కలిసి భరత్ నగర్ లో ఓటు హక్కును వినియోగించుకున్నా.

- రాష్ట్రవ్యాప్తంగా ముమ్మరంగా ప్రజలు పోలింగ్ లో పాల్గొంటున్నారు.

- గతంలో కంటే ఎక్కువ పట్టణాలలో పోలింగ్ పెరుగుతుంది.

- ప్రశ్నించే గొంతుక ఉండాలని ప్రజలు ఆలోచిస్తున్నారు


- మేధావులు, విద్యావంతులు పోలింగ్ లో పాల్గొనాలి.

- ప్రజాస్వామ్యం బలపడాలంటే అందురు ఓటింగ్ లో పాల్గొనాలి.

- ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామిక దేశం భారత్ దేశం.

- గత పార్లమెంటు ఎన్నికలలో కంటే పోలింగ్ శాతం పెరుగుతుంది.

- ప్రజలు తప్పకుండా ఓటు హక్కును వినియోగించుకువాలి అని ఓటర్లకు పిలుపునిచ్చారు.

Read More
Next Story