‘‘తారిక్ రెహ్మన్ ప్రమాణ స్వీకారం ఎందుకు మసకబారింది‘‘
x

‘‘తారిక్ రెహ్మన్ ప్రమాణ స్వీకారం ఎందుకు మసకబారింది‘‘

ప్రజాభిప్రాయ సేకరణ పై బాహాబాహీకి దిగిన జమాత్, బీఎన్పీ


Click the Play button to hear this message in audio format

బంగ్లాదేశ్ కొత్త ప్రధానమంత్రిగా తారిఖ్ రెహమాన్ ప్రమాణ స్వీకారం చేశారు. అయితే దేశ ఎన్నికల సంఘం కొత్త శాసనసభ్యులపై విధించిన వివాదాస్పద "రెండవ ప్రమాణం"పై తీవ్ర రాజకీయ దుమారం రేగింది.

బిఎన్‌పి నేతృత్వంలోని కొత్త ప్రభుత్వంతో సహకరిస్తామని, బాధ్యతాయుతమైన ప్రతిపక్ష పాత్రను పోషిస్తామని అనేకసార్లు హామీ ఇచ్చిన, జమాత్-ఇ-ఇస్లామి, దాని మిత్ర పార్టీల ఇప్పుడు సంస్కరణల ఎజెండాపై రెహమాన్ ప్రభుత్వంతో విభేదిస్తున్నట్లు స్ఫష్టంగా కనిపిస్తోంది.

మూడింట రెండు వంతుల మెజారిటీని సాధించిన బిఎన్‌పి, ప్రధాన ప్రతిపక్షంగా ఉద్భవించిన జమాత్-ఇ-ఇస్లామి రెండు కూడా ఘర్షణలకు దిగాయి. కొన్ని కీలక విషయాలపై ప్రజాభిప్రాయ సేకరణ జరపాలనే అంశంపై రెండు వర్గాలు బాహాబాహీకి దిగాయి.

బిఎన్‌పి దాని భాగస్వాముల నుంచి ఎన్నికైన శాసనసభ్యులు కౌన్సిల్ ప్రమాణ స్వీకారం నుంచి వైదొలిగారు. వారు ప్రస్తుత బంగ్లాదేశ్ రాజ్యాంగం కింద మాత్రమే ప్రమాణ స్వీకారం చేస్తామని, కానీ రాజ్యాంగ సంస్కరణల మండలిలో చేరడానికి రెండవ ప్రమాణం చేయమని ప్రకటించారు.
జమాతే-ఇ-ఇస్లామి, దాని మిత్రపక్షమైన ఎన్సీపీ ఈ ప్రతిపాదనలపై కోపంగా ఉన్నాయి. BNP సంస్కరణ మండలి ప్రక్రియలో చేరకపోతే వారు ఎటువంటి ప్రమాణ స్వీకారం చేయకుండా ఉంటామని మొదట్లో వెల్లడించారు.
అయితే, దాని వల్ల తమ సీట్లు కోల్పోతారని గ్రహించి, ప్రతిపక్ష శాసనసభ్యులు పదవీ ప్రమాణం రాజ్యాంగ సంస్కరణల మండలిలో చేరడానికి ప్రతిజ్ఞ చేశారు. కానీ BNP కూటమి MPలు రెండవ ప్రమాణం చేయడానికి నిరాకరించారు.

BNP 'రెండవ ప్రమాణం'ను ఎందుకు వ్యతిరేకించింది?

ప్రమాణ స్వీకారానికి ముందు, BNP స్టాండింగ్ కమిటీ సభ్యుడు సలాహుద్దీన్ అహ్మద్ రాజ్యాంగ సంస్కరణ మండలి సభ్యులుగా ప్రమాణం చేయకూడదనే పార్టీ నిర్ణయాన్ని బహిరంగంగా ప్రకటించారు.
ప్రమాణ స్వీకార పత్రాన్ని చూపుతూ... “మనలో ఎవరూ రాజ్యాంగ సంస్కరణ మండలి సభ్యులుగా ఎన్నుకోబడలేదు, లేదా దీనిని ఇంకా రాజ్యాంగంలో చేర్చలేదు.” ఈ ప్రకటన తీవ్రమైన రాజకీయ, చట్టపరమైన చర్చకు దారితీసింది.
జూలై చార్టర్ అమలు ఉత్తర్వులో రెండవ ప్రమాణాన్ని చేర్చడం “చట్టవిరుద్ధం” అని కొందరు వాదించగా, మరికొందరు అదనపు ప్రమాణం తీసుకోవడానికి BNP నిరాకరించడాన్ని “అనవసరమైన హెచ్చరిక”గా అభివర్ణించారు.
పార్లమెంటరీ ఎన్నికలతో పాటు జరిగిన ప్రజాభిప్రాయ సేకరణలో మెజారిటీ "అవును" ఓటు వచ్చిన తర్వాత జూలై చార్టర్ కింద సంస్కరణలను అమలు చేయడానికి పార్టీ కట్టుబడి ఉందని BNP అధికారిక వాదన.
కానీ BNP ఎన్నికల కమిటీ చీఫ్ నజ్రుల్ ఇస్లాం ఖాన్ ఇటీవలి ఇంటర్వ్యూలో ఈ రచయితతో మాట్లాడుతూ, జూలై చార్టర్‌లోని అనేక విషయాలపై తమ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేసిందని, అయితే యూనస్ ప్రభుత్వం వాటిని చార్టర్ తుది పత్రంలో చోటు ఇవ్వలేదని అన్నారు.
"మేము అసమ్మతి నోట్ ఇచ్చిన అనేక అంశాలు ఇందులో ఉన్నాయి. సంస్కరణ పత్రంలో వాటిని చేర్చడాన్ని మేము వ్యతిరేకిస్తాము" అని ఖాన్ స్ఫష్టం చేశారు. జూలై చార్టర్ అంశంపై తొందరపడటానికి BNP కూడా సిద్దంగా లేదు.
"రాజ్యాంగ సంస్కరణ మండలి" సభ్యులుగా రెండవ ప్రమాణ స్వీకారాన్ని నాలుగు కారణాల వల్ల వ్యతిరేకించింది.
1 అటువంటి సంస్కరణ మండలి ఇంకా అధికారికంగా రాజ్యాంగంలో చేర్చబడలేదని, కాబట్టి దాని కోసం ప్రమాణం చేయడం చట్టబద్ధంగా అనధికారమని సలాహుద్దీన్ వాదన.
2 అటువంటి ప్రమాణానికి రాజ్యాంగబద్ధమైన, చట్టబద్ధంగా సూచించబడిన రూపం లేదని ఆయన వాదించారు.
3 ప్రజాభిప్రాయ సేకరణ ఫలితాల తర్వాత మొదట సంస్కరణలను పార్లమెంటు ఆమోదించాలని, చట్టసభ సభ్యులు దానికి ప్రతిజ్ఞ చేయమని అడిగే ముందు ప్రమాణ స్వీకార పత్రాన్ని రాజ్యాంగంలోని మూడవ షెడ్యూల్‌లో చేర్చాలని ఆయన చెబుతున్నారు.
4 ప్రస్తుత రాజ్యాంగ విధానం ప్రకారం పార్లమెంటు సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేయడానికి పార్టీ కట్టుబడి ఉందని, కానీ ప్రత్యేక, రాజ్యాంగేతర ప్రతిజ్ఞ కాదని సలావుద్దీన్ పేర్కొన్నారు.
పర్యవసానంగా, జమాతే-ఇ-ఇస్లామి, దాని భాగస్వాముల ఎంపీలు చివరికి రెండు ప్రమాణాలు చేసినప్పటికీ, జూలై చార్టర్ సంస్కరణ చట్రానికి సంబంధించిన రెండవ ప్రమాణాన్ని BNP ఎంపీలు తిరస్కరించారు. రెండు దశాబ్దాల సుదీర్ఘ కాలం తరువాత అధికారం చేపట్టిన BNP కొత్త సమస్యలను తన భుజాల మీద వేసుకోవడానికి సిద్ధంగా లేదు.

ప్రజాభిప్రాయ సేకరణపై పిటిషన్..

ప్రజాభిప్రాయ సేకరణను సవాలు చేస్తూ మంగళవారం హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. సుప్రీంకోర్టు న్యాయవాది ABM అటౌల్ మజీద్ తౌహిద్ ప్రజా ప్రయోజనం కోసం రిట్ దాఖలు చేశారు.
ప్రధాన ఎన్నికల కమిషనర్, క్యాబినెట్ కార్యదర్శి, న్యాయ కార్యదర్శిని పిటిషన్‌లో ప్రతివాదులుగా పేర్కొన్నారు. ఫిబ్రవరి 13న ప్రకటించిన ప్రజాభిప్రాయ సేకరణ ఫలితాలను చట్టవిరుద్ధంగా ఎందుకు ప్రకటించకూడదో అడుగుతూ పిటిషన్ దాఖలు చేసినట్లు తౌహిద్ మీడియా ప్రతినిధులకు తెలిపారు.

మంత్రివర్గంలో చేరిక..

తారిక్ రెహమాన్ మంత్రివర్గంలో ఎక్కువ భాగం ఊహించదగినదే అయినప్పటికీ, ఖలీలుర్ రెహమాన్ చేరిక ఆశ్చర్యం కలిగించింది. బంగ్లాదేశ్ మూలానికి చెందిన అమెరికా పౌరుడు ఖలీలుర్ రెహమాన్.
ముహమ్మద్ యూనస్ తాత్కాలిక ప్రభుత్వంలో జాతీయ భద్రతా సలహాదారుగా ఉన్నారు. ఆయనను విదేశాంగ మంత్రిగా చేర్చుకున్నారని మీడియా నివేదికలు వెల్లడిస్తున్నాయి.
ఆర్మీ చీఫ్ జనరల్ వాకర్-ఉల్-జమాన్‌తో ఆయన సంబంధాలు దెబ్బతిన్నాయని ప్రచారం కూడా జరుగుతోంది. తారిక్ రెహమాన్ లేదా బిఎన్‌పి ప్రముఖులలో ఎవరితోనూ ఆయన సన్నిహితంగా ఇప్పటిదాక మెలగలేదు
. ఆగస్టు 2024లో హసీనా పతనానికి దారితీసిన పాలన మార్పు ఆపరేషన్‌కు కారణమని విస్తృతంగా నమ్ముతున్న అమెరికాను సంతోషపెట్టడానికే ఆయన చేరిక అని కొందరు భావిస్తున్నారు. యూనస్ మాదిరిగానే, ఖలీలుర్ రెహమాన్ వాషింగ్టన్‌లోని పెద్దలకు దగ్గరగా ఉంటారని నమ్ముతారు. అది తారిక్ రెహమాన్ ను ప్రభావితం చేసి ఉండవచ్చు.
తారిక్ ఈ పదవికి విదేశాంగ సలహాదారు హుమాయున్ కబీర్‌కు ఇస్తారని చాలా మంది అనుకున్నారు. కానీ చైనాతో సాన్నిహిత్యాన్ని ద్వేషించే అమెరికా ఇటీవల ఢాకాకు స్పష్టమైన సందేశం పంపింది. దీనితో వాషింగ్టన్ మనిషిగా భావించే ఖలీలూర్ ఇందులో చేరడానికి కారణమైంది.
తారిక్ రెహమాన్ చేసే ప్రతి చర్యను భారత్ నిశితంగా గమనిస్తుంది. ప్రత్యేకించి జమాత్-ఇ-ఇస్లామి దాని మిత్ర సంస్థల నుంచి అతను చాలా ఒత్తిడికి గురైతే ఎలాంటి పరిణామాలు ఉంటాయో ఊహిస్తోంది. కానీ రెహమాన్ ప్రారంభ సంకేతాలు సానుకూలంగా ఉన్నట్లు కనిపిస్తున్నాయి.

Read More
Next Story