తెలంగాణ భవన్‌లో కేటీఆర్‌, కవిత
x

తెలంగాణ భవన్‌లో కేటీఆర్‌, కవిత

ఎక్కడ ఓడిపోయాం.. కారణాలేంటి? నెక్ట్‌ ఏంటి అన్న విషయాలపై కేటీఆర్‌ తెలంగాణ భవన్‌లో మాట్లాడారు.


తెలంగాణ భవన్‌లో గెలిచిన, ఓడిన ఎమ్మెల్యేలతో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిండెంట్‌ కే తారక రామారావు సమావేశమయ్యారు. ఈ సమావేశానికి మాజీ మంత్రులు, ముఖ్యనేతలు, ఎమ్మెల్సీ కవిత హాజరయ్యారు. భవిష్యత్‌ కార్యాచరణపై చర్చించారు. ఓటమికి గల కారణాలను విశ్లేషించారు. రూరల్‌ ఏరియాలో పతనానికి కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఓడిన ఎమ్మెల్యేలు మనోధైర్యం కోల్పోకూడదని కేటీఆర్‌ సూచించినట్లు తెలుస్తోంది. వచ్చే పార్లమెంట్‌ ఎన్నికలో ఇదే దూకుడు ప్రదర్శించాలని, కాంగ్రెస్‌ గ్యారంటీలు అమలు కాకపోతే ప్రజల తరపున పోరాడానికి సిద్ధం కావాలని దిశా నిర్ధేశం చేశారని సమాచారం.

Read More
Next Story