రేవంత్ రెడ్డి రెండు చోట్ల ముందంజ
x
రథసారథులు

రేవంత్ రెడ్డి రెండు చోట్ల ముందంజ


తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యంలో దూసుకుపోతోంది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పోటీ చేస్తున్న కొడంగల్, కామారెడ్డి రెండు చోట్ల ఆధిక్యంలో దూసుకుపోతున్నారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పోటీ చేస్తున్న మధిరలో ఆధిక్యంలో ఉన్నారు. తొలిరౌండ్ లోనే 2 వేల ఓట్ల ఆధిక్యం సాధించారు. అలాగే నకిరేకల్, నాగార్జున సాగర్, పరిగి, అశ్వారావుపేట, మెదక్, ఆలేరు, మునుగోడు, పాలకుర్తి సహ రాష్ట్ర వ్యాప్తంగా 12 స్థానాల్లో కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంది. బీజేపీ నిర్మల్, ఆదిలాబాద్, గోషామహల్, చార్మినార్ లో 2539 ఓట్లతో లో బీజేపీ తొలిరౌండ్ ముగిసే సరికి ఆధిక్యంలో ఉంది. సిరిసిల్లాలో కేటీఆర్, సిద్ధిపేటలో హరీష్ రావు 6258 ఓట్లతో , జుక్కల్ లో హన్మంత్ షిండే, బాన్స్ వాడలో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, సత్తుపల్లిలో సండ్ర వెంకట వీరయ్య ఆధిక్యంలో ఉన్నారు.

Read More
Next Story