ఒడిశాలో బీజేపీ ముందంజ
x

ఒడిశాలో బీజేపీ ముందంజ

ఒడిశాలో ఈ సారి బీజేడీ, బీజేపీల మధ్య ప్రధాన పోటీ నెలకొంది. కాంగ్రెస్ పార్టీ కూడా గట్టి పోటీ ఇచ్చింది. ఇంతకు ఎవరు లీడ్ లో ఉన్నారంటే..


ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ లీడ్‌లో ఉంది. ఉదయం 10 గంటల సమయానికి బీజేపీ 24 స్థానాల్లో, బీజేడీ 14 స్థానాల్లో, కాంగ్రెస్ 3 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. ఒడిశా అసెంబ్లీలో మొత్తం 147 స్థానాలున్నాయి.

ఇప్పటి వరకు వరుసగా ఐదుసార్లు ఆ రాష్ట్రంలో బీజూ జనతా దళ్(బీజేడీ) అధినేత నవీన్ పట్నాయక్ సీఎంగా ఉన్నారు. ఈ సారి గెలిస్తే ఆయన డబుల్ హ్యాట్రిక్‌ సాధించినట్లే.

ఈ సారి బీజేడీ, బీజేపీల మధ్య ప్రధాన పోటీ నెలకొంది. కాంగ్రెస్ పార్టీ కూడా గట్టి పోటీ ఇవ్వడంతో పలు నియోజకవర్గాల్లో త్రిముఖ పోటీ కనిపిస్తోంది. ఇక్కడ లోక్‌సభ స్థానాలు, అసెంబ్లీకి ఎన్నికలు మొత్తం నాలుగు విడతల్లో జరిగాయి. ఒడిశాలోని 147 అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు 21 లోక్‌సభ నియోజకవర్గాలకు ఉదయం 8 గం.లకు కౌంటింగ్ ప్రారంభమైంది.

Read More
Next Story