లోక్‌సభ కాంగ్రెస్ ప్రతిపక్ష డిప్యూటీ లీడర్ ఖరారు..
x

లోక్‌సభ కాంగ్రెస్ ప్రతిపక్ష డిప్యూటీ లీడర్ ఖరారు..

లోక్‌సభలో కాంగ్రెస్ ప్రతిపక్ష డిప్యూటీ లీడర్‌గా గౌరవ్ గొగోయ్ వ్యవహరించనున్నారు. ఈ మేరకు పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది.


లోక్‌సభలో కాంగ్రెస్ ప్రతిపక్ష డిప్యూటీ లీడర్‌గా గౌరవ్ గొగోయ్ వ్యవహరించనున్నారు. ఈ మేరకు పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. దిగువ సభలో పార్టీ డిప్యూటీ లీడర్, చీఫ్ విప్, ఇద్దరు విప్‌ల నియామకంపై కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్ సోనియా గాంధీ లోక్‌సభ స్పీకర్ బిర్లాకు లేఖ రాశారని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తెలిపారు. గొగోయ్ దిగువ సభలో పార్టీ డిప్యూటీ లీడర్‌గా ఉంటారని, కేరళ నుంచి ఎనిమిదిసార్లు ఎంపీగా ఎన్నికైన కొడికున్నిల్ సురేష్ పార్టీ చీఫ్ విప్‌గా, విరుదునగర్ ఎంపీ మాణికం ఠాగూర్, కిషన్‌గంజ్ ఎంపీ మహ్మద్ జావేద్‌లు లోక్‌సభలో పార్టీ విప్‌లుగా వ్యవహరిస్తారని పేర్కొన్నారు. లోక్‌సభ ప్రతిపక్ష నేతగా ఇప్పటికే రాహుల్ గాంధీ వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. రాహుల్ నేతృత్వంలో కాంగ్రెస్, కూటమి పార్టీలు ప్రజా సమస్యలపై తీవ్రంగా పోరాడతాయని వేణుగోపాల్ తెలిపారు.

Read More
Next Story