డీకే శివకుమార్, దేవెగౌడ కుటుంబాల మధ్య విభేదాలు మళ్లీ రాజుకున్నాయా?
x

డీకే శివకుమార్, దేవెగౌడ కుటుంబాల మధ్య విభేదాలు మళ్లీ రాజుకున్నాయా?

డాక్టర్ సిఎన్ మంజునాథ్ విజయం జెడి (ఎస్) చీఫ్ హెచ్‌డి దేవెగౌడ, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికె శివకుమార్ కుటుంబాల మధ్య యుద్ధానికి ఆజ్యం పోస్తుంది.


బెంగళూరు రూరల్ లోక్‌సభ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి డికె సురేష్‌పై బిజెపి టిక్కెట్‌పై డాక్టర్ సిఎన్ మంజునాథ్ విజయం సాధించడం జెడి (ఎస్) నాయకుడు హెచ్‌డి దేవెగౌడ మరియు కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికె శివకుమార్ కుటుంబాల మధ్య యుద్ధానికి మరింత ఆజ్యం పోస్తుంది. ఫైల్ ఫోటో

బెంగళూరు రూరల్ లోక్‌సభ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి డీకే సురేష్‌పై ప్రముఖ కార్డియాలజిస్టు, బీజేపీ అభ్యర్థి డాక్టర్ సిఎన్ మంజునాథ్ విజయం సాధించారు. ఈ గెలుపుతో మాజీ ప్రధాని హెచ్‌డి దేవెగౌడ, కర్ణాటక ఉపముఖ్యమంత్రి డికె శివకుమార్ కుటుంబాల మధ్య మళ్లీ రాజకీయ యుద్ధానికి తెరలేచింది.

వైద్యరంగం నుండి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన డాక్టర్ మంజునాథ్ విజయంతో శివకుమార్ కుటుంబ రాజకీయ ఆధిపత్యానికి చెక్ పెట్టినట్లయ్యింది. వాస్తవానికి ఈ రెండు కుటుంబాల మధ్య రాజకీయ పోరు కొత్త కాదు. పాత మైసూరు ప్రాంతంలోని వొక్కలిగ సామాజిక వర్గంపై నాయకత్వం కోసం ఇరు కుటుంబాలు పోటీపడుతున్నాయి.

2023 అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని చేజిక్కించుకుంది. JD(S) కేవలం 19 స్థానాల్లో గెలిచింది. దీంతో కసిమీదున్న దేవెగౌడ కుటుంబం లోక్‌సభ ఎన్నికలలో సత్తా చాటాలని నిర్ణయించుకుంది. కేంద్రంలోని ఎన్డీఏతో పొత్తుపెట్టుకున్ని పోటీకి దిగింది. మాండ్యాలో కుమారస్వామి, కోలార్‌లో మల్లేష్‌బాబు విజయం సాధించారు.

బరిలోకి కార్డియాలజిస్ట్..

2019 సార్వత్రిక ఎన్నికల్లో కర్నాటక నుంచి కాంగ్రెస్‌ తరుపున గెలిచిన ఏకైక వ్యక్తి డీకే సురేశ్‌. 2023 అసెంబ్లీ ఎన్నికలలో హస్తం పార్టీ అధికారంలోకి వచ్చింది. పరాజయం పాలైన పార్టీని తిరిగి పట్టాలెక్కించే పనిలో భాగంగా ఎన్డీఏ కూటమితో జతకట్టారు. డీకే శివకుమార్‌ తన సొంతగడ్డపై ఆయన తమ్ముడు డీకే సురేష్‌ను ఓడించేందుకు దేవేగౌడ తన అల్లుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత, జయదేవ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కార్డియాలజీ మాజీ డైరెక్టర్ డాక్టర్ మంజునాథ్‌ను రంగంలోకి దింపారు. అనూహ్యంగా ఆయన గెలుపొందారు.

భారీ మెజార్టీతో..

వొక్కలిగ-ఆధిపత్యం ఉన్న పాత మైసూరు ప్రాంతం కంటే బెంగళూరు రూరల్‌పై ఎక్కువ దృష్టి పెట్టాయి రెండు పార్టీలు. అంతిమంగా ఇది దేవెగౌడ కుటుంబానికి బాగా పనిచేసింది. డాక్టర్ మంజునాథ్ 2 లక్షలకు పైగా ఓట్లతో సురేష్‌ను ఓడించారు.

దేవెగౌడ మనవడు ప్రజ్వల్ రేవణ్ణ అభ్యర్థిగా ఉన్న హాసన్‌లో మాత్రమే JD(S) ఓడిపోయింది. అనేక మంది మహిళలతో లైంగిక సంబంధం పెట్టుకున్నారనే ఆరోపణలతో ఆయన పరువు పోగొట్టుకున్నారు.

ఓటమిని ఊహించలేదు..

డాక్టర్ మంజునాథ్ విజయం వైద్యుడి విజయమని, జెడి(ఎస్) లేదా దేవెగౌడ కుటుంబానికి కాదని శివకుమార్ పేర్కొన్నారు. అయితే తన సోదరుడు ఇంత ఘోరంగా ఓడిపోతాడని ఊహించలేదని అతను అంగీకరించాడు.

మంజునాథ్ ఎవరు?

మంజునాథ్, మృదుస్వభావి, వృత్తిరీత్యా కార్డియాలజిస్టు. రాజకీయ నాయకులందరితో మంచి సంబంధాలున్న వ్యక్తి. 2006 నుండి 2024 వరకు జయదేవ ఇన్‌స్టిట్యూట్‌కి నాయకత్వం వహించారు. అతను జాతీయంగా మరియు అంతర్జాతీయంగా అనేక అవార్డులు మరియు ప్రశంసలు పొందాడు. రాజకీయ కుటుంబ నేపథ్యం నుంచి కాకుండా వృత్తిపరంగానే మంజునాథ్ ఓటర్లకు దగ్గరయ్యారు.



Read More
Next Story