కేరళలో UDF ఘన విజయం - సినీనటుడు సురేష్ గోపి చరిత్రాత్మక విజయం
x

కేరళలో UDF ఘన విజయం - సినీనటుడు సురేష్ గోపి చరిత్రాత్మక విజయం

కేరళలో యూడీఎఫ్ భారీ విజయాన్ని అందుకుంది. కూటమి నుంచి పోటీచేసిన 18 మంది గెలుపొందారు. వాయనాడ్ నుంచి పోటీచేసిన రాహుల్ గాంధీ 3,64,422 ఓట్ల మెజారిటీ సాధించారు.


2016లో సురేశ్ గోపీ బీజేపీలో చేరినప్పుడు, ఆయనను కేరళలో కమలం పార్టీకి చెందిన ప్రముఖ నాయకుడిగా ఎవరూ ఊహించి ఉండరు. అయితే రాజ్యసభకు ఎన్నికయిన తర్వాత తన పార్లమెంటరీ నియోజకవర్గంలో స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేపట్టి వాటిని విస్తరించారు. జనం మద్దతును కూడగట్టుకున్నారు. తనకంటూ ఒక ముద్ర వేసుకున్నారు.

ఇప్పుడు ఆయన త్రిసూర్ లోక్‌సభ స్థానం నుంచి గెలుపొందడం ప్రాధాన్యతను సంతరించుకుంది. కేరళ నుండి లోక్‌సభ కు ఎన్నికైన ఏకైక వ్యక్తిగా సురేశ్ గోపి. 66 ఏళ్ల మలయాళ సినిమాల్లో “యాక్షన్ హీరో” గా గుర్తింపు తెచ్చుకున్న సురేశ్ గోపి కేరళలో హిందూ జాతీయవాద పార్టీకి చిహ్నంగా మారారు.

మొదటి నుంచి లీడింగ్‌లోనే..

సురేశ్ గోపి కౌంటింగ్ ప్రారంభ నుంచి లీడింగ్‌లోనే ఉన్నారు. మొత్తం 10,90,876 ఓట్లకుగాను సురేశ్ గోపికి 4,12,338 ఓట్లు పడ్డాయి. తన సమీప ప్రత్యర్థి, సీపీఐకి చెందిన వీఎస్ సునీల్ కుమార్‌పై 74,686 ఓట్ల తేడాతో గెలుపొందారు. కాంగ్రెస్ అభ్యర్థి కే. కె. మురళీధరన్ మూడో స్థానంలో నిలిచారు.

తన గెలుపుపై సురేశ్ గోపి సంతోషం వ్యక్తం చేశారు. ఇది త్రిస్సూర్ ప్రజల ఆశీర్వాదం అని పేర్కొన్నారు. కాళియాట్టం చిత్రానికి జాతీయ అవార్డు రావడం కంటే గొప్ప విజయమని అన్నారు.

LDF పేవల ప్రదర్శన..

ఈ ఎన్నికలలో ఎల్‌డీఎఫ్ ఒక స్థానంలో మాత్రమే గెలవగలిగింది. దేవాదాయ శాఖ వ్యవహారాల మంత్రి కే రాధాకృష్ణన్ అలత్తూరు స్థానం నుంచి గెలుపొందారు.

యూడీఎఫ్‌ ఘన విజయం..

యూడీఎఫ్ భారీ విజయాన్ని నమోదు చేసింది. ఈ కూటమి నుంచి పోటీచేసిన 18 మంది గెలుపొందారు. వాయనాడ్ నుంచి పోటీచేసిన రాహుల్ గాంధీ 3,64,422 ఓట్ల మెజారిటీ సాధించారు. IUMLకి చెందిన ET మహమ్మద్ బషీర్ మలప్పురంలో మూడు లక్షలకు పైగా మెజారిటీ సాధించగా, హైబీ ఈడెడ్ ఎర్నాకులంలో రెండున్నర లక్షలకు పైగా సాధించారు. అట్టింగల్‌లో అదూర్ ప్రకాష్ 1,708 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. మావెలిక్కరలో కొడిక్కున్నిల్ సురేష్ మినహా సీపీఐకి చెందిన సీఏ అరుణ్‌కుమార్‌పై కేవలం 10,000 ఓట్ల తేడాతో గెలుపొందారు.

ప్రజా వ్యతిరేకత..

ఈసారి కేరళలో ప్రజా వ్యతిరేకత బాగా కనిపిస్తోంది. రాష్ట్రం ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభం కారణంగా బలహీన వర్గాలకు పెన్షన్ సహా సంక్షేమ పథకాలు సరిగా వర్తించడం లేదు. కేరళ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో కూడా జీతాల పంపిణీలో జాప్యం జరుగుతోంది.

ఓటమిని అంగీకరించిన సీపీఐ(ఎం)..

ఓటమిపై సీపీఐ(ఎం) ఒక ప్రకటన విడుదల చేసింది. "మేము ఓటమిని అంగీకరిస్తాం. ఇంత భారీ పరాజయాలను ఎదుర్కోవడం ఇదే మొదటిసారి కాదు. మా పనితీరులో అవసరమైన మార్పులు చేయడానికి ఆత్మపరిశీలన చేసుకుంటాం.’’ అని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గం ఒక ప్రకటనలో పేర్కొంది.

కీలకంగా మారిన మైనారిటీ ఓట్లు

మైనారిటీ ఓట్లు యూడీఎఫ్ విజయంలో కీలకంగా మారాయి. ముఖ్యంగా గత రెండు ఎన్నికల్లో ముఖ్యంగా 2021 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు దూరమైన ముస్లింలు ఈ సారి మళ్లీ వెనక్కి వచ్చినట్లు కనిపిస్తోంది. కాసర్‌గోడ్, కన్నూర్, వడకరా, కోజికోడ్, పాలక్కాడ్, మలప్పురం, పొన్నాని, తిరువనంతపురంలో శశి థరూర్ విజయం, కోస్టల్ బెల్ట్ మద్దతు కారణంగానే రాజీవ్ చంద్రశేఖర్ గట్టి సవాలును అధిగమించడం కూడా ఈ పరిశీలనను నొక్కి చెబుతుంది.

కేరళలో మొత్తం స్థానాలు 20. యూడీఎఫ్ 18 స్థానాలు గెలుచుకోగా, ఎల్‌డీఎఫ్ 1, బీజేపీ 1 స్థానంలో విజయం సాధించింది.

Read More
Next Story