బయో ఫార్మా రంగానికి పదివేల కోట్ల కేటాయింపు
x
కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్

బయో ఫార్మా రంగానికి పదివేల కోట్ల కేటాయింపు

మధుమేహం, గుండె సంబంధిత వ్యాధులకు సరైన పరిశోధన, విదేశీ క్లినికల్ ట్రయల్స్ ఆధారపడటంపై తగ్గింపు


బయోఫార్మా పరిశ్రమను మరింత బలోపేతం చేయడానికి బడ్జెట్ -2026 లో కేంద్రం ప్రత్యేక దృష్టి సారించింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దేశాన్ని ప్రపంచ బయో ఫార్మా హజ్ గా నిలబెట్టడానికి రూ. 10 వేల కోట్లను కేటాయించినట్లు ప్రకటించారు. దేశం చాలాకాలంగా ఎదుర్కొంటున్న మధుమేహం, గుండె సంబంధిత వ్యాధులకు మెరుగైన చికిత్స, ఆవిష్కరణలు అవసరమని, అందుకే ఈ రంగాన్ని ప్రపంచ స్థాయిలో తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు.

ఈ సందర్బంగా ఆర్థిక మంత్రి మాట్లాడుతూ.. ఐదు సంవత్సరాలలో పదివేలకోట్లతో బయో ఫార్మా శక్తిని పెంపొందించడానికి ప్రతిపాదిస్తున్నామని చెప్పారు. ఈ పెట్టుబడులు ఏడు వ్యూహాత్మక రంగాలలో ఉత్పత్తిని పెంచడానికి, భారత్ కు అనుకూలంగా దేశీయ బయో ఫార్మాస్యూటికల్ తయారీ, పరిశోధన సామర్థ్యాన్ని గణనీయంగా పెంచడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. ఈ ప్రతిపాదనలో కీలకమైన అంశం ఏంటంటే.. 1,000 గుర్తింపు పొందిన క్లినికల్ ట్రయల్ సైట్‌ల దేశవ్యాప్తంగా నెట్‌వర్క్‌ను సృష్టిస్తామని చెప్పారు.

ఈ చర్య భారతదేశ క్లినికల్ రీసెర్చ్ ఎకోసిస్టమ్‌ను బలోపేతం చేస్తుందని, విదేశీ ట్రయల్స్‌పై ఆధారపడటాన్ని తగ్గిస్తుందని పేర్కొన్నారు. ప్రపంచ బయోఫార్మా పెట్టుబడులకు దేశాన్ని మరింత ఆకర్షణీయంగా మారుస్తుందని అంచనా వేశారు. దేశంలో కొత్త మందులు, చికిత్సల అభివృద్ధి, పరీక్షలను వేగవంతం చేయడం కూడా ఈ చర్యల లక్ష్యం.
మారుతున్న ఆరోగ్య సవాళ్ల ద్వారా బయోఫార్మాపై ఆధారపడటం పెరుగుతోందని సీతారామన్ అన్నారు. భారత్ కాలంగా ఎదుర్కొంటున్న మధుమేహం, హృదయ సంబంధ వ్యాధులు వంటి నాన్-కమ్యూనికబుల్ వ్యాధుల వైపు ఎక్కువగా మారుతోంది, దీనికి అధునాతన చికిత్సలు, బయోలాజిక్స్, స్థిరమైన ఆవిష్కరణలు అవసరమని చెప్పారు.
ఈ కొత్త ఆరోగ్య సంరక్షణ ప్రొత్సాహాలు ఫార్మా అవసరాలను తీర్చి బలమైన బయోఫార్మా తయారు చేస్తుందని ఆమె అన్నారు. ప్రభుత్వ సంస్కరణల ఎజెండాను హైలైట్ చేస్తూ, రంగాలలో వృద్ధిని వేగవంతం చేయడానికి, ఉత్పాదకతను మెరుగుపరచడానికి సమగ్ర చర్యలు చేపట్టామని ఆర్థిక మంత్రి అన్నారు.
ఇటీవలి కాలంలో 350 కి పైగా సంస్కరణలు అమలు చేసినట్లు తన ప్రసంగంలో పేర్కొన్నారు. "సంస్కరణ ఎక్స్‌ప్రెస్" బలంగా ట్రాక్‌లో ఉందని ఆమె పేర్కొన్నారు. బయోఫార్మా శక్తితో, ప్రభుత్వం ఆరోగ్య పురోగతిని పారిశ్రామిక వృద్ధితో కలపడం, దేశీయ ఫార్మారంగాన్ని బలోపేతం చేసి ప్రపంచంలోని మేటీ సంస్థలతో పోటీ పడే విధంగా తయారు చేయడం తమ లక్ష్యమని ప్రకటించారు.
Read More
Next Story