చిక్కుల్లో సినీ దర్శకుడు పూరీ జగన్నాథ్
x

చిక్కుల్లో సినీ దర్శకుడు పూరీ జగన్నాథ్

'లైగర్' చిత్రానికి దర్శకత్వం వహించిన పూరీ జగన్నాథ్ ప్రస్తుతం 'డబుల్ ఇస్మార్ట్' చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు.


ప్రముఖ తెలుగు సినిమా దర్శకుడు పూరీ జగన్నాధ్ చిక్కుల్లో పడ్డారు. 'లైగర్' చిత్రానికి దర్శకత్వం వహించిన పూరీ ప్రస్తుతం 'డబుల్ ఇస్మార్ట్' చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాను సంబంధించిన ఓ ఐటెం సాంగ్‌ను ఇటీవల మార్కెట్‌లోకి రిలీజ్ చేశారు. ‘మార్ ముంతా..ఛోడ్ తింతా’ అనే పాటలో 'ఏం జెద్దాం అంటావ్ మరి' అనే పదాలు ఉన్నాయి. వీటిపైనే బీఆర్‌ఎస్ సీనియర్ నేత రజితారెడ్డి అభ్యంతరం తెలిపారు. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కే చంద్రశేఖర్‌రావు సాధారణంగా ఉపయోగించే పదబంధాన్ని(ఏం జెద్దాం అంటావ్ మరి) వాడుకున్న చిత్ర బృందంపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కేసీఆర్ తరుచుగా వాడే పద బంధాన్ని సినిమాల్లో వాడడం ఆయనను అవమానించడమేనని రజితారెడ్డి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. బీఆర్‌ఎస్ నాయకురాలు పావని గౌడ్ కూడా లిక్కర్, మత్తు ఇతివృత్తాల చుట్టూ తిరిగే పాటలో కేసీఆర్ పదాలను ఉపయోగించడాన్ని తప్పుబట్టారు. చిత్ర దర్శకుడిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ మహిళా కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. కేసీఆర్ పదబంధాన్ని తొలగించకపోతే తెలంగాణలో సినిమాను బహిష్కరిస్తామని హెచ్చరిస్తున్నారు.

రామ్ పోతినేని, కావ్య ఠాకూర్ జంటగా నటిస్తున్న 'డబుల్ ఇస్మార్ట్' చిత్రం ఆగస్ట్‌లో విడుదల కానుంది.

Read More
Next Story