మళ్లీ కనువిందు చేయనున్న చిరు, త్రిష
x

మళ్లీ కనువిందు చేయనున్న చిరు, త్రిష

త్రిష పాత్రలో ముందుగా అనుష్క పేరు పరిశీలించారు. చివరికి త్రిషని ఫైనల్‌ చేసినట్టు వార్తలొస్తున్నాయి.


మరోసారి విజయాన్ని సొంతం చేసుకునేందుకు ప్రముఖ నటుడు, మెగాస్టార్ చిరంజీవి, సహజ నటి త్రిష జట్టు కట్టనున్నట్టు సినీవర్గాల సమాచారం. ఈ ఇద్దరూ హిరోహీరోయిన్ గా నటించిన స్టాలిన్ సూపర్ డూపర్ హిట్ అయిన విషయం తెలుగు రాష్ట్రాల ప్రజలకు తెలిసిందే. ఆ తరవాత ఈ జోడీని మళ్లీ సిల్వర్‌ స్ర్కీన్‌పై చూసే అవకాశం రాలేదు. ఇంత కాలానికి వీరిద్దరూ జంటగా దర్శనమివ్వబోతున్నారని టాక్‌. చిరంజీవి - వశిష్ట కాంబినేషన్‌లో ఓ చిత్రం రూపుదిద్దుకొంటున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో చిరు సరసన ఐదుగురు కథానాయికలు కనిపించబోతున్నారు. అందులో ఓ కథానాయికగా త్రిష ఎంపిక ఖాయమైందని సమాచారం. నిజానికి త్రిష పాత్రలో ముందుగా అనుష్క పేరు పరిశీలించారు. చివరికి త్రిషని ఫైనల్‌ చేసినట్టు వార్తలొస్తున్నాయి. ఈ చిత్రంలో త్రిష దేవకన్యగా కనిపించబోతున్నట్టు సమాచారం. ఈ తరహా పాత్ర త్రిష ఇంత వరకూ చేయలేదు. అందుకే కథ విన్న వెంటనే ‘ఓకే’ చేసిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. మరో నలుగురు కథానాయికలు ఎవరన్నది తెలియాల్సివుంది. ఈ చిత్రానికి ‘విశ్వంభర’ అనే పేరు పరిశీలిస్తున్నారు. సోషియో ఫాంటసీ నేపథ్యంలో సాగే ఈ చిత్రానికి ఎం.ఎం.కీరవాణి సంగీతాన్ని సమకూరుస్తున్నారు. త్రిష పేరు బయటికి రావడంతో మెగా అభిమానులు కేరింతలు కొడుతున్నారు. ఐదుగురు హీరోయిన్లో వస్తున్న ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ కొడుతుందంటున్నారు.

Read More
Next Story