బస్తర్ కోసం యుద్ధం పార్ట్ 4: మావోయిస్టుల తదుపరి అడుగేంటీ?
x
కర్రె గుట్టల కింద నంబీ గ్రామంలో ఇద్దరు గిరిజన యువకులు స్మార్ట్ ఫోన్ లో మునిగిపోయి కనిపించారు: ఫొటోలు దీపక్ దావారే

బస్తర్ కోసం యుద్ధం పార్ట్ 4: మావోయిస్టుల తదుపరి అడుగేంటీ?

మావోయిస్టులు పూర్తిగా తుడిచిపెట్టుకుపోతారా? తమ అడవుల వ్యూహాన్ని వదులుకుంటారా? పరిస్థితి సద్దుమణిగే దాక నిశ్శబ్దం పాటిస్తారా?

 &

మావోయిస్టు ఉద్యమం పూర్తిగా ఓటమి వైపు పయనిస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. మధ్య భారతంలోని అడవులను స్థావరంగా చేసుకుని ఇన్నాళ్లు తమ ఉనికిని కాపాడుకున్న వారిపై భద్రతా దళాలు దాడులు చేస్తూ, వరుస ఎన్ కౌంటర్లలో వారి అగ్ర నాయకులను హతమారుస్తుండటంతో మిగిలిన క్యాడర్ కు ఊపిరి సలపడం లేదు. ప్రాణాలు కోల్పోయిన వారు పోగా, మిగిలిన వారిలో మెజారిటీ లొంగిపోవడానికి మొగ్గు చూపుతున్నారు.

నరేంద్రమోదీ ప్రభుత్వం దేశంలో వామపక్ష తీవ్రవాదాన్ని అంతం చేయడానికి 2026, మార్చి 31 ని గడువు తేదీగా నిర్ణయించుకుంది. అయితే ఇది నిజంగా సాధ్యమవుతుందా? అనే అనుమానాలు సైతం వ్యక్తం అవుతున్నాయి.
మహారాష్ట్రలో పదవీ విరమణ చేసిన పోలీస్ అధికారి ఈ విషయం పై తన అభిప్రాయం చెప్పారు. ఆయనకు నక్సల్స్ వ్యతిరేక కార్యకలాపాలు, అడవులు, పట్టణ ప్రాంతాలలో పనిచేసిన అనుభవం ఉంది.
‘‘వారు పూర్తిగా తుడిచిపెట్టుకుపోతారనే భ్రమలో ఉండకండి. దశాబ్ధాల మా అనుభవం ఏంటంటే..వారు గొప్ప పట్టుదల, దృఢ సంకల్పం ప్రదర్శిస్తారు. ప్రస్తుతం వారు ఎదుర్కొన్న పరిస్థితిని చాలాసార్లు ఎదుర్కొన్నారు. కానీ వారు త్వరలో వారు అంతం అవుతారనే ఆలోచన చేయకూడదు’’ అన్నారు.
అప్పుడు.. ఇప్పుడూ..
1972 లో పశ్చిమ బెంగాల్ లో పోలీస్ కస్టడీలో నక్సల్స్ అసలు కథానాయకుడు చారు మజుందార్ మరణం తరువాత అది అంచెలంచెలుగా ఎదిగి తరువాత అత్యంత శక్తివంతమైన ఉద్యమంగా పెరిగింది. దీనిని ఆయన తన ఉదాహారణగా పేర్కొన్నారు.

జగదల్ పూర్- సుక్మా రోడ్డులోని జీరామ్ ఘాటీ స్మారకం వద్ద హత్యకు గురైన కాంగ్రెస్ నాయకుల ఫొటోలు

యితే 1972 నాటి పరిస్థితులకి, 2025 పరిస్థితులకు తేడా ఉంది. మజుందార్ మరణం తరువాత వారి కార్యకలాపాలను వ్యాప్తి చేయడానికి ప్రజల విశ్వాసాన్ని గెలుచుకోవడానికి నేపాల్ నుంచి కేరళ వరకూ విస్తారమైన అటవీ ప్రాంతం వారికి అండనిచ్చింది.
కొత్తది, అరుదైన సైద్దాంతిక నిబద్దత, అపారమైన అంకితభావం, ధైర్యం, తెలివితేటలు కలిగిన నాయకులు దానికి లభించారు. ముఖ్యంగా అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఎక్కువ మంది రావడం కలిసి వచ్చింది. అంతేకాకుండా గిరిజన ప్రాంతాలలో ప్రభుత్వం ఉనికి కనపడేది కాదు. అక్కడ పరిపాలన, అభివృద్ది అనేది మచ్చుకైనా కానరాని కాలం అది.
ఇదే కాలంలో ప్రభుత్వం, ముఖ్యంగా పోలీసులు దోపిడికి అనువైన పరిస్థితులు కల్పించారనే వాదనలు వినిపించాయి. ఇది మావోయిస్టులు బలపడటానికి ముఖ్యకారణమైంది.
అయితే నేడు అందుబాటులో ఉన్న ప్రకృతి తాత్కాలికంగా దాక్కోవడానికి ఉపయోగపడే ప్రదేశాలుగా మారిపోయాయి. అది కూడా ఆకస్మికంగా పోలీసులు దాడి చేస్తే తప్పించుకునేలా లేవు.
ఎక్కడా గ్యాప్ రావట్లేదు..
దేశ ప్రజలకు ప్రభుత్వాలు చాలా చేయాల్సి ఉన్నా పరిపాలన లోపాలు చాలా వరకూ పూడ్చివేేయబడ్డాయి. ముఖ్యంగా అటవీ హక్కుల చట్టం, పంచాయతీరాజ్ (షెడ్యూల్డ్ ప్రాంతాలకు పొడిగింపు), చట్టం పీసా ద్వారా స్థానికులకు వనరులను నిర్వహించుకునే హక్కును కల్పించాయి.
ఇది మావోయిస్టుల ‘‘జల్, జంగిల్, జమిన్’’(నీరు, అడవులు, భూమి హక్కు) నినాదాన్ని సమర్థవంతంగా అడ్డుకుంది. ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ప్రచారం చేయాడానికి వారికి ఎలాంటి అంశం మిగలలేదు.
భద్రతా సిబ్బందికి నిషిద్ద జోన్ గా ఉన్న ప్రాంతంలోకి విస్తారమైన రోడ్ల నెట్ వర్క్ ఏర్పడింది. పోలీసులు కూడా మావోయిస్టులు స్వయంగా ప్రకటించిన విముక్తి జోన్ లోకి లోతుగా చొచ్చుకుపోయారు. వారు ఈ ప్రాంత ఆధిపత్య కార్యకలాపాలను చేపట్టలేని ప్రదేశం మారిపోయాయి.
ఛత్తీస్ గఢ్ లో కేంద్ర, రాష్ట్ర భద్రత దళాల ఇటీవల కార్యకలాపాలను ద్వారా ఇది స్పష్టంగా తెలిపింది. సంక్షేమ పంపిణీ భాగంలో చాలా చేయాల్సి ఉంది. పోలీస్ స్టేషన్లు, పోస్టుల చుట్టూ నిర్మించిన అభివృద్ది కేంద్రాల ద్వారా ప్రభుత్వ కార్యక్రమాలు ఇప్పుడూ స్థానికులకు అందుబాటులోకి వస్తున్నాయి.
నెట్ వర్క్ కనెక్టీవిటీతో పాటు మొబైల్ ఫోన్లు ఈ ప్రాంతాల్లోకి చొచ్చుకు వస్తున్నాయి. స్థానిక సమాజాలకు పూర్తిగాకొత్త ప్రపంచాన్ని దగ్గరకు చేస్తున్నాయి.
మావోయిస్టులకు సవాల్..
ప్రజల్లో అసంతృప్తిని పెంచే, మావోయిస్టు ఉద్యమానికి ఆజ్యం పోసే అంశాలు చాలా వరకూ తగ్గాయి. ‘‘ అయితే మధ్యప్రదేశ్, జార్ఖండ్ వంటి ప్రాంతాలలో ఇతర రాష్ట్రాలలో దాక్కోవడానికి, తిరిగి ఉద్యమాన్ని నిర్మించడానికి అవసరమైన ప్రాంతాలు ఉన్నాయి.
అలాగే పట్టణ ప్రాంతాల్లో తమ మద్దతుదారుల నెట్ వర్క్ ను నిర్మించుకున్నారు. వారి వాదన ప్రకారం.. పట్టణ ప్రాంతాల్లో వారికి దాదాపు 500 మంది ఉన్నారు. కాబట్టి మావోయిస్టు ప్రచారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడానికి వీటిని ఎలా వినియోగిస్తున్నారో ఇంకా చూడాలి’’ అని అధికారి అన్నారు.
మావోయిస్టులు ఎదుర్కొంటున్న ముఖ్యమైన సమస్య ఏంటంటే..కొత్త క్యాడర్ రాకపోవడం. గతంలో మావోయిస్టులు తమ ఆధీనంలో ఉన్న ప్రాంతాల నుంచి వెనుదిరగడంతో వారి క్యాడర్ నియామకం లో భారీ తగ్గుదల కనిపించింది. ‘‘మాకు స్థానిక మద్దతు తగ్గింది’’ అని ఇటీవల బస్తర్, గడ్చిరోలీ పోలీసుల ముందు లొంగిపోయిన ఇద్దరు అగ్రశ్రేణీ కమాండర్లు చెప్పారు.


చాలా మంది గిరిజనులు ఇన్నాళ్లుగా తాము ఎదుర్కొంటున్న కష్టాల నుంచి బయటపడ్డారు. బీజాపూర్ లోని గల్గామ్ - నంబీ గ్రామాల మధ్య కర్రె గుట్ట కొండల దిగువన ఉన్న ఈ సున్నితమైన రహదారిపై పది సంవత్సరాల క్రితం ఎలాంటి వాహనం కనిపించలేదు. నేడు చాలా మంది యువకులు మోటార్ సైకిళ్లపై కనిపిస్తారు.

స్థానికుల బలమైన మద్దతుతోనే ఈ ఉద్యమం వృద్ది చెందిదని వారు అంటున్నారు. వీరు చెప్పినట్లుగా రాజకీయ, సామాజిక కార్యకలాపాల కంటే సైనిక చర్యలు, ఆధిపత్యంపై ఎక్కువ దృష్టి పెట్టడం దీనికి కారణం. ‘‘నిఘా పెరిగినందున మేము గ్రామస్తులతో సమావేశాలు నిర్వహించలేకపోయాము’’ అని వారిలో ఒకరు ‘ది ఫెడరల్’ తో ఫ్రీవీలింగ్ ఇంటర్వ్యూలో చెప్పారు.
భద్రతా దళాలు స్థానిక గిరిజన యువకులను నియమించుకోవడం ద్వారా వారి జీవితాలను మరింత కష్టతరం చేశాయి. ఎందుకంటే వారు ఆపరేషన్ల సమయంలో చాలా ప్రభావవంతంగా నిరూపించుకుంటారు. వారికి ఈ భూభాగం గురించి పూర్తిగా తెలుసు.
‘‘కొత్తగా నియమించబడిన వారిలో లొంగిపోయిన నక్సల్స్ ఉన్నారు. వారు ఆయుధాలు, నగదు నిల్వలను గుర్తించడంలో మాత్రమే కాకుండా, మావోయిస్టుల కదలికలు, వారి లోకేషన్ గురించి నిఘా సమాచారాన్ని సేకరించడంలో కూడా సహయపడ్డారు.’’ అని ఛత్తీస్ గఢ్ పోలీస్ సీనియర్ ఇంటెలిజెన్స్ అధికారి ఒకరు తెలిపారు.
‘‘ఇటీవల కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా(మావోయిస్టు) ప్రధాన కార్యదర్శి బసవరాజు, దాని కేంద్ర కమిటీ సభ్యుడు సుధాకర్ హత్యలు స్థానికులను లొంగిపోయిన మావోయిస్టులను తమ ఆధీనంలోకి తీసుకోవడం ద్వారా పోలీసులు వ్యూహాత్మక ప్రయోజనాలు సాధించారు’’ అని ఆయన అన్నారు.
ప్రపంచాన్ని కలవడం..
లోతట్టు ప్రాంతాలలోని ప్రజలు బయటి ప్రపంచంతో సంబంధాలు ఏర్పరచుకోవడం వలన కలిగే సహజ పరిణామాలు కొన్ని ఉన్నాయి. వాటిలో టీవీలు రావడం, మొబైల్ ఫోన్లు వంటివి ప్రజల సాంస్కృతిక జీవితంలోకి చొచ్చుకుపోయాయి.
‘‘వారు ఇంతకుముందు ఎప్పుడూ బయటి ప్రపంచాన్ని ఇలా చూడలేదు. బయటి వ్యక్తులతో ఈ పరిచయం వారిలో ముఖ్యంగా యువతలో కొత్త ఆకాంక్షలకు దారి తీసింది’’ అని బీజాపూర్ ఎస్పీ జితేంద్ర యాదవ్ అన్నారు.
అడవుల్లోకి లోతుగా వెళ్లిన గిరిజనులు, తహసీల్ ప్రధాన కార్యాలయాన్ని కూడా ఎప్పుడూ చూడలేదు. జగదల్పూర్, రాయ్ పూర్ వంటి ప్రదేశాలను సందర్శించడం పూర్తిగా మర్చిపోయారు.
చాలా సంవత్సరాలుగా తాము అనుభవించిన ఈ ప్రాంతం నుంచి బయటకు రాగానే వారికి కొత్త ప్రపంచం నుంచి ఘనంగా ఆహ్వానం పలికింది.
‘‘గతంలో మావోయిస్టులు యువతకు వారి సమస్యలకు పరిష్కారాలు మార్క్స్, లెనిన్, మావో తత్వాలతో సాధ్యమని నమ్మించారు. కానీ బయటి ప్రపంచాన్ని చూసిన తరువాత వారు ప్రధాన జనజీవనంలో కలవడం ప్రారంభించారు.’’ అని లొంగిపోయిన మావోయిస్టు పార్టీకి చెందిన దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ డివిజనల్ కమిటీ సభ్యుడు గిరిధర్ అన్నారు.
అంత త్వరగా కిందకి రారు..
లొంగిపోయిన అనేకమంది నక్సలైట్లు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. వీరంతా నారాయణపూర్ లోని ఒక పునరావాస కాలనీలో ఉంటున్నారు. కానీ ఇవన్నీ విన్న తరువాత వారి గత రికార్డును బట్టి చూస్తే మావోయిస్టుల నైతిక స్థైర్యం శాశ్వతంగా విచ్ఛిన్నమైందని భావించవచ్చా?
‘‘నేను అలా అనుకోను. వారు అంత తేలికగా దిగజారిపోరు. వారు మనుగడ సాగిస్తారు. ముఖ్యంగా మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో వారు కొత్త స్థావరాన్ని ఏర్పరచుకోవచ్చు. వారి తదుపరి పెద్ద కోట అయిన జార్ఖండ్ లో కూడా వారు పెరిగే అవకాశం ఉంది’’ అని గడ్చిరోలికి చెందిన ఒక సీనియర్ లొంగిపోయిన మావోయిస్టు అన్నారు.
భవిష్యత్ కనుచూపు మేరలో కనిపిస్తుందా?
బీజాపూర్ ఎస్పీ యాదవ్ మాట్లాడుతూ.. ‘‘మావోయిస్టులు తాము గుర్తించబడతారే భయంతో వారి ప్రసిద్ద బెటాలియన్ 1 లాగా పెద్ద నిర్మాణాలలో కదలలేకపోతున్నారు’’ అని చెప్పారు. ఈ బెటాలియన్ లో దాదాపు 200 మందికి పైగా సుశిక్షితులైన గెరిల్లా ఉంటారని అంచనా.
‘‘బసవరాజు మరణం తరువాత వారు తమ కొత్త నాయకుడిని అత్యవసరంగా ఎన్నుకోవాలనుకుంటున్నారు. కానీ దాని కోసం వారు కలవలేకపోతున్నారు. వారి భవిష్యత్ ప్రయాణాన్ని ప్రణాళిక చేసుకోవడం కష్టతరమైంది’’ అని యాదవ్ అన్నారు.
లొంగిపోయిన మావోయిస్టులు, పోలీస్ అధికారులు చాలామంది తదుపరి ప్రధాన కార్యదర్శిగా భూపతి అలియాస్ మల్లోజుల వేణుగోపాల్ గురించి మాట్లాడుతున్నారు. భూపతి భార్య కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న విమల సిడం అకా తారక్క ఈ సంవత్సరం ప్రారంభంలో గడ్చిరోలి పోలీసుల ముందు లొంగిపోయారు. ఈమె నాలుగు దశాబ్ధాలుగా అజ్ఞాత విప్లవకారిణిగా ఉన్నారు.
తారక్కా ది ఫెడరల్ తో మాట్లాడుతూ.. చాలామంది అగ్రశ్రేణి నాయకులు తప్పుడు దిశలో వెళ్తున్నారు. అయితే ఈ ఉద్యమం మాత్రం కొంతకాలం కొనసాగుతుందని నేను నమ్ముతున్నాము. పార్టీ అత్యున్నత స్థానానికి భూపతి మంచి ఎంపిక(ఛాయిస్) అని ఆమె భావిస్తున్నారు.
ఏప్రిల్- మే నెలల్లో భద్రతా దళాలు 21 రోజుల పాటు నిర్వహించిన ఆపరేషన్ లో 31 మంది మావోయిస్టులను హతమార్చిన కర్రెగుట్టల కొండల వద్ద గుమిగూడిన అనేకమంది మావోయిస్టులలో భూపతి కూడా ఉన్నాడని భావిస్తున్నారు. ఈ ఘర్షణలో చరిత్రలోనే అతిపెద్ద మావోయిస్టు వ్యతిరేక చర్య ఇది. దాదాపు పదివేల మంది భద్రతా సిబ్బంది ఈ ఆపరేషన్ లో పాల్గొన్నారు.

నాలుగు దశాబ్దాలుగా అజ్ఞాత విప్లవకారిణిగా ఉన్న తరువాత ఈ సంవత్సరం ప్రారంభంలో గడ్చిరోలి పోలీసుల ముందు లొంగిపోయిన విమల సిడం అలియాస్ తారక్కా, దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీలో డివిజనల్ కమిటీ సభ్యుడిగా ఉన్న గిరిధర్ అలియాస్ కోలా మంకు. తారక్కా సీపీఐ సీనియర్ నాయకుడు, దాని ప్రధాన కార్యదర్శి పదవికి పోటీపడుతున్న వారిలో ఒకరు

యుద్దం చివరి దశలో ఉందా?
మావోయిస్టుల కేంద్ర కమిటీలో 40 మందికి పైగా సభ్యలు ఉండేవారు. ఇప్పుడు దాని సంఖ్య 20 కంటే తక్కువకు తగ్గిందని చెబుతారు. అలాగే పోలిట్ బ్యూరో లో కూడా 10 -12 మంది ఉండేవారు కాస్త ఇప్పుడు ముగ్గురికి తగ్గారని పోలీసుల అంచనా.
సెంట్రల్ ఇండియా ప్రధాన కార్యాలయం ఇప్పుడు శిథిలావస్థకు చేరడంతో మావోయిస్టులు ఇప్పుడు ఓడిపోయే పోరాటం చేస్తున్నారు. అది ఇప్పుడు ఇంకా చివరి దశకు చేరింది.
పెద్ద బెటాలియన్లు కాస్త ఇప్పుడు చిన్న యూనిట్లుగా విడిపోయి ఉంటున్నారు. వారిపై దాడులను తగ్గించుకోవడానికి ఐఈడీ పేలుళ్ల వ్యూహాలపై ఆధారపడుతున్నారని అధికారులు భావిస్తున్నారు.
ఇటీవల సుక్మా జిల్లాలోని జాగర్గుండ పట్టణంలోని వారపు మార్కెట్ కు భద్రతా దళాలకు కూరగాయాలు కొనడానికి వచ్చిన ముగ్గురిని మావోయిస్టులు నరికి చంపారు.
దీనికి అతి చిన్న బృందం నాయకత్వం వహించింది. ఈ సంఘటన భద్రతా దళాలకు నష్టం కలిగించడానికి వారికి తగినంత బలం ఉందని సూచిస్తుంది.
పున: సమూహా ప్రణాళిక
మావోయిస్టులు గత ఏడాది నుంచి కొత్త ప్రణాళిక అమల్లోకి తెచ్చారు. ఆగష్టు 2024 నాటి మావోయిస్టుల సర్క్యలర్ ప్రకారం వారి కార్యకర్తలను వెనక్కి వెళ్లి తీవ్రతరం అవుతున్న భద్రతా దాడిని ఎదుర్కొనేందుకు చిన్నచిన్న సమూహాలుగా విడిపోవాలని కోరింది.
‘‘మధ్య భారతం అంతటా వారికి దాదాపు 250 మంది సాయుధ క్యాడర్లు మాత్రమే ఉన్నారు. ఇతర ప్రాంతాలలో మరో 150 మంది మాత్రమే ఉన్నారు. వారి ఆయుధాలు, మందుగుండు సామగ్రి కర్మాగారాలను కూడా మేము నాశనం చేశాము.
కాబట్టి వారు వేయి కంటే ఎక్కువ సాయుధ మిలిషియా, మరో 2 వేల మంద సహయకులను కలిగి ఉన్నారు. వారు ఇప్పుడు ఉచ్ఛస్థితికి చేరుకునే అవకాశం లేదు. ’’ అని బస్తర్ ఇన్సెక్టర్ జనలర్ ఆఫ్ పోలీస్ సుందరాజ్ పట్టిలింగం అన్నారు.
కానీ లొంగిపోయిన మావోయిస్టులు, ఉద్యమంలోని ఎత్తుపల్లాలను చూసిన జర్నలిస్టులు మావోయిస్టుల ఉనికి తోసిపుచ్చడానికి సిద్దంగా లేరు.


లొంగిపోయిన మావోయిస్టుల కాలనీలోని యువకులు, అబుజ్మడ్ నుంచి వచ్చిన గ్రామస్తులు నారాయణపూర్ బోర్డర్ లో స్థిరపడ్డారు.

‘‘కొత్త వ్యూహం ప్రకారం చెల్లాచెదురుగా ఉండి, పౌర వేషాల్లో సాధారణ ప్రజలతో కలిసి పోయి చిన్న బృందాలను ఏర్పాటు చేయడం ద్వారా తమ లక్ష్యాన్ని చేరుకునే ప్రయత్నం చేయవచ్చు’’ అని లొంగిపోయిన ఇద్దరు మావోయిస్టులు అన్నారు. ‘‘వారు అంత తేలికగా వదులుకోరు’’ చెప్పారు.
పోస్ట్ స్క్రిప్ట్
2024 రహస్య ప్రకటన ప్రకారం.. అగ్రశ్రేణి కార్యకర్తలు భారత్ లో రహస్య ఆశ్రయాలు పెరగాలని కోరుకుంటున్నారు. అక్కడ వారు ఆశ్రయం పొంది పెరిగిన భద్రత కార్యకలాపాల నుంచి తప్పించుకోవచ్చు.
ప్రస్తుతం మణిపూర్ లో ఐదు, నేపాల్ 22, బంగ్లాదేశ్ 13, జమ్మూకశ్మీర్ లో రెండు, పశ్చిమబెంగాల్ లో దాదాపు 40 ఆశ్రయాలు ఉన్నాయని భద్రతా దళాలు వెంటనే వాటిని లక్ష్యంగా చేసుకోకపోవచ్చని ఈ పత్రం చెబుతోంది.
అరుణాచల్ ప్రదేశ్, ఇతర ఈశాన్య రాష్ట్రాల మారుమూల ప్రాంతాలలోని కొన్ని ఆశ్రయాలను ఏర్పాటు చేయాలని మావోయిస్టులు కోరుకుంటున్నారని ఈ పత్రం ప్రకారం ఆ దిశగా కృషిచేయాలని మావోయిస్టులు కోరుకుంటున్నారు. ఈ పత్రం ప్రకారం.. ఆ దిశగా కృషి చేయాలని వారి కార్యకర్తలను కోరుతున్నట్లు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
ముగింపు భాగం.. కోరాపుట్ పోలీస్ ఆయుధ శాల దాడి, దాని పర్యవసానాలు
Read More
Next Story