బ్రాహ్మణ కొత్తపల్లిలో కాకతీయ శాసనాలు లభ్యం
x

బ్రాహ్మణ కొత్తపల్లిలో కాకతీయ శాసనాలు లభ్యం

మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలంలోని బ్రాహ్మణకొత్తపల్లి గ్రామంలో ఉన్న సంతాన వేణుగోపాలస్వామి దేవాలయ మంటపస్తంభం‌పై..


మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలంలోని బ్రాహ్మణకొత్తపల్లి గ్రామంలో ఉన్న సంతాన వేణుగోపాలస్వామి దేవాలయ మండప స్తంభంపై ఉన్న శాసనాన్ని ఆలయపూజారి ఎం.వేణుగోపాల్, తెలంగాణ వారసత్వశాఖ పూర్వ ఉప-సంచాలకులు సముద్రాల శ్రీరంగాచార్యులు గుర్తించారు. ఈ శాసనాన్ని కొత్త తెలంగాణ చరిత్ర బృందం కన్వీనర్, శ్రీరామోజు హరగోపాల్ చదివి, పరిష్కరించారు.

ఈ శాసనం 13వ శతాబ్దపు తెలుగులిపిలో ఉంది. కాకతీయ రుద్రమదేవ మహారాజులు పాలనాకాలంలో స్థానిక నాయంకరంలోని కుమ్మరికుంట రామనాథదేవరకు రట్టకుల పరతట్ట రాయసాహిణి విచరౌతు ఆ ఊరి (గడ్డ)చెరువు నడితూము కాలువ, పస్రచేనును ఆచంద్రార్కంగా వ్రిత్తిగా చేసిన దాన శాసనమిది. సాధారణంగా శాసనాలలో రుద్రమ అన్న పేరుతో కాకుండ రుద్రదేవమహారాజులు అని కనిపిస్తుంది. ఈ శాసనంలో రుద్రమదేవమహారాజులు అని ఉండడం అరుదుగా పేర్కొనబడ్డది. ఇది విశేషాంశం. ఇది బ్రాహ్మణకొత్తపల్లి గుడిలోని రామనాథదేవరకు కుమ్మరికుంటలో వ్రిత్తిగా చేసిన కొత్త కాకతీయ దానశాసనం అని శ్రీరామోజు హరగోపాల్ వివరించారు.

కుమ్మరికుంట శాసన పాఠం:

‘స్వస్తిశ్రీమతు రట్టకుల(ప)ర

తట్ట(వి)చామ రాయసా

హిణి రఖసపట్టసాహి

ణి చేడరౌతు మను(మం)

డు అమఱౌతుకొడుకు(వి)

చరౌతు కాకతీయ రుద్రమ

దేవమహారాజులుం..నిననాయంక

ఱమునందు కుమ్మరికుంట(లి)శ్రీరా

మనాథదేవరకు ఆ ఊరి..డ్డచ...

నడితూముకాల్వను పస్రసేను

కాల్వకట్ట శాశనాలు చెల్లెను వ్రిత్తి ఆ

చంద్రార్కస్థాయిగాను ఇచ్చెను’

Read More
Next Story