వామ్మో, నాకింత డబ్బు వద్దు!!  ఎవరీ మల్లికా శ్రీనివాసన్, ఏమా గొప్ప..
x
Mallika Srinivasan

వామ్మో, నాకింత డబ్బు వద్దు!! ఎవరీ మల్లికా శ్రీనివాసన్, ఏమా గొప్ప..

రూపాయి కోసం ప్రాణాలు తీస్తున్న ఈ రోజుల్లో ఏకంగా 69 వేల కోట్ల రూపాయలను వదులుకోవడమే.. ఈ వదులుకున్న వ్యక్తి ఎవరు? ట్రాక్టర్ క్వీన్ ఆఫ్ ఇండియా అని ఎందుకంటారు??


"మెరుగవడం అంటే మారడం, పరిపూర్ణంగా ఉండడం అంటే తరచు మారడం" అంటారు బ్రిటన్ మాజీ ప్రధాని, మహామేధావి విన్ స్టన్ చర్చిల్. మార్పు ఒక్కటే స్థిరమైనది! జీవితం రొటీన్ గా ఉన్నట్లు అనిపించినప్పుడు మనలో మనమే తిరుగుబాటు చేసుకోవాలి. పూర్తిగా మార్చేసుకోవాలి. కళాశాల నుంచి డిగ్రీ పట్టా తీసుకోవడం, ఉద్యోగాలు లేదా వ్యాపారాలు చేయడం, ఎవరికి తోచినట్టు వాళ్లు సంపాయించడం మనం నిత్యం చూస్తూ ఉండేవే. డబ్బుకు లోకం దాసోహం అంటున్న ఈ రోజుల్లో ఇక్కడో రిచ్ లేడీ పెద్ద సాహసమే చేశారు. నాకు ఇంత డబ్బు వద్దు, నా బతుకు నే బతుకా నంటున్నారు. విజయ శిఖరాలను ముద్దాడి, గెలుపును ఆస్వాదించి.. నాకిక చాలు అన్నందునే ఆమె ప్రత్యేకత బయటి ప్రపంచానికి తెలిసింది. ఆమె పేరు మల్లిక. వేల కోట్ల రూపాయల అధిపతి. టిఎఎఫ్ఇ (TAFE) ఎండీ. "ట్రాక్టర్ క్వీన్ ఆఫ్ ఇండియా". ప్రస్తుతం ఆమె వార్తల్లోని వ్యక్తిగా నిలిచారు.

ఎవరీ మల్లిక...

1959లో చెన్నైలో ఎ.శివశైలం, ఇందిరా శివశైలం దంపతులకు జన్మించిన మల్లిక ప్రస్తుత వయసు 65 ఏళ్లు. దానధర్మాలు చేయడంలో దిట్టగా పేరుగాంచిన మల్లిక చెన్నైలోని మహిళా క్రిస్టియన్ కళాశాల, భారతీదాసన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్లో చదివారు. ఆ తర్వాత అమెరికా వెళ్లి పెన్సిల్వేనియా యూనివర్శిటీ నుంచి ఎంబీఏ మాస్టర్ చేసి ఇండియాకు తిరిగివచ్చి పారిశ్రామిక వేత్తగా ఎదిగారు. ప్రస్తుతం ఆమె 68 వేల కోట్ల రూపాయలకు పైగా వ్యాపారం చేస్తున్న సంస్థలకు ఎండీ, ఛైర్మన్.

స్విగ్గీ నుంచి ఎందుకు వైదొలిగారంటే...

మల్లికా శ్రీనివాసన్ ఫుడ్ డెలివరీ పరిశ్రమలో ప్రధాన ప్లేయర్. స్విగ్గీలో స్వతంత్ర డైరెక్టర్‌. ఇటీవలే ఆమె ఆ పోస్టు నుంచి కూడా వైదొలిగారు. సుమారు ఓఏడాది పాటు ఆ సంస్థకు డైరెక్టర్ గా పని చేసి ఫిబ్రవరి 8న తప్పుకుంటున్నట్టు అధికారికంగా ప్రకటించారు. ఇదే సమయంలో ఆమె ట్రాక్టర్ అండ్ ఫార్మ్ ఎక్విప్‌మెంట్‌ సంస్థ నుంచి కూడా తప్పుకున్నారు. వార్తల్లోని వ్యక్తిగా నిలిచారు. ఆమె నిబద్ధత, పరిస్థితులకు తగ్గట్టుగా మసలుకోవడం, సామాన్యుడి దరి చేరేలా వ్యాపారం చేయడం ఆమెకు అలవాటు. ఆమె ఆచరించిన కట్టుబాట్లే ఆమె వ్యాపారం పెరగడానికి కారణం.

ట్రాక్టర్స్ అండ్ ఫార్మ్ ఎక్విప్‌మెంట్ లిమిటెడ్ చైర్మన్ అండ్‌ మేనేజింగ్ డైరెక్టర్ మల్లికా శ్రీనివాసన్. ట్రాక్టర్ అంటే గుర్తుకువచ్చేది పురుషులు తప్ప మరెవరూ గుర్తుకురారు. ఎందుకంటే వ్యవసాయం చేసేది వాళ్లేనన్న భ్రమ. అటువంటి చోట ఆమె పాదం మోపారు. విజయబావుటా ఎగురవేశారు. రూ. 10వేల కోట్ల కంటే ఎక్కువ ఆదాయంతో ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ట్రాక్టర్ తయారీదారుగా ఎదిగారు. మహిళలు ఎక్కడైనా సత్తా చాటగలరని ప్రపంచానికి చాటిచెప్పారు.

ట్రాక్టర్ క్వీన్ ఆఫ్ ఇండియా...

1959లో జన్మించిన మల్లికా శ్రీనివాసన్ మద్రాస్ యూనివర్సిటీ డిగ్రీని, అమెరికాలోని పెన్సిల్వేనియా యూనివర్సిటీకి చెందిన వార్టన్ స్కూల్‌లో ఎంబీఏ పట్టా పొందారు. ఆ తరువాత అమెరికా నుంచి తిరిగొచ్చి 1986లో కుటుంబ వ్యాపారంలో చేరారు. ఈ కంపెనీని చెన్నైని 'డెట్రాయిట్ ఆఫ్ ఇండియా'గా మార్చడంలో కీలక పాత్ర పోషించిన , దివంగత, ప్రసిద్ధ పారిశ్రామికవేత్త S అనంతరామకృష్ణన్ 1960లో చెన్నైలోప్రారంభించారు. వ్యాపారంలో అడుగు పెట్టింది మొదలు తన కృషి సాహసోపేతమైన నిర్ణయాలతో కంపెనీని బహుళ-మిలియన్ డాలర్ల వ్యాపారంగా మార్చింది. రైతులు ఆకాంక్షల్ని, ట్రెండ్‌లను గుర్తించి దానికనుగుణంగా సంబంధిత ఉత్పత్తు లుండేలా చూసుకున్నారు. మధ్యతరగతి, వ్యవసాయ ప్రజల కోసం తన చౌకైన ట్రాక్టర్లను అందించడం మొదలు పెట్టారు. అలాగే గ్రామీణ ప్రాంతాలకు వెళ్లినపుడు, అక్కడ టీ షాపుల వద్ద ఆగి, వ్యవసాయ పద్ధతులు, సమస్యలు, తెలుసుకోవడం, ఎలాంటి పరిష్కారాలు కావానుకుంటున్నారో అడిగి తెలుసుకునేవారట.

సవాళ్లు స్వీకరించడం ఆమెకు అలవాటు...

అయితే మార్కెట్ హెచ్చు తగ్గులు ఉన్నప్పటికీ మల్లిక పట్టుదలతో ముందుకు సాగారు. సహేతుకమైన ధరలతో వృద్ధిని కొనసాగించారు. చివరికి మహీంద్రా & మహీంద్రా తర్వాత భారతదేశంలో రెండవ అతిపెద్ద ట్రాక్టర్ తయారీదారుగా కంపెనీని నిలబెట్టారు. 1961లో కేవలం ఒక ట్రాక్టర్ మోడల్‌తోన కంపెనీ వార్షిక టర్నోవర్ రూ. 10,000 కోట్లు. ఆమె టర్కీలో ఒక కర్మాగారాన్ని కూడా స్థాపించారు. వ్యాపారం రంగంలో ఆమెచేసిన సేవలకు గుర్తింపుగా 2014లో ప్రతిష్టాత్మక పద్మశ్రీ పురస్కారాన్ని కూడా అందుకున్నారు. మల్లికా భర్త ఇండియన్ బిలియనీర్ వేణు శ్రీనివాసన్ టీవీఎస్‌మెటార్‌ సీఎండీగా ఉన్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు.

మల్లికా శ్రీనివాసన్ AGCO, టాటా స్టీల్ అండ్‌ టాటా గ్లోబల్ బెవరేజెస్, అలాగే చెన్నైలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) , ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ISB), ఎగ్జిక్యూటివ్ బోర్డు బోర్డులలో కూడా ఉన్నారు. మల్లికా స్విగ్గీ బోర్డులో స్వతంత్ర డైరెక్టర్ పదవి నుండి తప్పుకున్నారు. స్విగ్గీ నెట్‌వర్త్‌ రూ.68918 కోట్లు. ఫోర్బ్స్ ప్రకారం రూ. 23,625.96 కోట్ల నికర విలువతో 83వ సంపన్న భారతీయురాలిగా నిలిచింది.ఫోర్బ్స్ ఇండియా ఉమెన్ లీడర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుతోపాటు, ఫోర్బ్స్ ఆసియా టాప్ 50 ఆసియన్ పవర్ బిజినెస్ వుమెన్‌లలో ఒకరిగా నిలిచారు. జీవితంలో ఎదురయ్యే ఇబ్బందులకుఎప్పటికీ తలొగ్గకూడదని ఆమె చెబుతారు. ఎల్లప్పుడూ అవకాశాల కోసం వెతుకుతూనే ఉండాలంటారు. చేసే పనిని ప్రేమించడమే తన సక్సెస్‌ మంత్రా అంటారు మల్లికా శ్రీనివాసన్‌. మున్ముందు ఆమె తన జీవితాన్ని ప్రశాంతంగా గడపాలంటూ శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

Read More
Next Story