ముస్లిం దేశాల మధ్య విభేదాలే ఇజ్రాయెల్ దాడులకు ఆధారమా?
x

ముస్లిం దేశాల మధ్య విభేదాలే ఇజ్రాయెల్ దాడులకు ఆధారమా?

పశ్చిమాసియా మధ్య ఏళ్లుగా కొనసాగుతున్న సున్నీ- షియా వివాదం, ఇరాన్ ను వ్యతిరేకిస్తున్న సౌదీ అరేబియా


ఇరాన్ అణుశక్తిని సాధించడంపై ఆగ్రహంతో ఉన్న ఇజ్రాయెల్ శుక్రవారం వైమానికదాడులకు దిగింది. ఈ పరిణామంతో పశ్చిమాసియాలో వెంటనే ఉద్రిక్తతలు చెలరేగాయి.

అమెరికా ఈ దాడులకు దూరంగానే ఉన్నప్పటికీ ఇజ్రాయెల్ కు మాత్రం లోపాయికారీ మద్దతు కొనసాగించింది. ఈ పరిణామాలపై ఫెడరల్ కు చెందిన కేఎస్ దక్షిణామూర్తి విశ్లేషించారు.

అణుబాంబుకు దగ్గరైన ఇరాన్..
ఇరాన్ యురేనియాన్ని 60 శాతం వరకూ శుద్ది చేసింది. అంటే అణ్వాయుధ ఆయుధ గ్రేడ్ కు దగ్గరైందని అర్థం. ఈ విషయాన్ని అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ కనుగొంది.
విషయం బయటకు రాగానే ఇజ్రాయెల్ తన అమ్ముల పొదిలో ఉన్న 200 యుద్ధ విమానాలతో 100 లక్ష్యాలపై దాడులకు దిగింది. అణ్వాయుధాలకు తయారు చేయాలంటే 90 శుద్ది అయిన యరేనియం అవసరం.
2015 లో పీ5+1 దేశాలతో ఇరాన్ కు కుదిరిన అణు ఒప్పందం ప్రకారం.. దాని ప్రాజెక్ట్ ను నాలుగు శాతం వరకే పరిమితం చేయాలని ఆదేశించింది. కానీ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్.. ఏకపక్షంగా ఇరాన్ తో ఒప్పందం రద్దు చేసుకున్నారు. దీనితో పరిస్థితి మరోసారి మొదటికి వచ్చింది.
‘‘ఒమన్ రాజధాని మస్కట్ లో ఇరాన్, అమెరికా కొత్త అణు చర్చలకు సిద్దమవుతున్న తరుణంలో ఇజ్రాయెల్ దాడి జరిగిందని’’ దక్షిణామూర్తి విశ్లేషించారు.
ఇజ్రాయెల్ దూకుడుగా వ్యవహరించడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా ‘స్టక్స్ నెట్ వైరస్’ ను ఉపయోగించి సైబర్ యుద్ధం ద్వారా ఇరాన్ పై దాడి చేసింది. అప్పుడు కూడా దాని లక్ష్యం అణు కేంద్రాలే.
ఇజ్రాయెల్ చర్యలు.. అమెరికా ఏమంది ?
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు చెలరేగే అవకాశం ఉన్నందుకు ట్రంప్ ఈ దాడులకు విముఖత వ్యక్తం చేశారు. అయినప్పటికీ ఇజ్రాయెల్ మాత్రం వెనకడుగు వేయలేదు.
ఈ దాడులకు ఇరాన్ కూడా ప్రతిస్పందించింది. 100 కి పైగా డ్రోన్లను టెల్ అవీవ్ పైకి టెహ్రన్ పంపి ప్రతీకారం తీర్చుకోవడానికి ప్రయోగించింది. వీటిలో ఎక్కువ భాగం అమెరికా దాని మిత్రదేశాలు అడ్డగించాయి.
‘‘ఈ పరిణమాలు యుద్ధంగా మారుతుందనే ఆందోళనలు ఉన్నాయి.’’ దక్షిణామూర్తి విశ్లేషించారు కానీ ఇప్పుడు ఇరాన్ ఉన్న పరిస్థితుల్లో పూర్తి స్థాయి యుద్దానికి దిగబోదని అన్నారు.
తాజా దాడులతో తమకు సంబంధం లేదని కూడా అమెరికా స్పష్టం చేసింది. ‘‘ట్రంప్ పరిపాలన ఈ దాడిని ఆమోదించకపోయినా, అమెరికా - ఇజ్రాయెల్ సంబంధాలు మాత్రం ఎటువంటి ఆటంకం లేకుండా కొనసాగుతుంది’’ అని వైట్ హౌజ్ ప్రకటించింది.
బలహీన పడిన ఇరాన్ ప్రాక్సీలు..
ఇజ్రాయెల్, అమెరికా రెండు కలిసి ఇరాన్ కు చెందిన ప్రాక్సీలు లేదా యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ లోని చాలా మంది నాయకులను మట్టుబెట్టాయి. వాటిలో హిజ్బుల్లా, హమాస్, హౌతీలు, సిరియాలోని బషర్ అల్ అసద్ పాలన వంటివి ఉన్నాయి.
హమాస్ మాజీ నాయకుడు ఇస్మాయిల్ హనియే ఇంతకుముందు ఇజ్రాయెల్ ఏకంగా ఇరాన్ లోనే మట్టుబెట్టింది.
‘‘అసద్ పారిపోయిన తరువాత ప్రస్తుత పాలకుడు హైదర్ అల్ షామ్ ఇప్పుడు అమెరికాకు దగ్గరయ్యాడు.’’ అని దక్షిణామూర్తి చెప్పారు. ‘‘ఈ ప్రాంతంలో ఇరాన్ సాంప్రదాయ పొత్తులు, కూటములు విచ్ఛిన్నమయ్యాయి’’ అని కూడా పేర్కొన్నారు.
దాని శత్రువులు అంతా మట్టుబెట్టడంతో ఇప్పుడు ఇరాన్ మీద దాడి చేసిన దానికి ఎక్కువగా ప్రతిఘటన ఎదురుకాదని ఇజ్రాయెల్ భావించిందని విశ్లేషించారు.
షియా- సున్నీ విభజన..
పశ్చిమాసియాలో ఇరాన్ ఒంటరిగా మిగలడానికి ప్రధాన కారణం ఇస్లాంలో ఉన్న షియా- సున్నీ విభేదాలు. వీటి మధ్య చారిత్రాత్మక విభజన ఉంది. ‘‘సున్నీ ఇస్లాం దేశమైన సౌదీ అరేబియా, ఇరాన్ అణు కార్యక్రమాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.’’ అని దక్షిణామూర్తి చెప్పారు.
ఈ మతపరమైన చీలిక బహ్రెయిన్, యూఏఈ, టర్కీ వంటి దేశాలు కూడా ఇజ్రాయెల్ తో స్నేహం చేయడానికి కారణమైంది.
గాజాలో పాలస్తీనియన్ల బాధలు మాత్రం ఆగట్లేదు. ‘‘ఇజ్రాయెల్ పై మాటల్లో వ్యతిరేకత కనపరుస్తున్న చాలా ముస్లిం దేశాలు దాడులు ఆపడానికి పెద్దగా ఏమి చేయవు’’ అని దక్షిణామూర్తి అన్నారు.
ఇజ్రాయెల్ అణు శక్తి..
ఇరాన్ అంతర్జాతీయ పరిశీలనలు ఎదుర్కొంటున్నప్పటికీ ఇజ్రాయెల్ కు సొంత అణ్వాయుధ సామగ్రిని మాత్రం ఎవరూ గుర్తించడానికి వీలులేదని అంటుంది. ఇజ్రాయెల్ దగ్గర దాదాపుగా నాలుగువందల అణ్వాయుధాలు ఉన్నాయని ఓ అంచన.
‘‘ఇజ్రాయెల్ దాడి చేయడానికి ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చేది మాత్రం అమెరికానే. అలాగే బలహీనపడిన మధ్యప్రాచ్య ప్రాంతం. ఇరాన్ మాత్రం దాని ప్రభావాన్ని అణ్వాయుధ ఆశయాలను నిలుపుకోవడానికి పోరాడుతోంది’’ అని దక్షిణామూర్తి విశ్లేషించారు.
Read More
Next Story