
ప్రధాని మోదీతో ఈయూ అధినేత
ఈయూతో ఒప్పందం మరో ఈస్ట్ ఇండియా కంపెనీ లాంటిదా?
న్యూఢిల్లీకి లభించేవి తక్కువ ప్రయోజనాలు?
డీ. రవికాంత్
యూరోపియన్ యూనియన్- భారత్ మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందం ప్రపంచంలో ఇంతకుముందు ఎన్నడూ జరగని ఒప్పందం ఇరుపక్షాలు ఢంకా బజాయిస్తూ ప్రచారం చేసుకుంటున్నాయి.
ఈ వాణిజ్య ఒప్పందం నియామాల ఆధారిత ఆర్థిక వ్యవస్థను శక్తివంతం చేస్తాయని, ఉమ్మడి లక్ష్యాలు సృష్టించి, సమాజాన్ని ముందుకు తీసుకెళ్తాయని, దేశం ఇంతకుముందు ఎన్నడూ ఇలాంటి ఒప్పందం కుదుర్చుకోలేదని కూడా ఆయన ఘంటాపథంగా చెబుతున్నారు.
ఇవే మాటలను ఈయూ అధ్యక్షురాలు ఉర్సులా వాండర్ లేయన్ కూడా వల్లే వేశారు. భారత్ తో కుదిరిన ఎప్టీఏను ‘మదర్ ఆఫ్ ఆల్ డీల్’ గా అభివర్ణించారు. అయితే కాసేపు వీటి మాటల నుంచి పక్కకు జరిగి ఒప్పందాన్ని పరిశీలిద్దాం.
వ్యవసాయం రంగం..
భారత్ నుంచి తరుచుగా ఎగుమతి అయ్యే వ్యవసాయ ఉత్పత్తులపై ఈయూ అనేక ఆంక్షలు విధిస్తోంది. ఇప్పుడు కుదిరిన ఒప్పందం ప్రకారం ఈ సుంకాలు, కఠిన నిబంధనలు ఉండవు. మన వ్యవసాయదారులకు ఇవి అనుకూలంగా ఉంటుంది. ఇది ఆస్ట్రేలియా, యూకే రైతుల కంటే మనకే ఎక్కువ ప్రయోజనం.
భారత్ కూడా అనేక రకాల వ్యవసాయ ఉత్పత్తులపై సుంకాలు తగ్గించింది. వైన్ పై ప్రస్తుతం విధిస్తున్న సుంకాలను 150 నుంచి 20 శాతానికి తగ్గుతాయి. కొన్ని ఉత్పత్తులపై 30 శాతం దాకా ఉంటుంది.
విస్కీ, రమ్, జిన్ వంటి స్పిరిట్ లు కూడా 150 నుంచి 40 సుంకానికి తగ్గుతాయి. బీర్ పై 50 శాతం సుంకం విధిస్తారు. పండ్ల రసాలు, బ్రెడ్లు, పేస్ట్రీలు, బిస్కెట్లు, పాస్తా, కూరగాయల నూనెలు, గొర్రె మాంసంపై సుంకాలు ఉండవు.
పరిశ్రమలు.. మేక్ ఇన్ ఇండియా..
యూరోపియన్ యూనియన్ ఉత్పత్తి చేసే అనేక రకాల పారిశ్రామిక ఉత్పత్తులకు ఎలాంటి సుంకం లేకుండా భారత్ లోకి ప్రవేశిస్తాయి. ముఖ్యంగా యంత్రాలు, విద్యుత్ పరికరాలు, విమానం, అంతరిక్ష నౌకలు, ఆప్టికల్ కేబుల్స్, వైద్యపరికరాలు, రసాయనాలు, ఇనుము- ఉక్కు వస్తువులు మొదలయిన వాటికి ఎలాంటి సుంకం ఉండదు. యూరోపియన్ ఆటోమొబైల్స్ కూడా కేవలం 10 శాతం సుంకం మాత్రమే చెల్లిస్తాయి.
పరిశ్రమ రంగం దేశంలో రోజురోజుకీ క్షీణిస్తోంది. ఈ నేపథ్యంలో వాటికి రక్షణ కల్పించాల్సింది పోయి, విదేశీ ఉత్పత్తులకు ఆమోదం తెలపడం అనేది మేక్ ఇండియాకు మరణశాసనం రాసినట్లే అవుతుంది.
సేవారంగం..
సేవారంగంలో యూరోపియన్ మిత్రులైన యునైటెడ్ కింగ్ డమ్, ఆస్ట్రేలియా కంటే భారత్ కు ఎక్కువ సరళీకరణలు ఇచ్చామని ఈయూ గొప్పగా ప్రచారం చేసుకుంటోంది. కానీ ఇందులో మేధో సంపత్తి హక్కులు వదులుకోవడం వంటివి ఉన్నాయి.
భారత్ ను ప్రపంచ ఫార్మసీ హబ్ గా మోదీ ప్రకటిస్తున్నారు. కానీ యూరోపియన్ ఫార్మాస్యూటికల్ దిగ్గజాలకు ఈ ఒప్పందం ద్వారా గేట్లు తెరిచారు. కాపీరైట్, ట్రేడ్ మార్క్ , డిజైన్, వాణిజ్య రహస్యాలు, ఐపీ హక్కుల ఉన్నత స్థాయి రక్షణకు కూడా భారత్ అంగీకరించింది. సరసమైన జనరిక్ మందులపై ఆధారపడిన ప్రజారోగ్య వ్యవస్థ ఉన్న ఈ దేశానికి ఇది ప్రమాదకరమైన జూదం.
వన్ వే..
యూరోపియన్ యూనియన్ నుంచి వచ్చే వాటిని చెబుతున్నారు కానీ.. మనం ఎగుమతి చేసే అంశాలపై ఇంకా స్పష్టత ఇవ్వడం లేదు. కొన్ని నివేదికలు మాత్రం భారతీయ వస్త్రాలు, తోలు పై సుంకాలు లేకుండా యూరప్ లోకి అడుగుపెట్టవచ్చు.
ఒక మాజీ వాణిజ్య అధికారి మాట్లాడుతూ.. ‘‘ఇది వన్ వే ట్రాఫిక్’’ వలే కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. ఇటీవల భారత్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మధ్య కూడా ఎఫ్టీఏ కుదుర్చుకుందని ఇందులో తక్కువ అవకాశాలతో మనకు లాభం చేకూరుస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.
‘‘మదర్ ఆఫ్ ఆల్ డీల్’’ లో అసౌకర్యమైన నిజం దాగి ఉంది. భారత్ కొత్తగా ఆర్థిక వలస రాజ్యాల కొత్త దశలోకి ప్రవేశించింది. రెండు దశాబ్దాల కింద వచ్చిన ఈస్ట్ ఇండియా కంపెనీ కంటే ఇది మరింత ప్రమాదకరమైనదని అభివర్ణించారు.
టారిఫ్ అడ్డంకులు..
నేటీ వాణిజ్యంలో టారిఫ్ అడ్డంకులు(ఎన్టీబీ) లు ఎక్కువ. ఈయూ వీటిని ఎక్కువ ఉపయోగిస్తోంది. కార్బన్ బోర్డర్ అడ్జస్ట్ మెంట్ మెకానిజం, డీ ఫారెస్ట్ ఫ్రీ ప్రొడక్ట్స్ రెగ్యూలేషన్ వంటి ఏకపక్ష సాధనాలను ఉపయోగిస్తోంది.
అవి అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఇబ్బందిగా ఉంది. భారత్ ను చాలాసార్లు ఇలా ఈయూ సతాయించింది. ఇనుము, ఉక్కు, సిమెంట్, సీబీఏఎం స్థిరంగా ఉంటుందని భారత వాణిజ్య కార్యదర్శి అంగీకరించారు. అలాగే సేవలకు యాక్సెస్ ఫోర్ సేవలను మంజూరు చేసింది.
రిస్క్ భారత్ కా.. చైనా కా..
ఈయూకి భారత్ రాయితీలు ఇవ్వడం కూడా ఇప్పుడు అనేక అనుమానాలను లేవనెత్తుతోంది. ఇది చైనాకు వ్యతిరేకంగా తీసుకొచ్చిందా లేదా భారత్ కా అనేది అర్థం కావడం లేదు.
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానికి అవసరమైన రేర్ ఎర్త్ మినరల్స్ ను చైనానే సరఫరా చేస్తోంది. అయితే ఈ ఒప్పందంలో కేవలం ఈయూకు మాత్రమే భారత్ అవకాశం కల్పించింది. అయితే చైనా, ఆసియాన్ దేశాలతో ఇలాంటి ఒప్పందమే కుదుర్చుకుంటే భారత్ విమర్శలు గుప్పించింది.
ఈయూ- యూఎస్ మధ్య సీన్ రివర్స్..
గత సంవత్సరం ఈయూ- అమెరికాతో ఒక ఫ్రేమ్ వర్క్ ఒప్పందానికి అంగీకరించింది. దాని ఎగుమతులపై 15 శాతం సుంకం విధించింది. అనేక అమెరికా వస్తువులపై ఎలాంటి సుంకం విధించట్లేదు. కానీ భారత్ ఒప్పందం మాత్రం ఇలా జరగలేదు. ఈ ఎగుమతులపై ఎలాంటి సుంకాలు విధించలేదు.
భారత్ ద్వైపాక్షికంగా ఈయూకి వాణిజ్య సార్వభౌమత్వన్ని అప్పగించినప్పటికీ త్వరలోనే డబ్ల్యూటీఓ బ్రస్సెల్స్ ను ఎదుర్కోవచ్చు. కొత్త ఎఫ్టీఏ ఒక అగ్ని పరీక్ష. నియమాల ఆధారిత వాణిజ్య ఒప్పందాన్ని పూడ్చడానికి ఉపయోగపడుతుందా?
మొత్తం మీద భారత్ మెకాలే ఈస్ట్ ఇండియా కంపెనీని బహుళ సభ్యుల యూరోపియన్ వలస రాజ్యాల ప్రాజెక్ట్ కోసం వర్తకం చేస్తున్నట్లు కనిపిస్తోంది. మోదీ ఆధ్వర్యంలో ప్రజాస్వామ్యం, చట్టపాలన కేంద్రీకృత అధికారం, ఆర్థిక సమర్ఫణ ఉంది.
Next Story

