ప్రభాకరన్ గురించి అసలు సంగతి చెప్పిన సోదరుడు.. ఆయన యుద్ధంలో ..
x

ప్రభాకరన్ గురించి అసలు సంగతి చెప్పిన సోదరుడు.. ఆయన యుద్ధంలో ..

ఎల్టీటీఈ వ్యవస్థాపక అధ్యక్షుడు వేలుపిళ్లై ప్రభాకరన్ గురించి ఆయన సోదరుడు మనోహారన్ సంచలన విషయాలు బయటపెట్టాడు. కొంతమంది ప్రభాకరన్ బతికే ఉన్నాడని..


LTTE వ్యవస్థాపక నాయకుడు వేలుపిళ్లై ప్రభాకరన్, అతని భార్య, వారి ముగ్గురు పిల్లలు చనిపోయారని ప్రభాకరన్ అన్నయ్య వేలుపిళ్లై మనోహరన్ మొదటి సారిగా బహిరంగంగా ప్రకటించారు. వీరంతా 2009లో శ్రీలంక యుద్ధం చివరి దశలో మరణించారని వెల్లడించారు.

మనోహరన్, జాఫ్నా మానిటర్ మ్యాగజైన్ తాజా సంచికతో మాట్లాడుతూ, ప్రభాకరన్.. అతని కుటుంబ సభ్యులు కొంతమంది ఇంకా బతికే ఉన్నారని చెబుతూ అమాయక తమిళుల నుంచి డబ్బు వసూలు చేయడానికి కొంతమంది ప్రవాసులు భారీ కుట్రకు తెరలేపారని, ఈ కుంభకోణానికి ముగింపు పలికేందుకే తాను ఈ విషయాన్ని బయటపెడుతున్నట్లు చెప్పారు.
డెన్మార్క్‌లో ఉన్న మనోహరన్ ఓవార పత్రిక జర్నల్‌తో మాట్లాడుతూ, “ప్రభాకరన్ అన్నయ్యగా, ఈ అర్ధంలేని పనిని ముగించడం నా బాధ్యత అని నేను భావించాను. " నా సోదరుడు జీవించి ఉన్నాడని, విదేశాలలో నివసిస్తున్నాడని తప్పుడు పుకార్లు వచ్చాయి." అదంతా అబద్ధం.
నకిలీ కథనాన్ని తొలగించడం
మే 18న డెన్మార్క్‌లోని DGI హుసెట్ కాన్ఫరెన్స్ సెంటర్‌లో తన కుటుంబ మొదటి స్మారకోత్సవాన్ని ఆశేష శ్రీలంక తమిళుల మధ్య ప్రభాకరన్ నిర్వహించారు. ఆ తరువాత కొద్ది రోజులకే ఆయన బహిరంగంగా మాట్లాడారు.
ఇటీవలి నెలల్లో, పశ్చిమ దేశాల్లో నివసిస్తున్న ఒక తమిళ యువతి తాను ప్రభాకరన్ కుమార్తె తువరాగా (ద్వారక) అని తప్పుగా క్లెయిమ్ చేసింది, "మిలియన్ల డాలర్లతో డయాస్పోరాను మోసం చేసింది" అని మనోహరన్ చెప్పారు.
“ప్రభాకరన్ అన్నయ్యగా, అతనికి, అతని కుటుంబానికి ఏమి జరిగిందో వాస్తవాలను వెల్లడించాల్సిన బాధ్యత నాకు ఉంది. మనం మాట్లాడకపోతే, ఈ తప్పుడు కథనాలు ఆధిపత్యం చెలాయిస్తాయి. ఈ అర్ధంలేనిదాన్ని అందరూ నమ్ముతారు, ”అని అతను చెప్పాడు.
'ప్రభాకరన్‌తో మాట్లాడాను'
1975లో ప్రభాకరన్ తమిళ మిలిటెన్సీ ర్యాంకులను మెల్లగా పెంచుకుంటూ పోతున్న సమయంలోనే మనోహారన్ శ్రీలంకను విడిచిపెట్టాడు. ఆ తరువాతనే 1976లో లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం (LTTE)స్థాపించబడింది. ఆ తర్వాత ఇందులో ప్రభాకరన్ అత్యంత ఘోరమైన తిరుగుబాటుదారుల్లో ఒకరిగా ఎదిగారు.
మనోహరన్ జాఫ్నా మానిటర్‌తో మాట్లాడుతూ తాను 2008 చివరి వరకు ప్రభాకరన్‌తో తరచూ టెలిఫోన్‌లో మాట్లాడేవాడినని వివరించారు. చివరిగా ప్రభాకరన్ హత్యకు గురయ్యే కొన్ని నెలల ముందు మే నెలలో 2009లో మాట్లాడినట్లు చెప్పాడు.చివరి సంభాషణలను గుర్తుచేసుకుంటూ, మనోహరన్ ఇలా అన్నాడు: "అతను (ప్రభాకరన్) పరిస్థితి చేయి దాటిపోతోందని తల్లిదండ్రులు అతనితో ఉన్నందున సలహా అడిగారు."
'సమస్యలు' చాలా ఉన్నాయి..
ఎల్టీటీఈ యుద్ధం ముగియబోతోందని ప్రభాకరన్ ఎప్పుడైనా ఒప్పుకున్నారా అని అడిగిన ప్రశ్నకు మనోహరన్ ఇలా సమాధానమిచ్చారు: “లేదు, అతను అలా అనలేదు. వారు పోరాటం కొనసాగిస్తారని ఆయన చెప్పారు, అయితే సమస్యలు అధికంగా ఉన్నాయని మాత్రం అంగీకరించారు.
స్వతంత్ర తమిళ ఈలం కోసం సాయుధ పోరాటం మే 2009లో ముగిసినప్పటి నుంచి, పి నెడుమారన్‌తో సహా తమిళనాడులోని కొంతమంది రాజకీయ నాయకులు.. ఎల్‌టిటిఇ అనుకూల తమిళ డయాస్పోరాలోని ఒక వర్గం ప్రభాకరన్ సంఘర్షణ ప్రాంతం నుంచి తప్పించుకున్నారని ఏదో ఒక రోజు బయటపడతారని ప్రచారం చేస్తున్నారు.
నవంబర్ 2023లో ఒక తమిళ యువతి తాను ప్రభాకరన్ కూతురిగా చెప్పుకుంటూ, తమిళ రాజకీయ పోరాటానికి మద్దతునిస్తూనే ఉన్నానని చెప్పడంతో పరిస్థితి అధ్వాన్నంగా మారింది.
నకిలీ 'కుమార్తె'
ఆ మహిళ ప్రభాకరన్ కుమార్తె కాదని, నకిలీ అని త్వరలోనే తేలినప్పటికీ, LTTE చీఫ్ భార్య, కుమార్తె సజీవంగా ఉన్నారని కొందరు తమిళులు వాదిస్తూనే ఉన్నారు. మనోహరన్ రెండు ప్రసిద్ధ తమిళ డయాస్పోరా సంస్థలు, పశ్చిమాన నివసిస్తున్న కొంతమంది తమిళులు డబ్బును స్వాహా చేసేందుకు ప్రభాకరన్ కుటుంబంపై అబద్ధాలు చెబుతున్నారని ఆరోపించారు.
“ఈ వ్యక్తులు, సంస్థలు మోసం కోసం సంక్లిష్టమైన నెట్‌వర్క్‌ను రూపొందించారు. వారు ప్రభాకరన్ కుమార్తె, భార్య ఇప్పటికీ జీవించి ఉన్నారని తప్పుడు క్లెయిమ్ చేయడం ద్వారా తమిళ డయాస్పోరాకు చెందిన భావోద్వేగ, ఆర్థిక సాయాన్ని ఉపయోగించుకుంటారు. ఈ క్లెయిమ్ ప్రభాకరన్ కుటుంబానికి, తమిళ ప్రయోజనాల కోసం తాము సాయం చేస్తున్నామని నమ్మే మంచి ఉద్దేశ్యంతో ఉన్న మద్దతుదారుల నుంచి నిధులు పొందేందుకు ఉపయోగించబడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
సులభంగా డబ్బు సంపాదన
“ఇదంతా ఈజీ మనీ గురించి. ప్రభాకరన్ జీవించి ఉన్నాడని తప్పుగా క్లెయిమ్ చేయడం ద్వారా, వారు కష్టపడి పని చేయకుండా లేదా ఏదైనా ముఖ్యమైన పని చేయకుండానే మిలియన్ల కొద్దీ డాలర్లు సంపాదించగలరు.
ఇలాంటి మోసంలో పాల్గొన్న వారిలో ఒకరిని శ్రీధరన్ అని పేర్కొన్నాడు, అతను 2004లో తాను శ్రీలంక నుంచి వచ్చానని, సాయం చేయవలసి ఉందని ఒక వ్యక్తిని తీసుకువచ్చాడు. “నేను అతనికి 25,000 క్రోనార్లు ఇచ్చాను, కాని ఆ వ్యక్తి నిజానికి ఇటలీకి చెందినవాడని, తమిళ ఈలం కాదని తర్వాత తెలుసుకున్నాను. ఈ విషయాన్ని నా సోదరుడు ప్రభాకరన్‌కు కూడా తెలియజేశాను.
ఎంపీలు కూడా అవినీతిపరులు
శ్రీలంకలో యుద్ధం ముగిసినప్పుడు సైనిక ఆధీనంలోని భూభాగాన్ని దాటిన తర్వాత తన తల్లిదండ్రులతో సంబంధాలు కోల్పోయినట్లు మనోహరన్ చెప్పారు.
“మేము వివిధ తమిళ జాతీయవాద ఎంపీలను సంప్రదించాము కానీ వారు మాకు సాయం చేయలేదు. కొంతమంది ఎంపీలు మా తల్లిదండ్రులతో సంభాషించడానికి పరోక్షంగా డబ్బు అడిగారు. అయితే మనోహరన్ ఎంపీలలో ఎవరి పేరు చెప్పడానికి నిరాకరించారు, "వారు ఇప్పటికీ అక్కడ ఉన్నారు, వారంతా పార్లమెంట్ ను ఆక్రమించారు" అని అన్నారు. ప్రభాకరన్, అతని కుటుంబం ఏదో ఒకచోట, ఎక్కడో సజీవంగా ఉన్నారని నమ్మడం మానేయాలని తమిళులను మనోహరన్ కోరారు.
“నా సోదరుడు ప్రభాకరన్, అతని కుటుంబం మొత్తం ఇప్పుడు లేరు. వారంతా అమరవీరులయ్యారు. ఈ వాస్తవాన్ని అంగీకరించడం చాలా అవసరం. దయచేసి నా సోదరుడి కుటుంబం అని చెప్పుకునే ఈ మోసగాళ్ల బారిన పడకండి. ఈ వ్యక్తులు మీ భావోద్వేగాలను, నా సోదరుడి వారసత్వాన్ని వారి స్వంత లాభం కోసం ఉపయోగించుకుంటున్నారు.
సోదరుడి సలహా
ఎవరైనా నిజంగా ప్రభాకరన్ జ్ఞాపకాన్ని గౌరవించాలనుకుంటే, “శ్రీలంకలోని మా ప్రజలకు సాయం చేయడంపై దృష్టి పెట్టండి. యుద్ధంలో ప్రభావితమైన చాలా మంది తమిళులు ఇప్పటికీ కడు పేదరికంలో జీవిస్తున్నారు. కడుపు నింపుకోవడానికి రోజు పోరాటాలు చేస్తున్నారు. వారికి మీ సాయం అవసరమని చెప్పారు.
“యుద్ధంలో ప్రభావితమైన ఈ వ్యక్తుల జీవితాలను పునర్నిర్మించడానికి మీ ప్రయత్నాలు, వనరులు కేటాయించండి… మా తమ్ముడి వారసత్వాన్ని సజీవంగా ఉంచడానికి ఇదే ఉత్తమ మార్గం." అని సూచించారు.
నవంబర్ 1954లో జాఫ్నాలోని మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన ప్రభాకరన్, ఇంట్లో నలుగురు పిల్లలలో చిన్నవాడు. అతను 1984 లో తమిళనాడులోని ఒక హిందూ దేవాలయంలో మధివతనిని వివాహం చేసుకున్నాడు. వారికి ముగ్గురు పిల్లలు ఉన్నారు.
శ్రీలంక సైన్యం ప్రకారం మే 19,2009న జరిగిన పోరాటంలో ప్రభాకరన్ మరణించాడు . అతని చిన్న కొడుకు పట్టుబడిన తర్వాత కాల్చి చంపబడ్డాడు. పెద్ద కొడుకు గొడవల్లో చనిపోయాడు. మిలిటరీ దాడిలో భార్య, కుమార్తె కూడా మరణించారని, అయితే వారి మృతదేహాలు ఇప్పటి వరకూ దొరకలేదని తమిళులు చెబుతున్నారు.


Read More
Next Story