
అమెరికా నుంచి డబ్బు పంపితే మరో 5 శాతం అదనపు పన్ను?
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సరికొత్త రూపంలో అక్కడ ఉంటున్న భారతీయులపై ఆర్ధిక భారాన్ని మోపేందుకు సమాయత్తమవుతున్నారు.
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సరికొత్త రూపంలో అక్కడ ఉంటున్న భారతీయులపై ఆర్ధిక భారాన్ని మోపేందుకు సమాయత్తమవుతున్నారు. నాలుగు డబ్బులు సంపాయించి స్వదేశంలోని తల్లిదండ్రులకూ, భార్యాబిడ్డలకో పంపాలనుకునే వారి ఆశలపై ట్రంప్ నీళ్లు చల్లేలా సుంకాన్ని పెంచబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి.
సుంకాల పెంపు నిర్ణయాలతో ఇప్పటికే ప్రపంచ దేశాలను హడలెత్తిస్తున్న ట్రంప్ (Donald Trump) అమెరికాయేతర పౌరులపై మరో భారం మోపనున్నారు. అమెరికాలో ఉన్న ఇతర దేశాల వాసులు తమ స్వదేశానికి చేసే నగదు బదిలీపై (Outward Remittances) 5శాతం పన్ను విధించేందుకు ట్రంప్ సర్కార్ సిద్ధమవుతోంది. ఇది అమల్లోకి వస్తే లక్షలాది మంది భారతీయులపైనా ప్రభావం చూపనుంది.
ప్రతిపాదిత చట్టం ఎలా ఉంటుంది?
అమెరికా ప్రతినిధుల సభ ముందుకు ఈ బిల్లు త్వరలోనే ప్రవేశపెట్టనున్నారు. విదేశీయులపై మాత్రమే కాకుండా, హెచ్-1బీ వీసా హోల్డర్లు, గ్రీన్ కార్డు దారులు కూడా తమ దేశాలకు పంపే నగదు బదిలీపై కూడా ఈ పన్ను వర్తించనుంది. రెమిటెన్స్పై పన్ను విధించాలన్న ఈ నిర్ణయం ట్రంప్ ‘అమెరికా ఫస్ట్’ విధానానికి మరోసారి రూపాన్ని ఇస్తోందన్న భావన నెలకొంది.
భారత్పై ప్రభావం ఎంత?
రిజర్వ్ బ్యాంక్ గణాంకాల ప్రకారం 2023–24 సంవత్సరానికి భారత్కు వచ్చిన మొత్తం రెమిటెన్స్ 118.7 బిలియన్ డాలర్లు. అందులో 32 బిలియన్ డాలర్లు అమెరికా నుంచే వచ్చాయి. వాటిపై 5% పన్ను విధిస్తే 1.64 బిలియన్ డాలర్ల వరకు భారత్ తగిలే భారం అవుతుంది. దేశానికి వచ్చే మొత్తం రెమిటెన్స్లో ఇప్పటివరకు గల్ఫ్ దేశాలు ప్రధాన మూలాలు కాగా, ఇటీవల కాలంలో అమెరికా, బ్రిటన్, కెనడా, సింగపూర్, ఆస్ట్రేలియాల నుంచే ఎక్కువ భాగం వస్తోంది. అభివృద్ధి చెందిన దేశాల నుంచే ప్రస్తుతం 50%కి పైగా నగదు బదిలీలు వస్తున్నాయి.
ప్రపంచ స్థాయిలో భారత స్థానం
ప్రపంచ బ్యాంకు నివేదికల ప్రకారం 2008 నుంచి ప్రపంచంలోనే అత్యధిక రెమిటెన్స్లు అందుకుంటున్న దేశంగా భారత్ మొదటి స్థానంలో ఉంది. 2024 నాటికి ప్రపంచ రెమిటెన్స్ వాటాలో భారత వాటా 14 శాతానికి పెరిగింది. ప్రస్తుతం ఏడాదికి దాదాపు 129 బిలియన్ డాలర్లు రెమిటెన్స్ రూపంలో భారత దేశానికి వస్తున్నట్లు అంచనా. భారత్ తరువాతి స్థానాల్లో మెక్సికో, చైనా, ఫిలిప్పీన్స్, పాకిస్థాన్ ఉన్నాయి.
ఎందుకు పన్ను? ఎలాంటి ప్రభావాలు?
ఈ పన్ను ప్రయోజనాన్ని అమెరికా ప్రభుత్వం అంతర్భాగంగా చూసే అవకాశమున్నా, దీని ద్వారా ప్రవాసీయులపై ఆర్థిక ఒత్తిడి పెరగనుంది. అమెరికాలో పనిచేస్తున్న వలసకూలీలు వారి కుటుంబాలకు సకాలంలో డబ్బు పంపడంలో ఇబ్బందులు పడే పరిస్థితి తలెత్తే అవకాశం ఉంది. ముఖ్యంగా భారతీయులపై దీని ప్రభావం ఎక్కువగా ఉండేలా కనిపిస్తోంది.
ట్రంప్ ప్రతిపాదించిన రెమిటెన్స్ పన్ను ఒకవైపు అమెరికాలో ‘దేశపు డబ్బు దేశంలోనే ఉంచాలన్న’ వాదనకు బలం ఇచ్చినప్పటికీ, వలస కార్మికుల జీవన నాణ్యతపై ప్రభావం చూపే ప్రమాదం ఉంది. అటు భారత్ వంటి దేశాల ఎకానమీకి కూడా ఇది ఎదురుదెబ్బే. వలస జీవన విధానానికి ఇది ఒక నూతన సవాలుగా మారనున్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది.
రెమిటెన్స్ పన్ను విధింపునకు సంబంధించి ప్రతిపాదిత బిల్లు ప్రతినిధుల సభ ముందుకు రానుంది. విదేశీయులు సహా హెచ్-1బీ, గ్రీన్ కార్డుదారులు బదిలీ చేసే నగదుపై ఈ పన్ను వర్తించనుంది. కేవలం భారత్కు వచ్చే నగదుకే దాదాపు 1.6 బిలియన్ డాలర్లు పన్ను రూపంలో చెల్లించాల్సి వస్తుందని అంచనా.
ప్రపంచ బ్యాంకు నివేదిక ప్రకారం.. ప్రపంచంలోనే అత్యధికంగా రెమిటెన్స్లు అందుకుంటున్న దేశాల్లో 2008 నుంచి భారత్ అగ్రస్థానంలో ఉంది. ప్రపంచ రెమిటెన్స్లలో 11శాతం ఉండగా.. 2024నాటికి 14శాతానికి పెరిగింది. ప్రస్తుతం దాదాపు 129 బిలియన్ డాలర్లు రెమిటెన్స్ రూపంలో వస్తున్నట్లు అంచనా.