భారత్ విషయంలో ఎక్కడో తప్పు జరిగింది: యూనస్
x
బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ సారథి యూనస్

భారత్ విషయంలో ఎక్కడో తప్పు జరిగింది: యూనస్

హసీనా పై ఉన్న కోపం భారత్ పైకి మళ్లిందన్న బంగ్లా తాత్కాలిక ప్రభుత్వ సారథి


భారత్ తో తాము ఎప్పుడూ మంచి సంబంధాలనే కోరుకున్నామని, కానీ ఎక్కడో తప్పు జరిగిందని బంగ్లాదేశ్ ప్రభుత్వ ప్రధాన సలహదారు మహ్మద్ యూనస్ అన్నారు.

లండన్ లోని చాథమ్ హౌజ్ థింక్ ట్యాంక్ డైరెక్టర్ బ్రోన్ వెన్ మాడాక్స్ తో జరిగిన సంభాషణలో ఆయన ఈ మాట అన్నారు. భారత్ తో ద్వైపాక్షిక సంబంధాలు, వచ్చే నెలలో జూలై చార్టర్ లో ప్రారంభమయ్యే దేశ ప్రజాస్వామ్య రోడ్ మ్యాప్ తో సహ అనేక రకాల అంశాలను ఈ సందర్భంగా యూనస్ ప్రస్తావించారు.
భారత్ తో సంబంధాలు..
పదవీచ్యుతుడైన ప్రధానమంత్రి షేక్ హసీనా ను అప్పగించాలని కోరుతూ భారతదేశానికి జారీ చేసిన అనధికారిక దౌత్య నోట్ ను మాడాక్స్ ప్రస్తావించారు. ఈ విషయం పై యూనస్ నుంచి తాజా సమాచారం కోరారు.
‘‘ఇది కొనసాగుతోంది. మొత్తం ప్రక్రియ చాలా చట్టబద్దంగా చాలా సముచితంగా ఉండాలని మేము కోరుకుంటున్నాము. భారత్ తో ఉత్తమ సంబంధాన్ని ఏర్పరచుకోవాలనుకుంటున్నాము.
ఇది మా పొరుగు దేశం, వారితో మాకు ఎలాంటి ప్రాథమిక సమస్యలు ఉండకూడదనుకుంటున్నాము’’ అని యూనస్ అన్నారు.
హసీనాను పదవి నుంచి తొలగించిన తరువాత న్యూఢిల్లీ- ఢాకా మధ్య సంబంధాలు ఉద్రిక్తంగా మారాయి. ముఖ్యంగా హసీనాకు భారత్ ఆశ్రయం కల్పించడం బంగ్లా మతోన్మాద పాలకులకు సుతారము నచ్చలేదు.
గత సంవత్సరం ఆగష్టు 5న విద్యార్థుల నేతృత్వంలోని జరిగిన అతిపెద్ద ఆందోళన తరువాత ఢాకా నుంచి ఆమె పారిపోవాల్సి వచ్చిన తరువాత ఆమె అనేక కేసులను ఎదుర్కోవాల్సి వచ్చింది.
భారత్ తప్పుడు ప్రచారం..
ఆగష్టు 2024 లో హసీనా పదవీచ్యుతి తరువాత బాధ్యతలు స్వీకరించిన తనపై భారత్ పదే పదే తప్పుడు సమాచారం చేస్తోందని, దీనిపై బంగ్లా ప్రజలు కోపంగా ఉన్నారని ఆయన అన్నారు.
‘‘కానీ భారతీయ పత్రికల నుంచి వస్తున్న నకిలీ వార్తల కారణంగా ప్రతిసారీ విషయాలు తప్పుగా జరుగుతున్నాయి. దీనికి విధాన నిర్ణయాలు తీసుకునే వారితో సంబంధం ఉంది’’ అని యూనస్ అన్నారు.
‘‘మేము ఈ కోపాన్ని అధిగమించడానికి ప్రయత్నిస్తున్నాముం. కానీ సైబర్ స్పేస్ లో అనేక విషయాలు జరుగుతూనే ఉంటాయి. మనం దాని నుంచి తప్పించుకోలేము. అకస్మాత్తుగా వారు ఏదో అంటారు.. చేస్తారు. దానికి కోపం వస్తుంది. మనం కలలు కంటున్న జీవితాన్ని సృష్టించడం చాలా కష్టం’’ అని ఆయన అన్నారు.
హసీనా అనంతరం పరిణామాలు..
హసీనా విషయంలో ‘‘భారత్ అస్పష్టమైన పాత్ర’’ పోషించిందని యూనస్ అన్నారు. హసీనాపై ఉన్న కోపం ఆమె భారత్ చేరడంతో వాళ్లపైకి(భారత్) చేరిందని అన్నారు.
‘‘ప్రధాని మోదీతో మాట్లాడే అవకాశం వచ్చినప్పుడూ నేను ఇలా అన్నాను. మీరు ఆమెకు ఆతిథ్యం ఇవ్వాలనుకుంటున్నారు. ఆ విధానాన్ని వదులుకోవాలని నేను మిమ్మల్ని బలవంతం చేయలేదు. కానీ ఆమె ఆన్ లైన్ లో మాట్లాడే విధంగా బంగ్లాదేశ్ ప్రజలతో మాట్లాడకుండా చూసుకోవడానికి దయచేసి మాకు సహాయం చేయండి. ఆమె మాట్లాడితే బంగ్లాదేశ్ చాలా కోపంగా ఉంటుంది’’ అని యూనస్ పేర్కొన్నారు.
హసీనా సోషల్ మీడియా కార్యకలాపాలను తాము నియంత్రించలేమని ప్రధాని మోదీ తనతో చెప్పారని యూనస్ అన్నారు. ‘‘ఇది ఒక విపత్కర పరిస్థితి. సోషల్ మీడియా అని చెప్పి మీరు దూరంగా ఉండలేరు’’ అని ఆయన అన్నారు.
వచ్చే ఏడాది ఎన్నికలు..
2026 ప్రథమార్థం నాటికి జాతీయ ఎన్నికలు జరుగుతున్నాయని యూనస్ గతవారం ప్రకటించారు. ఎన్నికైన ప్రభుత్వంలో చేరడాన్ని పరిశీలిస్తారా? అని ప్రశ్నకు సమాధానమిస్తూ.. దానికి అవకాశం లేదని అన్నారు.
నాలుగు రోజుల పర్యటన కోసం ఆయన మంగళవారం యూకే చేరుకున్నారు. యూకేలోని హసీనా అవామీ లీగ్ పార్టీ సభ్యుల నుంచి ఆయనకు నిరసనలు ఎదురయ్యాయి. ఈ పర్యటనలో యూనస్ రాజు చార్లెస్ 3, బ్రిటిష్ ప్రభుత్వంలోని సీనియర్ సభ్యులను కలవనున్నారు.
Read More
Next Story