
‘‘మీరు తెలుసుకోవాల్సిన ఇరాన్- యూఎస్ కథ ఇది’’
అప్పట్లో గాఢమైన స్నేహం.. ఇప్పుడేమో శత్రుత్వ, వీళ్లకు ఎక్కడ చెడిందంటే..
ఇరాన్ అణుకేంద్రాలపై అమెరికా కొద్ది రోజుల క్రితం వైమానిక దాడులకు పాల్పడింది. ఇప్పటికే ఇరాన్- ఇజ్రాయెల్ మధ్య ఉన్న అస్థిర సంబంధాలను ఇది మరింత దూరం జరిపింది.
నతాంజ్, ఇస్ఫహాన్, ఫోర్డోలను నాశనం చేయడానికి బీ-2 బాంబర్లు పంపాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయం తీసుకున్నాడు. ఈ నిర్ణయం ఈ ప్రాంతంలో విస్తృత సంఘర్షణ భయాలను రేకెత్తించింది.
అమెరికా- ఇరాన్ ఒకప్పుడూ అణు పురోగతిలో భాగస్వాములు. 1957 లో అధ్యక్షుడు ఐసెన్ హోవర్, ఇరాన్ అణు కార్యక్రమానికి ప్రారంభించడానికి సహాయం చేశాడు. ఒక దశాబ్దం తరువాత అమెరికా- టెహ్రాన్ కు అణు రియాక్టర్, యురేనియం ను విరాళంగా ఇచ్చింది. ఆ తరువాత వీరి మైత్రి చాలాకాలం సుస్థిరంగా కొనసాగింది.
ఉద్రిక్తతకు మూలం..
1953 లో వాషింగ్టన్, లండన్ తో కలిసి ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రధానమంత్రి మొహ్మద్ మొసాదేగ్ ను పదవీచ్యుతునీ చేసిన తిరుగుబాటుతో రెండు దేశాల మధ్య సంబంధాలు మొదటిసారిగా డోలాయామానంలో పడ్డాయి.
చమురు పరిశ్రమలను జాతీయం చేయాలని అప్పటి ప్రధాని మొసాదేగ్ నిర్ణయం తీసుకున్నారు. ఈ చర్య బ్రిటిష్ కంపెనీకి కోపం తెప్పించింది. బ్రిటిష్ పెట్రోలియం కంపెనీ అక్కడ పెట్టుబడి పెట్టి చమురు వెలికితీసేది.
తరువాత విప్లవం రావడంతో యూఎస్ మొహ్మద్ రెజా పహ్లవికి మద్దతు ఇచ్చింది. ఇతను వాషింగ్టన్ ఆధిపత్యాన్ని అంగీకరించారు. అలా దాదాపు 26 సంవత్సరాలు వారికి అనుకూలంగా నిర్ణయాలు తీసుకున్నాడు.
ఇదే సమయంలో ఇజ్రాయెల్ తో ఇరాన్ సంబంధాలు అత్యున్నత స్థాయిలో కొనసాగాయి. అరబ్ శత్రుత్వం ఉన్న ఈ ప్రాంతంలో మూడు దేశాలు కలిపి ఒక వ్యూహాత్మక కూటమిని ఏర్పాటు చేశాయి. ‘‘ఇరాన్, యూఏఈ సంబంధాలు సినిమా’’ స్క్రిప్ట్ ను పోలి ఉన్నాయని ‘ది ఫెడరల్’ కన్సల్టింగ్ ఎడిటర్ కేఎస్ దక్షిణామూర్తి అన్నారు.
మారిన పొత్తులు..
ఇరు దేశాల మధ్య స్నేహంపై అనేక ప్రభావాలు ఉన్నాయి. అదే సమయంలో షా 1967 లో జరిగిన అరబ్- ఇజ్రాయెల్ యుద్ధంపై ఇజ్రాయెల్ ను బహిరంగంగా విమర్శించాడు. కానీ తమ స్నేహం మాత్రం కొనసాగించాడు.
1979 లో ఇస్లామిక్ విప్లవం తరువాత ఈ సంబంధాలు పూర్తిగా నిలిచిపోయాయి. అమెరికా ఎంబసీని ముట్టడించి వారిని బందీలుగా చేసుకోవడంతో వాషింగ్టన్ తన దౌత్య సంబంధాలను తెంచుకుంది.
తరువాత ఇరు దేశాలు అపనమ్మకంతోనే వ్యవహరిస్తున్నాయి. మధ్యలో రీగన్ పాలనా కాలంలో తెరవెనక మంతనాలు జరిపాయి. ముఖ్యంగా లెబనాన్ సంఘర్షణ సమయంలో ఈ సంభాషణలు జరిగాయి.
1990 లలో ఇరాన్ తన అణు కార్యక్రమం చాలా నిశ్శబ్ధంగా ముందుకు తీసుకెళ్లింది. ఇదే సమయంలో అమెరికా దృష్టి ఇరాక్, ఆఫ్ఝనిస్తాన్ వైపు మళ్లింది. ఇజ్రాయెల్ కూడా ఇరాన్ తో సంబంధాలు పునరుద్దరించడానికి ప్రయత్నించింది
కానీ అవి విఫలం అయ్యాయి. 2003 లో సద్దాం హుస్సేన్ పతనం తరువాత కొత్త సమస్యలు ప్రారంభం అయ్యాయి. ఇరాన్ అధ్యక్షుడు మహ్మద్ అహ్మదీ నెజాద్ ఇజ్రాయెల్ ను గుర్తించడానికి నిరాకరించాడు. అంతేకాకుండా దానిని నాశనం చేయాలని బహిరంగా పిలుపునిచ్చాడు.
అణు ఉద్రిక్తతలు..
అహ్మదీ నెజాద్ చపలమాటలు ఇజ్రాయెల్, అమెరికా ఓ ఆయుధం అందేలా చేశాయి. ‘‘ఇజ్రాయెల్, అమెరికాతో 12 రోజుల యుద్ధం ఈ దశలో కొత్త హింసాత్మక యుద్ధం’’ అని దక్షిణామూర్తి విశ్లేషించారు. జార్జ్ డబ్ల్యూ బుష్ పరిపాలన ఇరాన్ నిర్వహిస్తున్న అణు కార్యక్రమం పరిశీలనను విస్తృతం చేసింది. దానిని అంతర్జాతీయంగా రక్షణాత్మక స్థితిలోకి నెట్టేసింది.
ఒబామా హయాంలో దౌత్య ప్రయత్నాలు 2015 లో కొత్త అణు ఒప్పందానికి దారి తీశాయి. కానీ ట్రంప్ 2018 లో దానిని ఏకపక్షంగా రద్దు చేశారు. 2014 - 2017 మధ్య కమాండర్ ఖాసీం సులేమాని నేతృత్వంలోని ఐఎస్ఐఎస్ కు వ్యతిరేకంగా ఇరాన్ సహకారం శత్రుత్వాన్ని మార్చడానికి పెద్దగా సహయపడలేదు.
తరువాత సులేమాని హత్య చేయడం, ఇజ్రాయెల్ అణు శాస్త్రవేత్త మొహ్సెన్ ఫక్రిజాదేను హత్య చేయించారు. ఇది అమెరికా-ఇరాన్ మధ్య సంబంధాలను మరింత ఆజ్యం పోసింది.
మున్ముందు ఏం జరగబోతోంది..
‘‘ఇప్పుడే ముగిసిన 12 రోజుల వివాదం ఒక రౌండ్ రక్తపాతానికి పరాకాష్ట’’ అని దక్షిణామూర్తి అన్నారు. ఉద్రిక్తతలు తాత్కాలికంగా చల్లబడవచ్చని కానీ త్వరలోనే మళ్లీ చెలరేగే అవకాశం ఉందని అన్నారు. అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య సంక్లిష్టమైన చరిత్రతో ముందుకు సాగే మార్గం అనూహ్యంగా ఉందన్నారు. ‘‘ఈ దశలు అన్ని సాధ్యమే’’ అంటూ ఆయన ముగించారు.
Next Story