‘‘దాడిని ఆమోదించి.. అంతలోనే ఆపేసిన ట్రంప్’’
x
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్

‘‘దాడిని ఆమోదించి.. అంతలోనే ఆపేసిన ట్రంప్’’

ఇరాన్ అణు కేంద్రాలపై దాడులు చేయడానికి సిద్ధమవుతున్న యూఎస్ఏ, భారత విద్యార్థుల కోసం ఆపరేషన్ సింధూ ప్రారంభించి కేంద్రం


ఇజ్రాయెల్- ఇరాన్ వివాదంలోకి అమెరికా దూరబోతోంది. ఇరాన్ లోకి కీలక స్థావరాలు, అణు కేంద్రాలే లక్ష్యంగా దాడులు చేయడాకి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆమోదం తెలిపారు.

అయితే చివరి క్షణంలో వేచి చూసే ధోరణి ప్రదర్శించి దాడిని తాత్కాలికంగా నిలుపుదల చేశారు. తమతో వెంటనే ఒప్పందానికి రావాలని, చర్చల ప్రక్రియ ఇప్పటికే ఆలస్యం అయిందని ఆయన అన్నారు.

మరో వైపు ఇరాన్ సుప్రీంలీడర్ ఈ నిర్ణయం పై అగ్గిమీద గుగ్గిలం అయ్యారు. అమెరికా కనుక దాడి చేస్తే ఆ దేశం కోలుకోకుండా చేస్తామని హెచ్చరించారు. ఇరాన్ ఎవరికి లొంగబోదని, ట్రంప్ చేసిన హెచ్చరికలను తోసిపారేశారు. ఈ మేరకు ఆయన పేరుతో ఒక రికార్డ్ చేసిన వీడియోను ఇరాన్ విడుదల చేసింది.

దాడి చేయాలని అనుకోవడం లేదు కానీ..
ఇరాన్ పై అమెరికా దాడి చేయాలని అనుకోవడం లేదని, అయితే అణు కార్యక్రమం నిర్మూలించడానికి మాత్రం తాము సిద్దంగా ఉన్నామని ట్రంప్ అన్నారు.
ఇరాన్ అణు కార్యక్రమాన్ని దెబ్బతీయడానికి అమెరికా- ఇజ్రాయెల్ చేతులు కలిపిన ఆయన పదునైన వ్యాఖ్యలు చేసి చేస్తూ శత్రువును హడలగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. అయితే అమెరికా దాడి చేస్తే తగిన ప్రతీకారం తప్పదని ఇరాన్ మాత్రం హెచ్చరికలు జారీ చేస్తోంది.
‘‘నేను పోరాడాలని చూడటం లేదు’’ అని ట్రంప్ ఓవల్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో అన్నారు. ‘‘పోరాటమా.. లేదా అణ్వాయుధ సంపాదించడమా మధ్య ఏదీ ఉత్తమమే అది చేయాలి’’ అని వ్యాఖ్యానించారు. చర్చల ప్రక్రియకు ఇంకా ద్వారాలు తెరిచే ఉన్నాయని అన్నారు.
‘‘నేను దీన్ని చేయవచ్చు.. చేయకపోవచ్చు’’ అని ట్రంప్ మరొక సంభాషణలో వ్యాఖ్యానించారు. ‘‘నేను ఏం చేయబోతున్నానో ఎవరికి తెలియదు, ఏది పూర్తయ్యే వరకూ పూర్తి కాదు’’ అని ట్రంప్ అన్నారు.
‘‘కానీ వచ్చే వారం చాలా పెద్దదిగా ఉంటుంది. బహుశా ఒక వారం కంటే తక్కువ సమయమే ఉంది’’ అన్నారు. ఇరాన్ బేషరతుగా లొంగిపోవాలనే తన పిలును అయతుల్లా అలీ ఖమేనీ పట్టించుకోకపోవడం ట్రంప్ తనదైన శైలిలో ఆగ్రహం వ్యక్తం చేశారు..
ఇస్లామిక్ రిపబ్లిక్ ను లక్ష్యంగా చేసుకుని అమెరికా చేసే ఏవైన దాడులు వారికి కోలుకోలేని విధంగా నష్టాన్ని కలిగిస్తాయన్నారు. అయితే ట్రంప్ మాటలను ఖమేనీ తిరస్కరించారు. ‘‘ఇరాన్ దాని ప్రజలు, ఈ దేశ చరిత్ర తెలిసిన వ్యక్తులు ఎవరైన సరే బెదిరింపు భాషలో మాట్లాడరు. ఎందుకంటే ఇరాన్ లొంగిపోదు’’ అని అన్నారు.
అమెరికా జోక్యం వల్ల అమెరికన్లకే కోలుకోలేని నష్టం జరుగుతుందని ఆ దేశం గ్రహించాలని ఈ వీడియోలో హెచ్చరించారు. ప్రస్తుతం ఆయన అండర్ గ్రౌండ్ లో ఉన్నారు. ఆయన మాట్లాడిన వీడియోలో చుట్టూ కర్టెన్లు, ఇరాన్ జాతీయ జెండా, 1989 లో మరణించిన గ్రాండ్ అయతుల్లా రుహెల్లా ఖమేనీ చిత్రపటం మాత్రమే ఉన్నాయి.
ఆపరేషన్ సింధూ..
ఇరాన్ లో చిక్కకున్న భారత విద్యార్థులను సురక్షితంగా దేశానికి చేర్చడానికి కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ సింధూను ప్రారంభించింది. ప్రస్తుతం యుద్దంలో చిక్కుకున్న 110 భారతీయ విద్యార్థులను దాని సరిహద్దు దేశమైన ఆర్మేనియాకు చేరుకోగా వారిని తీసుకురావడానికి వెళ్లిన విమానం ఈ రోజు ఉదయం న్యూఢిల్లీలో దిగింది.
ఇజ్రాయెల్- ఇరాన్ మధ్య పెరుగుతున్న యుద్ధం మధ్య టెహ్రన్ లో ఉంటున్న చాలామంది భారతీయ విద్యార్థులను నగరం నుంచి సురక్షితంగా తరలించారు. వారిని క్షేమంగా స్వదేశానికి తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.
Read More
Next Story