
ఇరాన్ పై అమెరికా దాడి, ప్రపంచానికి ఏం అర్థమైంది?
పశ్చిమాసియా పరిణామాలపై ఫెడరల్ ఇంటర్వ్యూలో కీలక విషయాలు వివరించిన ఫెడరల్ కన్సల్టింగ్ ఎడిటర్ కే ఎస్ దక్షిణామూర్తి
అభిజిత్ సింగ్ భాంబ్రా
ఇరాన్- ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ద పరిధి పెరిగింది. ఇరాన్ అణు కేంద్రాలపై అమెరికా బాంబుల వర్షం కురిపించడంతో ఇది తీవ్రమైన ప్రాంతీయ ఘర్షణలు మారే సూచనలు కనిపిస్తున్నాయి.
ఈ పరిణామం ప్రపంచవ్యాప్తంగా ఆందోళనను రేకెత్తించింది. ప్రపంచ దేశాలన్నీ యుద్దాన్ని విరమించాలని దౌత్యం ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని పిలుపునిచ్చాయి.
ప్రపంచ పరిణామాలను కూలకషంగా వివరించడానికి ‘ది ఫెడరల్’ మా కన్సల్టింగ్ ఎడిటర్ కే.ఎస్. దక్షిణామూర్తితో మాట్లాడింది. ఆయన ఇక్కడ జరుగుతున్న వ్యూహాత్మక తప్పులు, ఏకపక్షవాదం , భారత్ కు, ప్రపంచానికి దాని అర్థం ఏమిటో వివరించే ప్రయత్నం చేశారు.
ఇరాన్ అణు కేంద్రాలపై దాడి చేయడం ద్వారా అమెరికా ఇప్పుడు ఇరాన్- ఇజ్రాయెల్ వివాదంలోకి ప్రవేశించింది. మీ ఆలోచనలు ఏమిటీ?
ఇది కచ్చితంగా అనివార్యం అని చెప్పను. ఆ పదం వాడటం నిస్సహాయతను సూచిస్తుంది. ఈ సందర్భంలో అది నిజం కాదు. యునైటెడ్ స్టేట్స్ తీసుకున్న ఈ నిర్ణయం ఒక వ్యూహాత్మక తప్పిదం.
ఇది ఇప్పుడు జరగకూడదు. ఇరాన్, అమెరికాను నేరుగా బెదిరించలేదు. ఇజ్రాయెల్ కూడా ఇరాన్ నుంచి ఎలాంటి ముప్పును ఎదుర్కోలేదు. ఈ మొత్తం వివాదం ఇజ్రాయెల్, ఇరాన్ పై బాంబు దాడి చేయడంతో ప్రారంభమయింది.
ఈ వివాదం రెండింటి మధ్యే ఉండాలి. కానీ డొనాల్డ్ ట్రంప్ అనూహ్యంగా వివాదంలోకి దూరాడు. ఈ పరిణామం గల్ప్ కే పరిమితం కాకుండా ప్రపంచంపైనా తీవ్ర ప్రభావం చూపుతుంది.
ముఖ్యంగా ఇరాన్ తో ఇప్పటికే ఐదు రౌండ్ల చర్చలు జరిగాయని పరిగణలోకి తీసుకుంటే అమెరికా యుద్దంలోకి దిగడానికి ఎలాంటి ఆధారం, సమర్థన లేదు.
ఇరాన్ చాలాసార్లు చర్చలకు అంగీకరించింది. 2015 అణు ఒప్పందం నుంచి 2018 లో ట్రంప్ ఏకపక్షంగా బయటకు వచ్చారు. ఇప్పుడు మరోసారి ఇరాన్ పై దాడి చేయడం ద్వారా ఆ గాయంపై ఉప్పు చల్లే ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన నిర్ణయానికి ఇజ్రాయెల్ నుంచి తప్ప ఇతర దేశాల నుంచి పెద్దగా మద్దతు లభిస్తుందని నేను అనుకోను.
ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ ప్రతిజ్ఞ చేయడం, దాని వ్యతిరేకంగా అమెరికా హెచ్చరించడాన్ని మీరు ఎలా చూస్తారు?
అమెరికా, ఇజ్రాయెల్ సైనిక బలంతో పోలిస్తే ఇరాన్ చాలా బలహీనంగా ఉంది. కానీ ఇరాన్ మరీ అంత తీసిపోయినట్లుగా ఉందని దీని అర్థం కాదు. ఇది ఇప్పటికే ఇజ్రాయెల్ పై 20-30 క్షిపణులను ప్రయోగించింది.
ఇది యుద్దానికి సిద్దంగా ఉందని స్పష్టం చేసింది. ఇక్కడ కీలకమైన ప్రశ్న ఏమిటంటే... ఇరాన్ ఇలా ఎంతదూరం వెళ్తుంది. అమెరికా వివాదంలోకి ప్రవేశిస్తే పశ్చిమాసియాలోని అమెరికన్ స్థావరాలను లక్ష్యంగా చేసుకుంటామని ఇరాన్ అనేక సార్లు హెచ్చరించింది.
వీటిలో అతిదగ్గరగా కీలకమైన ఖతార్ బేస్ తో పాటు ఇంకా అనేక స్థావరాలు ఉన్నాయి. ఇరాన్, అమెరికా స్థావరాలపై దాడులు చేస్తే అది సైనికపరంగా మరింత ఉద్రిక్తతలు రేకేత్తిస్తుంది.
ఈ స్థావరాలు నిర్వహిస్తున్న దేశాలకు ఇది రాజకీయంగా క్లిష్టతరమైన సమస్యలను సృష్టిస్తుంది. వారి సార్వభౌమత్వం సవాల్ ఎదురవుతుంది. ఇది ట్రంప్ ను మరింత రెచ్చగొట్టవచ్చు.
ఇరాన్ లోకి అమెరికా బలగాలను పంపవచ్చనే సూచనలు కూడా వస్తున్నాయి. ఇరాన్ కఠినమైన పరిస్థితులను ఎదుర్కొంటోంది. అది ప్రతీకారం తీర్చుకోలేకపోతే అంతర్గతంగా దాని ప్రతిష్ట మంటగలుస్తుంది.
కానీ ప్రతీకారం తీర్చుకుంటే దాని ఉనికికే ముప్పు ఏర్పడుతుంది. ఇది అనేక కఠినమైన నిర్ణయాలు తీసుకుని ముందుకు పోవాల్సి ఉంటుంది.
అమెరికా ఎందుకు ఇరాన్ అణు కేంద్రాలను లక్ష్యంగా చేసుకుంది? అణుబాంబు పొందకుండా ఆపడానికేనా?
ఇది అమెరికా చర్య కాదని నేను భావిస్తాను. ఇది కేవలం వ్యక్తిగతంగా డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయం. జనవరి 20 న పదవీ బాధ్యతలు స్వీకరించినప్పటికీ ఆయన ప్రపంచాన్ని మాత్రమే కాకుండా అమెరికాలోని చాలామందిని దిగ్భ్రాంతికి గురిచేసే నిర్ణయాలు తీసుకున్నారు.
ఇది వాటిలో ఒకటి. ఈ చర్యను పూర్తిగా ట్రంప్, ఆయన అంతర్గత వర్గాలే నడిపిస్తున్నాయి. దీనికి సంస్థాగత మద్దతు లేదు. కాంగ్రెస్ ఆమోదం తెలపలేదు. ఈ ఉద్రిక్తతపై అమెరికాలోనే వ్యతిరేకత కనిపిస్తోంది.
ఇది ట్రంప్ ఏకపక్ష వైఖరిని ప్రతిబింబిస్తుంది. ఈ పరిణామాలు పూర్తిగా ఊహించలేనివి. అనూహ్య నిర్ణయాలు తీసుకునే ట్రంప్ లాంటి వ్యక్తితో తరువాత ఏం చేస్తారో ఊహించడం చాలా కష్టం. దురదృష్టవశాత్తూ అతను ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశానికి నాయకత్వం వహిస్తున్నాడు.
ట్రంప్ ఊహించలేని పరిస్థితిని దృష్టిలో ఉంచుకుంటే పరిణామాలు మరింత దిగజారేలా కనిపిస్తుందా?
ట్రంప్ అహంకారం మెండుగా ఉన్న వ్యక్తి. ఇరాన్ ప్రతీకారం తీర్చుకుంటే లేదా ప్రతిఘటన చేసిన ట్రంప్ తన బలాన్ని చూపించడానికి ప్రయత్నిస్తాడు. పశ్చిమాసియాలోని ఏదేని అమెరికా స్థావరంపై ఇరాన్ దాడి చేస్తే ట్రంప్ మరింత దూకుడుగా నిర్ణయాలు తీసుకుంటాడు.
బుష్ హాయాంలోనే 2003 లో అమెరికా ఇరాక్ పై దాడి చేసి ఆక్రమించింది. అప్పటి పరిణామాల గురించి వారికి తెలుసు కాబట్టి తరువాత ఇరాన్ పై దాడి చేయాలనుకున్నా చేయలేదు. కానీ ట్రంప్ ఇవన్నీ ఆలోచించే రకం కాదు. అందుకే ఇది ప్రమాదకరంగా మారింది.
ఈ కొత్త వివాదం భారత్ పై ఎలాంటి ప్రభావం చూపుతుంది?
భారత్ కూడా మిగిలిన ప్రపంచం లాగే తీవ్రంగా దెబ్బతింటుంది. పశ్చిమాసియా ప్రాంతం భారత్ కు కీలకన ప్రాంతమే కాదు, వ్యూహాత్మకంగా, ఆర్థికంగానూ బలాన్ని ఇస్తుంది. మన చమురులో అత్యధిక భాగం ఇక్కడి నుంచి వస్తోంది. ఇది పశ్చిమదేశాలకు కూడా ప్రవేశ ద్వారంలా పనిచేస్తుంది.
ఇక్కడ ఏదైన వివాదం ఏర్పడితే ఈ వివాదం ఇంధన అవసరాలు, వాణిజ్య మార్గాలను ప్రమాదంలోకి తోసేస్తుంది. పరిస్థితి మరింత దిగజారితే తక్షణ ఫలితం కనిపిస్తుంది.
పెరుగుతున్న చమురు ధరలు, ప్రపంచ సరఫరా గొలుసులలో అంతరాయం ఏర్పడి భౌగోళిక రాజకీయ అస్థిరతకు కారణం అవుతుంది. ఇది భారత్ విస్మరించలేని విషయం కాదు. ట్రంప్ చేసిన పనికి మనందరికి కష్టకాలం ప్రారంభం అవుతుంది.
Next Story