ముందుకు పోలేక, వెనక్కి రాలేక 12 గంటల నరకం
x

ముందుకు పోలేక, వెనక్కి రాలేక 12 గంటల నరకం

ముంబై- పూణె హైవేపై ట్రాఫిక్ జామ్, గ్యాస్ ట్యాంకర్ బోల్తా, లీకైన గ్యాస్


Click the Play button to hear this message in audio format

ముంబై- పూణే ఎక్స్ ప్రెస్ హైవేపై గ్యాస్ ట్యాంకర్ బోల్తా పడటంతో ప్రయాణీకులు నరకం చూశారు. దాదాపు 12 గంటల పాటు ట్రాఫిక్ జామ్ కావడంతో వందలాది వాహానాలు రోడ్డుపైనే నిలిచిపోయాయి. ప్రయాణికులకు ఆహారం, నీరు, టాయిలెట్ సౌకర్యాలు లేక అల్లాలాడిపోయారు.

ట్రాఫిక్ మళ్లింపు..

ఎక్స్‌ప్రెస్ ‌వే కంట్రోల్ రూమ్ ప్రకారం, మంగళవారం సాయంత్రం జరిగిన గ్యాస్ ట్యాంకర్ ప్రమాదం కారణంగా ముంబైకి వెళ్లే ట్రాఫిక్‌ను పూణేకు వెళ్లే క్యారేజ్‌వేపై దాదాపు 2 కిలోమీటర్ల దూరం మేర నిలిచిపోయింది.
ఇదే సమయంలో ట్యాంకర్ నుంచి గ్యాస్ లీక్ కావడం ప్రారంభించింది. వాహనం దగ్గరకు ఎవరూ వెళ్లడానికి ధైర్యం చేయకపోవడంతో 12 గంటల పాటు ట్రాఫిక్ జామ్ ఏర్పడిందని హైవే అధికారులు తెలిపారు.
ఈ ప్రభావం వాహనదారులపై తీవ్రంగా ఉంది, అనేక మంది ప్రయాణికులు గంటల తరబడి చిక్కుకుపోయారు. ఎక్స్‌ప్రెస్‌వే కంట్రోల్ రూమ్ ప్రకారం, మంగళవారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ముంబై-పుణే ఎక్స్‌ప్రెస్‌వేపై ట్యాంకర్ బోల్తా పడింది. తిరిగి ఉదయం 5 గంటల వరకూ ట్రాఫిక్ కు క్లియర్ కాలేదు.

అదోషి సొరంగం దగ్గర సంఘటన..

రాయ్‌గఢ్ జిల్లాలోని అదోషి సొరంగం సమీపంలో ఈ సంఘటన జరిగింది. అధిక వేగంతో ప్రయాణిస్తున్న ట్యాంకర్ వాలు కారణంగా నియంత్రణ కోల్పోయి బోల్తా పడింది. ప్రమాదం జరిగిన వెంటనే, ట్యాంకర్ నుంచి గ్యాస్ లీక్ కావడం వాహనదారులలో భయాందోళనలకు కారణమైందని ఒక అధికారి తెలిపారు.
ట్యాంకర్‌లో ప్రొపైలిన్ గ్యాస్ ఉంది. దీనికి మండే స్వభావం అధికం. ముందు జాగ్రత్త చర్యగా, ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా నిరోధించడానికి పోలీసులు వెంటనే ముంబై వైపు ట్రాఫిక్‌ను మూసివేశారు. దీనిపై ప్రయాణికులు తమ ఆగ్రహాన్ని సామాజిక మాధ్యమాల వేదికగా పంచుకున్నారు.
"ప్రజలు ట్రాఫిక్ లో చిక్కుకుపోయారు, సహాయం కోసం తీవ్రంగా ఎదురుచూస్తున్నారు. దయచేసి ఏదైనా చేయండి" అని వ్యాస్ కర్ణ్ అనే ఒక యూజర్ ఎక్స్ లో పోస్ట్ చేశారు.
మహారాష్ట్ర రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (MSRTC) బస్సు కండక్టర్ అర్ధరాత్రి సమయంలో PTIతో మాట్లాడారు. తమ వాహనం ప్రమాద స్థలం సమీపంలో ఆరు గంటలకు పైగా నిలిచిపోయిందని, ప్రయాణికులకు ఆహారం, నీరు, టాయిలెట్ సౌకర్యాలు లేకుండా పోయాయని చెప్పారు.

'ఇప్పుడు అక్షరాలా పార్కింగ్ స్థలం'

చాలామంది వాహనదారులు సోషల్ మీడియాలో తమ నిరాశను వ్యక్తం చేశారు, కొందరు ఎక్స్‌ప్రెస్‌వేను "పార్కింగ్ స్థలం"గా అభివర్ణించారు. అవసరమైతే తప్ప ప్రయాణాన్ని చేయవద్దని మరికొంతమంది రాసుకొచ్చారు.
"ముంబై-పుణే ఎక్స్‌ప్రెస్‌వే ప్రస్తుతం పార్కింగ్ స్థలం. లోనావాలా - ఖండాల సమీపంలో ట్రక్కు బోల్తా పడటం వల్ల గంటల తరబడి ట్రాఫిక్ జామ్ అయింది. మీరు ప్రయాణించాల్సిన అవసరం లేకపోతే, ప్రయాణించకండి" అని ఎక్స్ యూజర్ pranav_72 రాశారు.
ట్రాఫిక్ జామ్‌ల కారణంగా పూణేకు వెళ్లే వాహనదారులు కూడా ఇబ్బంది పడ్డారు. "అంధేరీ వెస్ట్ నుంచి సాయంత్రం 7 గంటలకు క్యాబ్ ద్వారా నా ప్రయాణాన్ని ప్రారంభించాను. తెల్లవారుజామున 3.40 గంటలకు పూణే చేరుకున్నాను. నేను ఇది ఎప్పుడూ అనుభవించని చెత్త ట్రాఫిక్ అనుభవం" అని మరొక ఎక్స్ యూజర్ సోహిత్ మానిక్ రాశారు.
Read More
Next Story