ఎన్‌కౌంటర్‌లో నక్సల్స్ హతం, ఎదురుకాల్పుల్లో జవాను మృతి
x

ఎన్‌కౌంటర్‌లో నక్సల్స్ హతం, ఎదురుకాల్పుల్లో జవాను మృతి

ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం నారాయణపూర్ జిల్లాలో శనివారం ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఈ ఘటనలో నక్సలైట్లతో పాటు ఒక జవాన్ చనిపోయారు. మరో ఇద్దరి జవాన్లు గాయపడ్డారు.


ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం నారాయణపూర్ జిల్లాలో శనివారం ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఈ ఘటనలో నక్సలైట్లతో పాటు ఒక జవాన్ చనిపోయారు. మరో ఇద్దరి జవాన్లు గాయపడ్డారు.

నారాయణపూర్, కంకేర్, దంతేవాడ, కొండగావ్ - ఈ నాలుగు జిల్లాలకు చెందిన భద్రతా సిబ్బంది నారాయణపూర్ జిల్లా అభుజ్మద్ అడవిలో నక్సలైట్ల కోసం కూంబింగ్ నిర్వహించారు. ఇద్దరి మధ్య జరిగిన కాల్పుల్లో 8 మంది నక్సల్స్, ఒక జవాన్ మృతిచెందారని, మరో ఇద్దరు జవాన్లు గాయపడ్డారని రాయ్‌పూర్‌లోని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.

నాలుగు జిల్లాలకు చెందిన డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ (డిఆర్‌జి), స్పెషల్ టాస్క్ ఫోర్స్ (ఎస్‌టిఎఫ్), ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటిబిపి) 53వ బెటాలియన్‌ల సిబ్బందితో కూడిన కూబింగ్ ఆపరేషన్ జూన్ 12న ప్రారంభించినట్లు ఆయన తెలిపారు.

Read More
Next Story