అసెంబ్లీ ముందుకు 2026-27 ఆర్థిక బడ్జెట్
x

అసెంబ్లీ ముందుకు 2026-27 ఆర్థిక బడ్జెట్

రూ.22,002 కోట్లు రెవిన్యూలోటుతో బడ్జెట్


ఆంధ్రప్రదేశ్ 2026-27 వార్షిక బడ్జెట్ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఈ రోజు శాసనసభలో ప్రవేశపెట్టారు.

రూ.3,32,205.33 కోట్లతో బడ్జెట్ నురూపొందించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయు స్వర్ణాంధ్ర- 2047కు అనుగుణంగా బడ్జెట్‌ను రూపొందించామని కేశవ్ తన ప్రసంగంలో పేర్కొన్నారు.
కూటమి ప్రభుత్వం వచ్చాక పెట్టుబడిదారులకు అనుకూల వాతావరణం ఏర్పడిందని చెబుతూ
స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మా కొత్త విధానం అన్నారు. విధ్వంసం నుంచి వికాసం వైపు రాష్ట్రాన్ని తీసుకెళ్తున్నామని, అది బడ్జెట్ లో కనిపిస్తుందని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధిని, ప్రజా సంక్షేమాన్ని జోడెడ్ల బండిలా పరుగులు పెట్టించాలన్న ప్రభుత్వ సంకల్పాన్ని ప్రతిబింబించే బడ్జెట్ ను ప్రవేశ పెడుతున్నామని మంత్రి చెప్పారు.
బడ్జెట్ హైలైట్స్:
2026-27 వార్షిక బడ్జెట్‌లో రెవెన్యూ వ్యయం రూ.2,56,143 కోట్లు, మూలధన వ్యయం రూ.53,915 కోట్లు.
రెవెన్యూ లోటు రూ.22,002 కోట్లు, ద్రవ్య లోటు రూ.75,868 కోట్లు.
రాజధాని అమరావతి నిర్మాణానికి ఏపీ ప్రభుత్వం బడ్జెట్లో రూ.6 వేల కోట్లు కేటాయించింది.
విద్యుత్ రంగానికి రూ.13,934 కోట్లు; రోడ్లు, పోర్టు, విమానాశ్రయాలకు రూ. 13,546 కోట్లు; పరిశ్రమలకు రూ.3,161 కోట్లు కేటాయించింది.

ఆర్థిక మండళ్లు (Economic Regions):

విశాఖ ఆర్థిక ప్రాంతం (10 జిల్లాలు): రూ. 28,000 కోట్లు.

రాయలసీమ అభివృద్ధి: రాయలసీమను గ్లోబల్ హార్టికల్చర్ హబ్‌గా మార్చేందుకు ఏకంగా రూ. 30,000 కోట్లు

మౌలిక సదుపాయాలు: రోడ్లు, పోర్టులు, ఎయిర్‌పోర్టుల కోసం రూ. 13,546 కోట్లు.

విద్యుత్ రంగం: నిరంతర నాణ్యమైన విద్యుత్ సరఫరా కోసం రూ. 13,934 కోట్లు.

ఎన్టీఆర్ వైద్య సేవ: పేదలకు మెరుగైన వైద్యం కోసం రూ. 4,000 కోట్లు.

గృహ నిర్మాణం: ఇళ్ల నిర్మాణ రంగానికి రూ. 5,451 కోట్లు.

తాగునీరు & పారిశుధ్యం: జల్ జీవన్ మిషన్ కింద రూ. 4,000 కోట్లు,

స్వచ్ఛ భారత్ మిషన్‌కు రూ. 1,037 కోట్లు.

పరిశ్రమలు: పారిశ్రామికాభివృద్ధికి రూ. 3,161 కోట్లు.కీలక సంస్థలకు నిధులు

వీబీ జీ రామ్ జీ: ఈ పథకం/సంస్థ కోసం రూ. 8,365 కోట్లు.

సర్దుబాటు నిధి: అత్యవసర అవసరాల కోసం రూ. 1,500 కోట్లు.

Read More
Next Story