రోడ్డు ప్రమాదంలో ఆంధ్రా ఎమ్మెల్సీ సాబ్జీ మృతి
x
రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్సీ సాబ్జీ మృతి

రోడ్డు ప్రమాదంలో ఆంధ్రా ఎమ్మెల్సీ సాబ్జీ మృతి

ఉపాధ్యాయ నియోజకర్గం ఫ్రొగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ నుంచి ఎమ్మెల్సీగా సాబ్జీ ఎన్నికయ్యారు.


ఆంధ్రప్రదేశ్ పశ్చిమగోదావరి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఉపాధ్యాయ (పిడిఎఫ్) ఎమ్మెల్సీ షేక్ సాబ్జి చనిపోయారు. ఉండి మండలం చెరుకువాడ జాతీయ రహదారిపై సాబ్జీ కారుకు ఎదురుగా వస్తున్న మరొక కారు ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలిసింది. ప్రమాదంలో ఎమ్మెల్సీ షేక్ సాబ్జి కన్నుమూశారు. ఈ ఘటనలో గాయపడిన ఎమ్మెల్సీ కారు డ్రైవర్, గన్‌మెన్, పీఏలను ఆసుపత్రికి తరలించారు.



అంతకు ముందు ఆయన భీమవరంలో అంగన్ వాడీ సమ్మెలో పాల్గొన్నారు. ఏలూరు జిల్లాలో ఆశా వర్కర్స్ యూనియన్ చేస్తున్న దీక్షకు మద్దతు తెలుపుడానికి వెళ్తున్నారు.మార్గ మధ్యంలో ఈప్రమాదం జరిగింది. ఎమ్మెల్సీ మృతదేహాన్ని భీమవరం హాస్పిటల్ కు తరలించారు. సమాచారం తెలిశాక జిల్లా కలెక్టర్ ప్రశాంతి, జిల్లా ఎస్పీ రవి ప్రకాష్ భీమవరం హాస్పిటల్ కు చేరుకున్నారు. ఆయన మృతితో అంగన్ వాడి కార్యకర్తలు విషాదంలో మునిగిపోయారు.

Read More
Next Story