రాజ్యసభ బలంకంటే.. ఎన్డీఏ సుస్థిరతకే ప్రాధాన్యం ఇస్తున్నారా?
x

రాజ్యసభ బలంకంటే.. ఎన్డీఏ సుస్థిరతకే ప్రాధాన్యం ఇస్తున్నారా?

రాజ్యసభలో అవసరమైన మెజారిటీకి ఎన్డీఏ కూటమికి కొన్ని అడుగుల దూరంలోనే ఆగిపోయింది. ఇంతకుముందు టర్మ్ లో మద్ధతు ఇచ్చిన రెండు ప్రధాన పార్టీలు బీజేపీకి దూరంగా జరగడంతో


ఎన్నికల ఫలితాల తరువాత బీజేపీ మైండ్ సెట్ లో మార్పు వచ్చింది. పార్లమెంట్ సమావేశాల్లో ఈ విషయం స్పష్టంగా గోచరించింది. దేశ రాజకీయ వ్యవస్థలో వచ్చిన మార్పు అధికార బీజేపీ కొత్త వాస్తవాలతో వ్యవహరించవలసిన అవసరమొచ్చింది. ఈ ప్రక్రియలో, పార్టీ కొన్ని పెద్ద నిర్ణయాలు తీసుకోవలసి వచ్చింది. అందులో ఒకటి రాజ్యసభలో మెజారిటి తో పాటు, లోక్ సభలో ఎన్డీఏ ప్రభుత్వానికి స్థిరత్వానికి ప్రాధాన్యత ఇవ్వడం.

లోక్‌సభ ఎన్నికల అనంతర దృష్టాంతంలో, ఎగువ సభలో 11 మంది ఎంపీలను కలిగి ఉన్న YRSCP, 9 మంది ఎంపీలను కలిగి ఉన్న BJD మద్దతును బీజేపీ కోల్పోయింది. ఈ 20 మంది ఎంపీలు ప్రధానమంత్రి నరేంద్రమోదీ చివరి టర్మ్ (2019-2024)లో రాజ్యసభలో కీలకమైన బిల్లులను ఆమోదించడంలో కీలక పాత్ర పోషించారు.
విమర్శకుల మద్దతును..
ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ (టీడీపీ)తో రాష్ట్రంతో పాటు జాతీయ స్థాయిలో చేతులు కలపాలని నిర్ణయించుకున్న తర్వాత బీజేపీకి సవాలు మొదలైంది. ఎన్ చంద్రబాబు నాయుడు, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మధ్య సాగుతున్న బ్యాలెన్సింగ్ యాక్ట్ ఇక పనికి రాదని గ్రహించిన బీజేపీ నాయకత్వం లోక్‌సభ ఎన్నికలకు ముందు టీడీపీతో పొత్తును అధికారికంగా చేసుకుని వైఎస్సార్‌సీపీతో అవగాహనను వదులుకుంది. “మేము NDAతో లేము, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సంబంధించిన సమస్యలను లేవనెత్తమని మా నాయకుడు మాకు చెప్పారు” అని వైఎస్సార్సీపీ రాజ్యసభ ఎంపీ మేడా రఘునాథ్ రెడ్డి ఫెడరల్‌తో అన్నారు.
అంతేకాదు, ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ చారిత్రాత్మక విజయం సాధించడంతో బిజూ జనతాదళ్ (బీజేడీ)తో అవగాహనకు తెరపడింది. ప్రాంతీయ పార్టీ ఇప్పుడు రాష్ట్ర అసెంబ్లీతో పాటు రాజ్యసభలో ప్రతిపక్ష పాత్ర పోషిస్తోంది. ఈ రెండు పార్టీలు పార్లమెంటులో బిజెపికి సాయం చేయడానికి సిద్ధంగా లేవు.
“ఇది మా నాయకుడు నవీన్ పట్నాయక్ నిర్ణయం. రాష్ట్రానికి, దేశానికి సంబంధించిన అంశాలను లేవనెత్తుతూ ప్రతిపక్ష పాత్ర పోషిస్తాం. మేం ఎన్‌డిఎలో భాగం కాదు కానీ అంతకుముందు దానికి మద్దతిచ్చాం. మేము ఇప్పుడు ఒడిశా అసెంబ్లీ, పార్లమెంటు రెండింటిలోనూ ప్రతిపక్ష పాత్రను పోషిస్తాము, ”అని BJD రాజ్యసభ MP, ఆ పార్టీ జాతీయ ప్రతినిధి సులతా డియో ఫెడరల్‌తో అన్నారు.
అతిపెద్ద ఏకైక పార్టీ
87 మంది ఎంపీలతో రాజ్యసభలో బీజేపీ ఏకైక అతిపెద్ద పార్టీగా మిగిలిపోయినప్పటికీ, అధికార కూటమికి మెజారిటీ తక్కువగా ఉండటం పెద్ద సమస్యగా పరిణమించనుంది. 226 మంది సభ్యులున్న ఎగువ సభలో ఎన్‌డిఎ సంఖ్య 106గా ఉంది. మెజారిటీ మార్క్ 114 కు మరో 8 సీట్ల దూరంలో ఉంది.
ఇండి కూటమి పార్టీలు కలిసి కనీసం 86 మంది ఎంపీలను కలిగి ఉన్నాయి. ఇప్పుడు వీటికి మరో 20 మంది ఎంపీలు జత కలిశారు. వారే వైఎస్సాఆర్ సీపీ, బీజేడీ నాయకులు. రెండూ కలిసి కేంద్ర ప్రభుత్వంతో విభేదిస్తున్నట్లయితే, ప్రతిపక్ష పార్టీల బలం బిజెపికి కష్టాలను మరింత పెంచినట్లే. ఇవి కలిస్తే NDA సంఖ్యలతో సరిపోలుతుంది.
ఇటీవల ముగిసిన ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ, బీజేడీ రెండు ప్రాంతీయ పార్టీలు ఓడిపోవడమే కాకుండా సార్వత్రిక ఎన్నికల్లో కూడా రాణించకపోవడంతో రాజకీయ లెక్కలు తారుమారయ్యాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
ఒడిశా రాజకీయాలపై తాము దృష్టి సారిస్తామని బీజేపీతో బీజేడీకి స్పష్టమైన అవగాహన ఉంది. అయితే, BJD ఈసారి రాష్ట్రంలో అధికారం నుంచి దూరమయింది. లోక్‌సభ ఎన్నికలలో కూడా మంచి పనితీరు కనబరచలేదు. బీజేపీ చేతిలో బీజేడీ ఓడిపోవడంతో ఎన్డీయే ప్రధాన ప్రత్యర్థిగా మారింది.
రాష్ట్ర రాజకీయాలపై దృష్టి సారించాలని భావించిన YSRCPకి పరిస్థితి భిన్నంగా లేదు, కానీ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలలో రాజకీయ ప్రాభావాన్ని కోల్పోయింది. ఇప్పుడు, ఆంధ్రప్రదేశ్‌లో కోల్పోయిన ప్రాబల్యాన్ని తిరిగి పొందాలంటే వైఎస్‌ఆర్‌సిపి నాయకత్వం ఎన్‌డిఎను వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది” అని మధ్యప్రదేశ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్స్ రీసెర్చ్ డైరెక్టర్ యతీంద్ర సింగ్ సిసోడియా ది ఫెడరల్‌తో అన్నారు.
Read More
Next Story