తెలుగు రాష్ట్రాలకు కాంగ్రెస్‌ కోఆర్డినేటర్లు వీరే!
x

తెలుగు రాష్ట్రాలకు కాంగ్రెస్‌ కోఆర్డినేటర్లు వీరే!

తెలుగు రాష్ట్రాలు సహా వివిధ రాష్ట్రాలకు పార్లమెంటు కో ఆర్డినేటర్లను నియమించింది ఏఐసీసీ. తెలంగాణలోని 17 పార్లమెంటు సీట్లకు నియమించింది.


తెలుగు రాష్ట్రాలు సహా వివిధ రాష్ట్రాలకు పార్లమెంటు కో ఆర్డినేటర్లను నియమించింది ఏఐసీ సీ. తెలంగాణలోని 17 పార్లమెంటు సీట్లకు నియమించింది. కో ఆర్డినేటర్లుగా నియమితులైన వారిలో మంత్రులు, పార్టీ సీనియర్లు ఉన్నారు. సీతక్కకు ఆదిలాబాద్‌, కొండా సురేఖకు వరంగల్‌ బాధ్యతను అప్పగించారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు పార్లమెంటు కో ఆర్డినేటర్లను నియమించింది ఏఐసీసీ. ఆంధ్రప్రదేశ్‌లోని 25 పార్లమెంటు సీట్లకు పార్టీ సీనియర్లను కోఆర్డినేటర్లుగా నియమించింది. కో ఆర్డినేటర్లుగా నియమితులైన వారిలో మాజీ మంత్రులు, పార్టీ సీనియర్లు ఉన్నారు. మాజీ మంత్రి కనుమూరి బాపిరాజుకు ఏలూరు, మరో సీనియర్‌ నేత డాక్టర్‌ తులసి రెడ్డికి రాజంపేట, చిత్తూరుకు డి. రాంభూపాల్ రెడ్డిని నియమించింది ఏఐసీసీ.

తెలంగాణ కోఆర్డినేటర్లు వీరే...

తెలంగాణలోని 17 పార్లమెంటు నియోజకవర్గాలున్నాయి. వాటికి కోఆర్డినేటర్లుగా నియమితులైన వారిలో సీఎం రేవంత్ రెడ్డి మొదలు రాష్ట్ర మంత్రి సీతక్క వరకు ఉన్నారు. చేవెళ్ల, మహబూబ్‌నగర్‌ పార్లమెంట్‌ కోఆర్డినేటర్‌గా సీఎం రేవంత్‌రెడ్డి, హైదరాబాద్‌, సికింద్రాబాద్ పార్లమెంట్‌ కోఆర్డినేటర్‌గా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మహబూబాబాద్, ఖమ్మం పార్లమెంట్‌ కోఆర్డినేటర్‌గా రాష్ట్రమంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఎస్టీ నియోజకవర్గమైన ఆదిలాబాద్‌ బాధ్యతను రాష్ట్రమంత్రి సీతక్కకు, పెద్దపల్లికి రాష్ట్రమంత్రి శ్రీధర్‌బాబును, కరీంనగర్ లోక్‌సభ సీటుకు రాష్ట్రమంత్రి పొన్నం ప్రభాకర్‌కు అప్పగించారు. పార్టీ సీనియర్‌ నేత జీవన్‌రెడ్డికి నిజామాబాద్, జహీరాబాద్‌కు సుదర్శన్ రెడ్డి, మెదక్‌ బాధ్యతను దామోదర రాజనరసింహకు అప్పగించింది ఏఐసీసీ. మల్కాజిగిరికి తుమ్మల నాగేశ్వరరావు, నాగర్‌కర్నూల్‌ బాధ్యతను జూపల్లి కృష్ణారావుకి, నల్లగొండకి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, భువనగిరికి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, వరంగల్ పార్లమెంట్‌ కోఆర్డినేటర్‌గా కొండా సురేఖను ఏఐసీసీ నియమించింది.

ఆంధ్రప్రదేశ్ కోఆర్డినేటర్లుగా వీరు...

ఏపీలోని 25 స్థానాలకు పార్లమెంట్ కోఆర్డినేటర్లను నియమించారు. అరకు (ఎస్టీ) లోక్‌సభ నియోజకవర్గ బాధ్యతను జగతా శ్రీనివాస్, శ్రీకాకుళం - మీసాల సుబ్బన్న, విజయనగరం - బొడ్డేపల్లి సత్యవతి, విశాఖపట్నం - కొత్తూరి శ్రీనివాస్, అనకాపల్లి - సనపాల అన్నాజీరావు, కాకినాడ - కే.బీ.ఆర్. నాయుడు, అమలాపురం - (ఎస్సీ) ఎం. వెంకట శివ ప్రసాద్, రాజమండ్రి - ముషిని రామకృష్ణ, నరసాపురం - జెట్టి గురునాధరావు, ఏలూరు - కనుమూరి బాపి రాజు, మచిలీపట్నం - కొరివి వినయ్ కుమార్, విజయవాడ - డి.మురళీ మోహన్ రావు, గుంటూరు - గంగిశెట్టి ఉమాశంకర్, నరసరావుపేట - వి.గురునాధం, బాపట్ల - (ఎస్సీ) శ్రీపతి ప్రకాశం, ఒంగోలు - యు.వెంకటరావు యాదవ్, నంద్యాల - బండి జకారియా, కర్నూలు - పి.ఎం. కమలమ్మ, అనంతపురం - ఎన్ శ్రీహరి ప్రసాద్, హిందూపూర్ - షేక్ సత్తార్, కడప - ఎం. సుధాకర్ బాబు, నెల్లూరు - ఎం.రాజేశ్వరరావు, తిరుపతి (ఎస్సీ) - షేక్ నాజర్ అహమ్మద్, రాజంపేట - డాక్టర్‌ ఎన్. తులసి రెడ్డి, చిత్తూరు (ఎస్సీ) నియోజకవర్గానికి డి. రాంభూపాల్ రెడ్డిని కోఆర్డినేటర్లుగా నియమించారు. ఈ కోఆర్డినేటర్లు పార్టీని సమన్వయం చేయడంతో పాటు ఎవరికి సీట్లు ఇవ్వాలనే దానిపై సిఫార్సు చేస్తారని తెలుస్తోంది.

Read More
Next Story