
ఛత్తీస్గఢ్ లో రైలు ప్రమాదం, 8 మంది మృతి
మెమ్యూ ప్యాసింజర్ , గూడ్స్ రైలు ఢీ
ఛత్తీస్గఢ్లోని బిలాస్ పూర్ రైల్వే స్టేషన్ సమీపాన జరిగిన ఒక రైలు ప్రమాదంలో 8 మంది చనిపోయారు. మెమ్యూ (MEMU (mainline electric multiple unit) ప్యాసింజర్ రైలు, గూడ్స్ రైలు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం ఎలా జరిగిందో ఇంకా స్పష్టంగా తెలియడం లేదు. ఈ ప్రమాదం మంగళవారం మధ్యాహ్నం 4 గంటలపుడు జరిగింది. గేవ్రా నుంచి బిలాస్పుర్ వైపు వెళ్తున్న మెమ్యూ ప్యాసింజర్ రైలు, గూడ్స్ ట్రైన్ను వెనుక నుంచి ఢీకొట్టింది. గటోరా, బిలాస్ పూర్ స్టేషన్ల మధ్య ఈ ప్రమాదం జరిగింది. 214680 ఫలితంగా ప్యాసింజర్ రైలు ముందు భాగం గూడ్స్ ట్రైన్పైకి ఎక్కింది. ఒక బోగీ పూర్తిగా దెబ్బతింది. ప్రమాదంలో 8 మంది చనిపోయారు, మరొక ఇద్దరు ఇంకా బోగీలో చిక్కుకున్నారు. మరొక 17 మందికి తీవ్రంగా గాయాలయ్యాని తెలిసింది.
Next Story

