దేశ రాజధానిలో కొనసాగుతున్న రైతుల నిరసన
x

దేశ రాజధానిలో కొనసాగుతున్న రైతుల నిరసన

కనీస మద్దతు ధర, లఖింపూర్ ఖేరీలో ఘటనలో నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ రైతులు ఢిల్లీ చేరుకున్నారు.


ఢిల్లీలోని 'మహాపంచాయత్' వద్ద రైతుల నిరసన కొనసాగుతోంది. వ్యవసాయ రంగానికి సంబంధించి కేంద్రం అనుసరిస్తున్న విధానాలకు నిరసనగా "కిసాన్ మజ్దూర్ మహాపంచాయత్"లో పాల్గొనేందుకు గురువారం (మార్చి 14) న్యూఢిల్లీలోని రాంలీలా మైదానానికి రైతులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.

సంయుక్త కిసాన్ మోర్చా నాయకులు మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా 2020-21లో ఢిల్లీ సరిహద్దుల్లో నాయకత్వం వహించారు. పంట ఉత్పత్తులకు కనీస మద్దతు ధర, లఖింపూర్ హింసాకాండలో నిందితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీకి చేరుకున్నారు. పంజాబ్‌లోని పాటియాలాకు చెందిన హర్మన్ సింగ్ అనే రైతు బుధవారం (మార్చి 13) రాత్రి రాజధానికి చేరుకున్నట్లు చెప్పారు. కేంద్రం అనుసరిస్తున్న విధానాలు రైతులకు అనుకూలంగా ఉండాలని, పంటలకు కనీస మద్దతు ధర ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నామని చెప్పారు. పంజాబ్‌కు చెందిన రవీందర్ సింగ్ అనే రైతు ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరీలో అక్టోబర్ 2021లో జరిగిన హింసాకాండలో నిందితులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ‘‘లఖింపూర్ ఖేరీలో రైతులపై కారు నడిపిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. బాధిత కుటుంబ సభ్యులకు నష్టపరిహారంతోపాటు ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని ఆయన కోరారు.

పాటియాలాకు చెందిన బల్జీత్ సింగ్ మాట్లాడుతూ.. ‘‘బుధవారం రాత్రి ఢిల్లీకి చేరుకున్నాం. గురువారం ఉదయం ప్రార్థన చేయడానికి సిస్ గంజ్ సాహిబ్ గురుద్వారాను సందర్శించాం. కార్యక్రమం ముగిసిన తర్వాత మేము బంగ్లా సాహిబ్ గురుద్వారాకు వెళ్తాం. ఆపై పంజాబ్‌కు తిరిగి వస్తాం.’’ అన్నారు.

ఢిల్లీలో ట్రాఫిక్ మళ్లింపు..

రైతుల నిరసన దృష్ట్యా సెంట్రల్ ఢిల్లీకి వెళ్లే వారు మరో మార్గంలో వెళ్లాలని పోలీసులు డ్రైవర్లకు చెబుతున్నారు. రైతులు తమ ట్రాక్టర్ ట్రాలీలతో రాజధానికి రావద్దని కోరడంతో పాటుగా ఢిల్లీ సరిహద్దుల్లో పారామిలటరీ సిబ్బంది సంఖ్యను కూడా పెంచినట్లు అధికారులు తెలిపారు. 5,000 మంది కంటే ఎక్కువ మంది ప్రజలు గుమిగూడకూడదనే షరతుతో ఢిల్లీ పోలీసులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి రైతులకు అనుమతి ఇచ్చారు. ట్రాక్టర్ ట్రాలీలను ఢిల్లీకి తీసుకురావద్దని, రాంలీలా మైదాన్‌కు మార్చ్‌గా వెళ్లవద్దని రైతులను కోరారు.

Read More
Next Story