
రోడ్డు ప్రమాద బాధితులకు రూ.1.5లక్ష వరకు ఉచిత వైద్యం
రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి రూ.1.5 లక్షల వరకూ ఉచిత వైద్యం అందించడానికి వీలు కల్పిస్తూ కేంద్ర రహదారుల రవాణాశాఖ మే 5న నోటిఫికేషన్ జారీ చేసింది.
రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి రూ.1.5 లక్షల వరకూ ఉచిత వైద్యం అందించడానికి వీలు కల్పిస్తూ కేంద్ర రహదారుల రవాణాశాఖ మే 5న నోటిఫికేషన్ జారీ చేసింది. ఇది తక్షణమే అమల్లోకి వచ్చినట్లు అందులో ప్రకటించింది.
రోడ్డు ప్రమాద బాధితులకు ఆపత్కాల సమయంలో (గోల్డెన్ అవర్)లో ఉచిత వైద్యం అందించాలని సుప్రీంకోర్టు గత జనవరిలో తీర్పు ఇచ్చింది. ఈ నేపథ్యంలో నేపథ్యంలో కేంద్రం ఇప్పుడు నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందుకు ‘క్యాష్లెస్ ట్రీట్మెంట్ ఆఫ్ రోడ్ యాక్సిడెంట్ విక్టిమ్స్ స్కీం-2025’గా పేరు పెట్టింది.
మోటారు వాహనం కారణంగా ఏ రహదారిలో ప్రమాదానికి గురైనా ఈ పథకం కింద ఆసుపత్రుల్లో రూ.1.50 లక్షల వరకూ నగదు రహిత వైద్య సేవలు పొందడానికి అర్హులవుతారు. ప్రమాదం జరిగిన నాటి నుంచి ఏడు రోజులదాకా ఈ సేవలు పొందవచ్చు. రోగులకు ట్రామా, పాలీట్రామా సేవలు అందించగల సామర్థ్యం ఉన్న అన్ని ఆసుపత్రులనూ ఈ పథకం కిందికి తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఈ నోటిఫికేషన్లో సూచించింది.
రోడ్డు ప్రమాద బాధితుడిని ఆసుపత్రికి తెచ్చిన వెంటనే వైద్య సేవలు ప్రారంభించాల్సి ఉంటుంది. ఒకవేళ తమవద్ద సౌకర్యాలు లేకపోతే వెంటనే మరో ఆసుపత్రికి పంపాల్సి ఉంటుంది. అందుకోసం సదరు ఆసుపత్రివారే రవాణా సౌకర్యాలు కల్పించాలి.
బాధితుడు డిశ్చార్జి అయిన తర్వాత వైద్య సేవలు అందించిన ఆసుపత్రి అందుకు సంబంధించిన బిల్లును ప్యాకేజీకి అనుగుణంగా పోర్టల్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది.
Next Story