భార్య కడుపు కోసి వారసుడిని చంపేశాడు...
x

భార్య కడుపు కోసి వారసుడిని చంపేశాడు...

భార్య కడుపులో ఉన్నది మగబిడ్డా, ఆడబిడ్డా అని తెలుసుకునేందుకు ఓ వ్యక్తి దారుణానికి పాల్పడ్డాడు. ఐదుగురు ఆడపిల్లల తర్వాత మళ్ళీ ఆడపిల్ల పుడుతుందేమోననే అనుమానంతో అమానుషంగా ప్రవర్తించాడు.


భార్య కడుపులో ఉన్నది మగబిడ్డా, ఆడబిడ్డా అని తెలుసుకునేందుకు ఓ వ్యక్తి దారుణానికి పాల్పడ్డాడు. ఐదుగురు ఆడపిల్లల తర్వాత మళ్ళీ ఆడపిల్ల పుడుతుందేమోననే అనుమానంతో అమానుషంగా ప్రవర్తించాడు. ఆవేశంలో కొడవలితో ఆమె కడుపు చీల్చి లింగ నిర్ధారణ చేసుకునేందుకు ప్రయత్నించాడు. ఈ ఘాతుకంతో తాను కోరుకున్న మగబిడ్డని తానే చంపుకున్నాడు. చేసిన పనికి జీవితఖైదు అనుభవిస్తున్నాడు.

వివరాల్లోకి వెళితే...

ఉత్తర్ ప్రదేశ్ లోని బదౌన్ లో నివాసముంటున్న పన్నా లాల్, అనిత దంపతులకు వరుసగా ఐదుగురు ఆడపిల్లలు జన్మించారు. భార్య ఆడపిల్లల్నే కంటుందని పన్నా లాల్ ఆమెని తరచు వేధిస్తుండేవాడు. 2020 సెప్టెంబర్ లో వీరిద్దరి మధ్య వివాదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఈ విషయం పెద్దలవరకు వెళ్లడంతో అనిత తల్లిదండ్రులు పన్నా లాల్ ని కన్విన్స్ చేయడానికి ప్రయత్నించారు. కూతురిని వేధించొద్దని వేడుకున్నారు. వారసుడి కోసం తాను వేరొకరిని వివాహం చేసుకోవాలి అనుకుంటున్నానని తెగేసి చెప్పాడు. పెద్దలు సర్ది చెప్పడంతో విడాకుల విషయాన్ని పక్కనపెట్టాడు.

లింగ నిర్ధారణకు కొడవలితో కడుపు కోసిన భర్త...

అనిత మరోసారి గర్భం దాల్చింది. ఆమె ఎనిమిది నెలల గర్భవతిగా ఉన్నప్పుడు మళ్ళీ ఆడపిల్లని కంటుందేమో అనే అనుమానంతో అనితతో గొడవకి దిగాడు పన్నా లాల్. కడుపు కోసి మగబిడ్డో, ఆడబిడ్డో చెక్ చేస్తానని ఆమెని బెదిరించాడు. అనిత ఎదురుతిరగగా ఆమెపై దాడి చేశాడు. ఆవేశంతో ఆమె కడుపుని కొడవలితో కోశాడు. తీవ్రంగా గాయపడిన అనిత అరుపులు పెడుతూ బయటకి పరుగులు పెట్టింది. దగ్గర్లోనే ఆమె సోదరుడి దుకాణం ఉంది. అనితని ఆ స్థితిలో చూసిన సోదరుడు ఆమెని వెంటనే ఆసుపత్రికి తరలించాడు. భయంతో పన్నా లాల్ ఇల్లు వదిలి పారిపోయాడు. ఘటనపై అనిత కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

మగబిడ్డ మృతి.. పన్నా లాల్ కి జీవిత ఖైదు...

పన్నా లాల్ దాడి తర్వాత తీవ్ర గాయాలపాలైన అనితకి వైద్యులు చికిత్స అందించి బతికించారు. కానీ ఆమె కడుపులో ఉన్న మెగా శిశువు మరణించాడు. పన్నా లాల్ ఎంతగానో కోరుకున్న వారసుడిని తానే స్వయంగా చంపుకున్నాడు. ఈ ఘటనపై తాజాగా కోర్టులో విచారణ జరిగింది. న్యాయస్థానం పన్నా లాల్ కి జీవిత ఖైదు విధించింది. కోర్టులో వాదనల సమయంలో అనిత సోదరులతో అతనికి ఆస్తుల గొడవలు అవుతుండటంతో ఆమె స్వయంగా కడుపు కోసుకుందని పన్నా లాల్ చెప్పడం గమనార్హం.

Read More
Next Story