
తెలంగాణలోని 17 జిల్లాలకు భారీ వర్ష సూచన!
ఫిబ్రవరి 24న తెలంగాణలోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. హైదరాబాద్లో ఆకాశం మేఘావృతమై తేలికపాటి జల్లులు పడవచ్చు.
తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. రేపు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. భారత వాతావరణ శాఖ (IMD) తాజా బులెటిన్ ప్రకారం, ఫిబ్రవరి 24 (మంగళవారం) నాడు రాష్ట్రంలోని 17 జిల్లాలకు థండర్స్టార్మ్ అలర్ట్ ఇచ్చింది. ఆదిలాబాద్, కుమ్రం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి జిల్లాల్లో అక్కడక్కడా మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది.
వీటితో పాటు జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లోనూ వాతావరణం ఇలాగే ఉండవచ్చు. రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, సంగారెడ్డి, నాగర్కర్నూల్ జిల్లాల్లోనూ ఉరుములు సంభవించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. మరోవైపు హైదరాబాద్ మరియు దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో రాబోయే 24 గంటల పాటు ఆకాశం సాధారణంగా మేఘావృతమై ఉంటుందని వాతావరణ శాఖ పేర్కొంది.
నగరంలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని తెలిపింది. నగరంలో గరిష్ట ఉష్ణోగ్రత 32 డిగ్రీల సెల్సియస్గా, కనిష్ట ఉష్ణోగ్రత 22 డిగ్రీల సెల్సియస్గా నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు వివరించారు. వాతావరణంలో వస్తున్న ఈ మార్పుల దృష్ట్యా ఆయా జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

