కార్గిల్: 700 మంది ప్రజలను ఎయిర్ లిప్ట్ చేసిన ఎయిర్ ఫోర్స్
కేంద్ర పాలిత ప్రాంతమైన లఢక్- జమ్మూకాశ్మీర్ మధ్య మంచులో చిక్కుకుపోయిన సాధారణ ప్రజలను ఐఏఎఫ్ ఎయిర్ లిఫ్ట్ చేసింది.
కేంద్ర పాలిత ప్రాంతమైన లఢక్, జమ్మూకాశ్మీర్ ప్రాంతాల మధ్య మంచులో చిక్కుకున్న 700 మంది సాధారణ ప్రజలను భారత వైమానిక దళం తరలించింది. ఇందులో 514 మంది ప్రయాణికులను జమ్మూ నుంచి లేహ్ కు ఐఎల్ -76 వరకూ తరలించారు. అలాగే 223 మందిని శ్రీనగర్ నుంచి లేహ్కు మరొక విమానంలో తరలించినట్లు అధికారి తెలిపారు.
దీనితో, ఈ వారం మొత్తం 1,251 మందిని జమ్మూ కాశ్మీర్, లడఖ్ మధ్య ఎయిర్లిఫ్ట్ చేసినట్లు అయింది. అంతకుముందు సోమవారం, 331 మంది ప్రయాణికులను కార్గిల్ కొరియర్ గా పిలవబడే AN-32 విమానంలో జమ్మూ -కాశ్మీర్ మధ్య IAFకార్గిల్కు తరలించింది. భారీ హిమపాతం కారణంగా 434-కిమీల శ్రీనగర్-లేహ్ జాతీయ రహదారిని మూసివేసిన తరువాత జనవరి 22న కార్గిల్ కొరియర్ సేవలను IAF ప్రారంభించింది.
కార్గిల్ కొరియర్ సర్వీస్ జమ్మూ, శ్రీనగర్ మధ్య వారానికి మూడు రోజులు.. శ్రీనగర్ నుంచి కార్గిల్ మధ్య వారానికి రెండుసార్లు ఒంటరిగా ఉన్న ప్రయాణీకుల సౌకర్యార్థం భారత వైమానిక దళం ప్రారంభించింది..ప్రయాణీకులు తమ కదలికను సులభతరం చేసినందుకు అన్ని అధికారులకు, ముఖ్యంగా IAFకి కృతజ్ఞతలు తెలిపారు.
Next Story