
భైంసా మున్సిపాలిటీలో ఎగిరిన పతంగ్
భైంసాలో మజ్లిస్ జోరు…బోధన్లో 12 వార్డులు కైవసం
తెలంగాణ మున్సిపల్ ఫలితాల్లో ఏఐఎంఐఎం సత్తా
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో ఏఐఎంఐఎం (All India Majlis-e-Ittehadul Muslimeen) గణనీయ విజయాలు నమోదు చేసింది. ముఖ్యంగా నిర్మల్ జిల్లాలోని భైంసా, నిజామాబాద్ జిల్లాలోని బోధన్ పట్టణాల్లో మజ్లిస్ పార్టీ అభ్యర్థులు ప్రభావం చూపుతూ పలు వార్డులను కైవసం చేసుకున్నారు. అంతేకాదు, రాష్ట్రవ్యాప్తంగా మరికొన్ని మున్సిపాలిటీల్లోనూ మజ్లిస్ అభ్యర్థులు పలు వార్డుల్లో విజయం సాధించడం గమనార్హం.
భైంసాలో ఎగిరిన పతంగ్
తెలంగాణ రాష్ట్రంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో భైంసా, బోధన్ మున్సిపాలిటీల్లో ఆల్ ఇండియా మజ్లిస్ ఏ ఇత్తేహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) పార్టీ అభ్యర్థులు సత్తా చాటారు.నిర్మల్ జిల్లా మతపరంగా అత్యంత సెన్సిటివ్ అయిన భైంసా పట్టణంలో మజ్లిస్, స్వతంత్ర అభ్యర్థులు ఎన్నికల్లో విజయం సాధించారు. భైంసాలో మజ్లిస్ ఇప్పటివరకు ఎనిమిది వార్డులను గెలుచుకుంది. ఆరు వార్డులను బీజేపీ తిరుగుబాటుదారులు సహా స్వతంత్రులు గెలుచుకున్నారు.
బోధన్లో 12 వార్డుల్లో మజ్లిస్ విజయం
బోధన్ పట్టణంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో మజ్లిస్ పార్టీ 12 వార్డులను గెలుచుకుంది.మజ్లిస్ పార్టీ విజేతలు రఫీక్ (వార్డ్ 3), సమీర్ (వార్డ్ 5), అకీల్ (వార్డ్ 7), రఫీ (వార్డ్ 8), అలీమ్ (వార్డ్ 12), మీర్ ఇలియాస్ అలీ (వార్డ్ 18), అన్సారీ కహ్మ్ (వార్డ్ 27), ముజాహిద్ బాబర్ (వార్డ్ 28), అల్వార్ల్ట్ (330), వలీ (330వవార్డ్), (వార్డ్ 32) ఖైఖాషా కౌసర్ (వార్డ్ 38).
మున్సిపాలిటీ వార్డుల్లోనూ మజ్లిస్ అభ్యర్థుల విజయం
కాగజ్నగర్ మున్సిపల్ కౌన్సిల్లోని వార్డ్ నంబర్ 3 నుంచి మజ్లిస్ అభ్యర్థి అబ్దుల్ ముబీన్ విజయం సాధించారు.సంగారెడ్డి మున్సిపల్ కౌన్సిల్లోని వార్డ్ నంబర్ 5 నుంచి ఏఐఎంఐఎం (AIMIM) అభ్యర్థి ఐజాజ్ విజయం సాధించారు.జహీరాబాద్ మున్సిపాలిటీలో మజ్లిస్ పార్టీ రెండు స్థానాలను గెలుచుకుంది. వార్డు నంబర్ 8 (దళితుల రిజర్వుడ్ స్థానం) నుంచి సున్నమ్మ, మొహమ్మద్ అలీ విజయం సాధించారు.జగిత్యాల్లో 31, 34 వార్డులను మజ్లిస్ గెలుచుకుంది.బాన్స్ వాడ మున్సిపాలిటీలో మజ్లిస్ అభ్యర్థిని ఫరా నాజ్ గెలుపొందారు.వికారాబాద్లోని 4వ వార్డు నుంచి AIMIM ప్రాతినిధ్యం వహిస్తున్న షబ్బీర్ హుస్సేన్ గెలుపొందారు.
వార్డుల్లో విజయ పతాకం
నిర్మల్లో మజ్లిస్ అభ్యర్థి ముజాహిద్ అలీ 29వ వార్డు నుంచి గెలిచారు. నారాయణపేటలో ఏఐఎంఐఎం అభ్యర్థి మహ్మద్ తకీ చంద్ 23వ వార్డును గెలుచుకున్నారు.కొడంగల్లోని 9వ వార్డు నుంచి మజ్లిస్ అభ్యర్థి సనా అఫ్రీన్ విజయదుందుభి మోగించారు.కోహిర్ అధ్యక్షుడిగా కూడా పనిచేస్తున్న రఫీ మజ్లిస్ పార్టీ తరపున 8వ వార్డు నుంచి గెలిచారు.నల్గొండలో ఏఐఎంఐఎం రెండు స్థానాల్లో విజయం సాధించింది. వార్డు నంబర్ 46 నుంచి పట్టణ అధ్యక్షుడు రఫీ ఉద్దీన్ గెలుపొందగా, వార్డు నంబర్ 29 నుంచి నదీమ్ విజయపతాక ఎగురవేశారు.వీటితోపాటు తెలంగాణ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాల్లోనూ పలు మున్సిపల్ డివిజన్లలో మజ్లిస్ అభ్యర్థులు గెలిచారు.
మొత్తంగా చూసుకుంటే తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో మజ్లిస్ పార్టీ పట్టణ ప్రాంతాల్లోనూ ప్రభావం చూపించింది. భైంసా, బోధన్ వంటి కీలక పట్టణాల నుంచి రాష్ట్రంలోని పలు మున్సిపాలిటీల వరకు పార్టీ అభ్యర్థులు సాధించిన విజయాలు స్థానిక రాజకీయ సమీకరణాలను ప్రభావితం చేసే అవకాశముంది.
Next Story

