మమతను, అభిషేక్‌ను చంపేస్తామని పోస్టర్..
x

మమతను, అభిషేక్‌ను చంపేస్తామని పోస్టర్..

టిఎంసి చీఫ్ మమతా బెనర్జీ, ఆమె మేనల్లుడు, పార్టీ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీని చంపేస్తామని వెలిసిన పోస్టర్‌తో పోలీసులు అప్రమత్తమయ్యారు.


పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టిఎంసి అధినేత్రి మమతా బెనర్జీ, ఆమె మేనల్లుడు, పార్టీ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీని చంపేస్తామని రాసిన పోస్టర్‌తో పోలీసులు అప్రమత్తమయ్యారు. శుక్రవారం పశ్చిమ బెంగాల్‌లోని హౌరా జిల్లా పరిధిలోని ఉలుబెరియాలో కనిపించిన ఈ పోస్టర్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోస్టర్‌ మీద బెంగాలీ భాషలో ఇలా ఉంది: “నేను ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, అభిషేక్‌ను కారుతో ఢీకొట్టి చంపేస్తాను. ఆ తర్వాత అందరూ దీపాలు వెలిగిస్తారు. నా దగ్గర ఒక రహస్య లేఖ ఉంది." అని తెల్లటి గుడ్డపై ఆకుపచ్చ సిరాతో చేతితో రాసి ఉంది. మే 20న లోక్‌సభ ఎన్నికలు జరగనున్న ఉలుబెరియాలోని ఫులేశ్వర్ ప్రాంతంలోని ఓ నిర్మాణ స్థలంలో ఈ పోస్టర్ కనిపించింది. "రహస్య లేఖ’’ అంటే ఏమిటో తెలియాల్సి ఉంది. ఇది ఆకతాయి పనిగా పోలీసులు భావిస్తున్నారు. అయితే ఇందులో ఒకే వ్యక్తి ప్రమేయం ఉందా? లేక ఇంకెవరైనా ఉన్నారా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని ఒక పోలీసు అధికారి తెలిపారు.

Read More
Next Story